మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి విలక్షణ చిత్రాలతో మొదలుపెట్టి ప్రాజెక్ట్ కె దాకా అడుగులు వేసిన స్వప్న సినిమా ఇప్పుడు ఓటిటి మూవీస్ కూడా అందించనుంది. నిత్య మీనన్ టైటిల్ పాత్ర పోషించిన కుమారి శ్రీమతి ఈ నెల 28న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నానితో ట్రైలర్ విడుదల చేయించారు. కాన్సెప్ట్ వెరైటీగా అనిపిస్తోంది. గోమటేష్ ఉపాధ్యే దర్శకత్వంలో రీజనబుల్ బడ్జెట్ లో కేవలం కంటెంట్ ని నమ్ముకుని తీసినట్టున్నారు. కథ ఏంటో స్పష్టంగా రెండు నిమిషాల వీడియోలో చెప్పేశారు.
ముప్పై ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాని అమ్మాయి పేరు శ్రీమతి(నిత్య మీనన్). తమ నుంచి అన్యాయంగా తీసుకున్న పాత ఇల్లుని బాబాయ్ నుంచి తీసుకోవడమే లక్ష్యంగా కోర్టులో పోరాడుతుంది. ప్రేమంటూ ఓ అబ్బాయి(తిరువీర్)వెంటపడుతూ ఉంటాడు. అయితే డబ్బు చెల్లించి ఆ ఇంటిని స్వంతం చేసుకోవచ్చంటూ తీర్పు రావడంతో తన పదమూడు వేల జీతంతో అది అసాధ్యమని గుర్తిస్తుంది. ఆరు నెలల గడువులో అంత డబ్బు సంపాదించాలంటే మద్యం వ్యాపారం చేయడం ఒక్కటే మార్గమని అర్థమై అన్నంత పని చేస్తుంది. ఇక్కడి నుంచి అసలు సవాళ్లు మొదలవుతాయి
పాయింట్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. వినోదమే ప్రధానంగా ప్రేక్షకులను నవ్వించడమే టార్గెట్ పెట్టుకున్నారు గోమటేష్. తిరువీర్ తో పాటు గౌతమి, నిరుపమ్, ప్రణీత, తాళ్ళూరి రామేశ్వరి, మురళీమోహన్ లాంటి క్యాస్టింగ్ తోడవ్వడంతో క్వాలిటీ కనిపిస్తోంది. ఇంటిల్లిపాది చూసేందుకు కావాల్సిన కాలక్షేపమైతే దట్టించారు. అయితే హీరోయిన్ డబ్బు కోసం బారు పెట్టుకోవడమనే బ్యాక్ డ్రాప్ వెరైటీగా ఉంది.ఇది కన్విన్సింగ్ గా చెప్పగలిగితే చాలు హిట్టు పడ్డట్టే. ఇలాంటి కంటెంట్ ఓటిటికి పర్ఫెక్ట్ ఛాయస్. బాగుంటే చాలు మిలియన్ల వ్యూస్ వచ్చి పడతాయి. నిత్య మీనన్ ఎలాంటి మేజిక్ చేసిందో చూడాలి.
This post was last modified on September 22, 2023 7:56 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…