టాలీవుడ్ లో బిజీ అండ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీలీలనే. వేరే ఆప్షన్ లేదు. చేతి నిండా సినిమాలతో నెలకు కనీసం ఒక్క రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకోవడం తనకే చెల్లింది. ముందే అనుకుని చేసేది కాకపోయినా మహేష్ బాబు నుంచి వైష్ణవ్ తేజ్ దాకా అందరూ తననే జోడిగా కోరుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. అయితే ఈ అమ్మడి డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. రెమ్యునరేషన్ ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చినా సరే నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు కానీ శ్రీలీల డేట్స్ పట్టుకోవడం మాత్రం పెద్ద సవాల్ గా మారుతోంది.
ఈ విషయానికి సంబంధించి హీరో రామ్ ఒక పేలిపోయే కామెంట్ చేశాడు. మాములుగా శ్రీలీల డే అఫ్(సెలవు)తీసుకుంటే ఏం చేస్తుందనే ఓ ఇంటర్వ్యూ ప్రశ్నకు భలే సమాధానం చెప్పాడు. ఈ అమ్మాయి కనక షూటింగులకు బ్రేక్ తీసుకుంటే అది ఇండస్ట్రీ మొత్తానికి హాలిడే ఇచ్చినట్టేననే, అయితే ప్రీ లేదా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేరని తేల్చి చెప్పాడు. అంటే ముప్పాతిక పైగా పెద్ద సినిమాల్లో తనే హీరోయిన్ కాబట్టి బిజీగా ఉండటం తప్ప ఇంకో ఛాయస్ లేదని అనేశాడు. ప్రతి శుక్రవారం కొత్త హీరోతో ప్రమోషన్ లో పాల్గొనాల్సిందేనని పంచు వేశాడు.
రామ్ ఎంత సరదాగా అన్నా అందులో నిజం లేకపోలేదు. శ్రీలీల అచ్చంగా అదే ఫేజ్ లో ఉంది. ఒకవైపు చిత్రీకరణలు, మరో వైపు విడుదలకు సిద్ధంగా ఉన్న వాటి కోసం పాల్గొనాల్సిన ప్రమోషన్లు, మీడియాకు ఇవ్వాల్సిన ఇంటర్వ్యూలు ఒకటా రెండా డైరీ బాగా ప్యాక్ అయిపోతోంది. ఈ నెల స్కందతో పలకరిస్తే అక్టోబర్ లో భగవంత్ కేసరి, నవంబర్ లో ఆదికేశవ, డిసెంబర్ లో ఎక్స్ ట్రాడినరీ మ్యాన్, జనవరిలో గుంటూరు కారం ఇలా వరసగా లైనప్స్ ఉన్నాయి. దాదాపు అన్నీ సగంపైగానే పూర్తయ్యాయి. డిసెంబర్ లో ఎంబిబిఎస్ పరీక్షల కోసం శ్రీలీల నిజంగానే లీవులు పెట్టనుండటం ఫైనల్ ట్విస్టు.
This post was last modified on September 23, 2023 10:02 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…