ప్రపంచంలో ప్రతి ఫిలిం మేకర్ కలలు కనే ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు గాను కీరవాణికి వచ్చిన తర్వాత అందరికీ దాని మీద ఆశ కలుగుతోంది. మాకెందుకు రాదనే ధీమా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లలో పెరుగుతోంది. ఇటీవలే జవాన్ తో ఇండస్ట్రీ హిట్ సాధించిన అట్లీ సైతం తాము నామినేషన్ కు పంపే ఆలోచనలో ఉన్నామని చెప్పడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దారి తీసింది. కలగూరగంపలా పాత మసాలా సినిమాల ప్రభావంతో తీసిన చిత్రాన్ని అకాడెమి అవార్డులకు పంపి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నెటిజెన్లు గట్టిగానే తలంటారు.
అతనేదో ఫ్లోలో అన్నాడు కానీ నిజానికది జరిగేంత సీన్ లేదు కానీ ప్రస్తుతం చెన్నైలో ఇండియా తరఫున ఎంట్రీగా పంపాల్సిన సినిమాల స్క్రీనింగ్ జరుగుతోంది. గిరీష్ కాసరవెల్లి అధ్యక్షతన వీటి వడబోత చేపట్టారు. తెలుగు నుంచి బలగం, దసరా మాత్రమే పరిశీలనలో ఉంది. హిందీ నుంచి ది స్టోరీ టెల్లర్ – మ్యూజిక్ స్కూల్ – జ్విగాటో – గదర్ 2 – ఘోమర్ – అబ్ తో సాబ్ భగవాన్ భరోస్ – ది కేరళ స్టోరీ – రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని – మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే తదితరాలున్నాయి. వెట్రిమారన్ విడుదలై పార్ట్ 1 ని గట్టి పరిశీలనలో ఉంచారట. ఇవి కాకుండా ఇతర బాషలవి వేరేవి చాలా ఉన్నాయి.
అయితే ఇక్కడ చెప్పిన లిస్టులో ఉన్నవి ఎక్కువ శాతం కమర్షియల్ టచ్ ఉన్న సినిమాలు. ఆస్కార్ అంత సులభంగా వీటిని ఒప్పుకోదు. ఆర్ఆర్ఆర్ ఎంత గొప్పగా తీసినా దర్శకుడు రాజమౌళికి పురస్కారం దక్కలేదు. నిర్మాత దానయ్యకు పిలుపు అందలేదు. సో ఏదో మన ప్రయత్నం చేయడం కోసమని పంపడం తప్పించి ఇదంత సులభంగా తేలే వ్యవహారం కాదు. వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార ఈవెంట్ కోసం వీటిలో ఎంపిక చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ ని అఫీషియల్ ఎంట్రీగా కేంద్రం పంపకపోవడం వల్లే అవకాశం తగ్గిందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 22, 2023 1:47 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…