అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన యువ కథానాయకుడు సుశాంత్.. కెరీర్ ఆరంభంలో తన సొంత బేనర్లోనే వరుసగా సినిమాలు చేశాడు. అతడి తల్లి నాగసుశీల.. శ్రీనివాసరావు అనే ఓ వ్యక్తితో కలిసి సినిమాలు నిర్మించడం తెలిసిందే. ఐతే కొన్నేళ్లు అంతా బాగానే సాగింది కానీ.. తర్వాత ఆర్థిక విషయాల్లో సుశాంత్ కుటుంబానికి.. ఈ శ్రీనివాసరావుకు వివాదాలు తలెత్తాయి. చాలా ఏళ్ల ముందే శ్రీనివాసరావు.. నాగసుశీల మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. అప్పట్లో వ్యవహారం కేసుల వరకు వెళ్లింది.
మధ్యలో ఎలాగోలా ఆ వివాదం సద్దుమణిగింది కానీ.. ఇప్పుడు మళ్లీ గొడవ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. సుశాంత్, నాగసుశీలలపై శ్రీనివాసరావు కేసు పెట్టాడు. తాను ఒక ట్రస్టుకు ఇచ్చిన స్థలం దగ్గరికి బౌన్సర్లతో వచ్చి సుశాంత్, నాగసుశీల గొడవ చేశారని అతను ఆరోపిస్తున్నాడు. సీసీటీవీ వైర్లు కట్ చేసి మరీ గొడవ చేశారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం కిందట కేసు నమోదు చేయాలని బాధిత వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
మీడియాకు కూడా కొన్ని ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేశాడు శ్రీనివాసరావు. ఈ వివాదం వెనుక బ్యాగ్రౌండ్ ఏంటన్నది తెలియడం లేదు కానీ.. దాదాపు పదేళ్లుగా శ్రీనివాసరావుకు, సుశాంత్ కుటుంబానికి మధ్య ఆర్థిక గొడవలు నడుస్తున్నాయి. అవి ఎంతకీ తీరకపోవడంతో ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీనివాసరావు భాగస్వామ్యంలో సినిమాలు నిర్మించడం ఆగిపోయాక.. సుశాంత్ సొంత బేనర్లో సినిమాలు చేయట్లేదు. ‘చి ల సౌ’ చిత్రాన్ని మాత్రం నాగ్ నిర్మించాడు. మిగతా సినిమాలన్నీ బయట బేనర్లలోనే చేస్తున్నాడు సుశాంత్.
This post was last modified on September 18, 2023 9:21 pm
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…