ప్రపంచంలో ప్రతి ఫిలిం మేకర్ కలలు కనే ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు గాను కీరవాణికి వచ్చిన తర్వాత అందరికీ దాని మీద ఆశ కలుగుతోంది. మాకెందుకు రాదనే ధీమా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లలో పెరుగుతోంది. ఇటీవలే జవాన్ తో ఇండస్ట్రీ హిట్ సాధించిన అట్లీ సైతం తాము నామినేషన్ కు పంపే ఆలోచనలో ఉన్నామని చెప్పడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దారి తీసింది. కలగూరగంపలా పాత మసాలా సినిమాల ప్రభావంతో తీసిన చిత్రాన్ని అకాడెమి అవార్డులకు పంపి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నెటిజెన్లు గట్టిగానే తలంటారు.
అతనేదో ఫ్లోలో అన్నాడు కానీ నిజానికది జరిగేంత సీన్ లేదు కానీ ప్రస్తుతం చెన్నైలో ఇండియా తరఫున ఎంట్రీగా పంపాల్సిన సినిమాల స్క్రీనింగ్ జరుగుతోంది. గిరీష్ కాసరవెల్లి అధ్యక్షతన వీటి వడబోత చేపట్టారు. తెలుగు నుంచి బలగం, దసరా మాత్రమే పరిశీలనలో ఉంది. హిందీ నుంచి ది స్టోరీ టెల్లర్ – మ్యూజిక్ స్కూల్ – జ్విగాటో – గదర్ 2 – ఘోమర్ – అబ్ తో సాబ్ భగవాన్ భరోస్ – ది కేరళ స్టోరీ – రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని – మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే తదితరాలున్నాయి. వెట్రిమారన్ విడుదలై పార్ట్ 1 ని గట్టి పరిశీలనలో ఉంచారట. ఇవి కాకుండా ఇతర బాషలవి వేరేవి చాలా ఉన్నాయి.
అయితే ఇక్కడ చెప్పిన లిస్టులో ఉన్నవి ఎక్కువ శాతం కమర్షియల్ టచ్ ఉన్న సినిమాలు. ఆస్కార్ అంత సులభంగా వీటిని ఒప్పుకోదు. ఆర్ఆర్ఆర్ ఎంత గొప్పగా తీసినా దర్శకుడు రాజమౌళికి పురస్కారం దక్కలేదు. నిర్మాత దానయ్యకు పిలుపు అందలేదు. సో ఏదో మన ప్రయత్నం చేయడం కోసమని పంపడం తప్పించి ఇదంత సులభంగా తేలే వ్యవహారం కాదు. వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార ఈవెంట్ కోసం వీటిలో ఎంపిక చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ ని అఫీషియల్ ఎంట్రీగా కేంద్రం పంపకపోవడం వల్లే అవకాశం తగ్గిందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 22, 2023 1:47 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…