అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన యువ కథానాయకుడు సుశాంత్.. కెరీర్ ఆరంభంలో తన సొంత బేనర్లోనే వరుసగా సినిమాలు చేశాడు. అతడి తల్లి నాగసుశీల.. శ్రీనివాసరావు అనే ఓ వ్యక్తితో కలిసి సినిమాలు నిర్మించడం తెలిసిందే. ఐతే కొన్నేళ్లు అంతా బాగానే సాగింది కానీ.. తర్వాత ఆర్థిక విషయాల్లో సుశాంత్ కుటుంబానికి.. ఈ శ్రీనివాసరావుకు వివాదాలు తలెత్తాయి. చాలా ఏళ్ల ముందే శ్రీనివాసరావు.. నాగసుశీల మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. అప్పట్లో వ్యవహారం కేసుల వరకు వెళ్లింది.
మధ్యలో ఎలాగోలా ఆ వివాదం సద్దుమణిగింది కానీ.. ఇప్పుడు మళ్లీ గొడవ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. సుశాంత్, నాగసుశీలలపై శ్రీనివాసరావు కేసు పెట్టాడు. తాను ఒక ట్రస్టుకు ఇచ్చిన స్థలం దగ్గరికి బౌన్సర్లతో వచ్చి సుశాంత్, నాగసుశీల గొడవ చేశారని అతను ఆరోపిస్తున్నాడు. సీసీటీవీ వైర్లు కట్ చేసి మరీ గొడవ చేశారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం కిందట కేసు నమోదు చేయాలని బాధిత వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
మీడియాకు కూడా కొన్ని ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేశాడు శ్రీనివాసరావు. ఈ వివాదం వెనుక బ్యాగ్రౌండ్ ఏంటన్నది తెలియడం లేదు కానీ.. దాదాపు పదేళ్లుగా శ్రీనివాసరావుకు, సుశాంత్ కుటుంబానికి మధ్య ఆర్థిక గొడవలు నడుస్తున్నాయి. అవి ఎంతకీ తీరకపోవడంతో ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీనివాసరావు భాగస్వామ్యంలో సినిమాలు నిర్మించడం ఆగిపోయాక.. సుశాంత్ సొంత బేనర్లో సినిమాలు చేయట్లేదు. ‘చి ల సౌ’ చిత్రాన్ని మాత్రం నాగ్ నిర్మించాడు. మిగతా సినిమాలన్నీ బయట బేనర్లలోనే చేస్తున్నాడు సుశాంత్.
This post was last modified on September 18, 2023 9:21 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…