సంక్రాంతికి ఇంకో నాలుగు నెలలే సమయం ఉండటంతో పండగ విడుదల టార్గెట్ చేసిన సినిమాలు మెల్లగా ప్రమోషన్లు పెంచుతున్నాయి. వీటిలో తేజ సజ్జ హనుమాన్ ఉంది. జనవరి 12 డేట్ ని నొక్కి వక్కాణిస్తూ పోస్టర్లు వదులుతూనే ఉన్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా మరో లుక్ వదిలారు. అయితే ఇక్కడ సమస్య అది కాదు. అదే రోజు మహేష్ బాబు గుంటూరు కారం ఖచ్చతంగా వస్తుందని హీరో నిర్మాత పదే పదే చెబుతుంటే హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎందుకింత ధీమాగా ఉన్నాడనే సందేహం మూవీ లవర్స్ లో సహజంగానే కలుగుతుంది.
ఇక్కడ అసలు మతలబు వేరే ఉంది. గుంటూరు కారం కేవలం తెలుగులో మాత్రమే వస్తుంది. అంటే బిజినెస్ ఏపీ, తెలంగాణ, కర్ణాటకతో పాటు ఓవర్సీస్ లో జరుగుతుంది. తమిళంలో అంతగా పట్టించుకోరు. మలయాళంలో మార్కెటే లేదు. సో మహేష్ తాకిడికి పరిమితి ఉంది. కానీ హనుమాన్ అలా కాదు. తేజ సజ్జ చిన్న హీరోనే అయినప్పటికీ సినిమాలో ఉన్నది గ్లోబల్ కంటెంట్. ముఖ్యంగా నార్త్ లో విపరీతంగా ఆరాధించే హనుమంతుడి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఆసక్తి చూపిస్తారు. పైగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రశాంత్ వర్మ లేట్ అవుతున్నా సరే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆదిపురుష్ నెగటివ్ ఫీడ్ బ్యాక్ దృష్టిలో ఉంచుకుని వీలైనంత బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి హనుమాన్ యూనిట్ చాలా కష్టపడుతోందట. సో గుంటూరు కారంతో నేరుగా తలపడినా ఇబ్బంది ఉండదని. మొదటి రెండు మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ తగ్గినా ఆ తర్వాత అనూహ్యంగా పికప్ అవుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది. ఒకవేళ టైంకి పూర్తి కాక గుంటూరు కారం తేదీ మార్చుకుంటే హనుమాన్ పంట పండినట్టే. అయినా రవితేజ, విజయ్ దేవరకొండలు కూడా రేస్ లో ఉంటారని తెలిసి కూడా ప్రశాంత్ వర్మ బృందం ఇంత రిస్క్ చేస్తోందంటే మ్యాటర్ ఏదో గట్టిగానే ఉన్నట్టుంది.
This post was last modified on September 18, 2023 4:31 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…