మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి విలక్షణ చిత్రాలతో మొదలుపెట్టి ప్రాజెక్ట్ కె దాకా అడుగులు వేసిన స్వప్న సినిమా ఇప్పుడు ఓటిటి మూవీస్ కూడా అందించనుంది. నిత్య మీనన్ టైటిల్ పాత్ర పోషించిన కుమారి శ్రీమతి ఈ నెల 28న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నానితో ట్రైలర్ విడుదల చేయించారు. కాన్సెప్ట్ వెరైటీగా అనిపిస్తోంది. గోమటేష్ ఉపాధ్యే దర్శకత్వంలో రీజనబుల్ బడ్జెట్ లో కేవలం కంటెంట్ ని నమ్ముకుని తీసినట్టున్నారు. కథ ఏంటో స్పష్టంగా రెండు నిమిషాల వీడియోలో చెప్పేశారు.
ముప్పై ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాని అమ్మాయి పేరు శ్రీమతి(నిత్య మీనన్). తమ నుంచి అన్యాయంగా తీసుకున్న పాత ఇల్లుని బాబాయ్ నుంచి తీసుకోవడమే లక్ష్యంగా కోర్టులో పోరాడుతుంది. ప్రేమంటూ ఓ అబ్బాయి(తిరువీర్)వెంటపడుతూ ఉంటాడు. అయితే డబ్బు చెల్లించి ఆ ఇంటిని స్వంతం చేసుకోవచ్చంటూ తీర్పు రావడంతో తన పదమూడు వేల జీతంతో అది అసాధ్యమని గుర్తిస్తుంది. ఆరు నెలల గడువులో అంత డబ్బు సంపాదించాలంటే మద్యం వ్యాపారం చేయడం ఒక్కటే మార్గమని అర్థమై అన్నంత పని చేస్తుంది. ఇక్కడి నుంచి అసలు సవాళ్లు మొదలవుతాయి
పాయింట్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. వినోదమే ప్రధానంగా ప్రేక్షకులను నవ్వించడమే టార్గెట్ పెట్టుకున్నారు గోమటేష్. తిరువీర్ తో పాటు గౌతమి, నిరుపమ్, ప్రణీత, తాళ్ళూరి రామేశ్వరి, మురళీమోహన్ లాంటి క్యాస్టింగ్ తోడవ్వడంతో క్వాలిటీ కనిపిస్తోంది. ఇంటిల్లిపాది చూసేందుకు కావాల్సిన కాలక్షేపమైతే దట్టించారు. అయితే హీరోయిన్ డబ్బు కోసం బారు పెట్టుకోవడమనే బ్యాక్ డ్రాప్ వెరైటీగా ఉంది.ఇది కన్విన్సింగ్ గా చెప్పగలిగితే చాలు హిట్టు పడ్డట్టే. ఇలాంటి కంటెంట్ ఓటిటికి పర్ఫెక్ట్ ఛాయస్. బాగుంటే చాలు మిలియన్ల వ్యూస్ వచ్చి పడతాయి. నిత్య మీనన్ ఎలాంటి మేజిక్ చేసిందో చూడాలి.
This post was last modified on September 22, 2023 7:56 pm
వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…
నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…
రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…
ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…
కాలు జారితే తీసుకోవచ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవడం కష్టం. పైగా ఇది పరువు, ప్రతిష్టలకు కూడా సంబంధించిన…
ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస..…