బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతున్న జవాన్ దిగ్విజయంగా ఎనిమిది వందల కోట్లు దాటేసి వెయ్యి మార్కు వైపు పరుగులు పెడుతోంది. అన్ని భాషల్లోనూ చెప్పుకోదగ్గ రిలీజ్ ఏదీ లేకపోవడంతో నిన్న ఆదివారం కూడా పూర్తిగా కింగ్ ఖాన్ కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. వరస సెలవులను వాడుకుంటూ మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నాడు. ప్రధాన కేంద్రాల్లో పది రోజుల తర్వాత టికెట్లు దొరకని పరిస్థితి దీనికే చూస్తున్నామని నార్త్ బయ్యర్లు అంటున్నారు. సహస్రం చేరుకోవడం లాంఛనంగానే కనిపిస్తోంది. నాన్ హిందీ వెర్షన్లు బాగా నెమ్మదించినా భయపడే స్థాయిలో జోరు తగ్గలేదు.
తాజా అప్డేట్ ఏంటంటే జవాన్ ఎడిటింగ్ లో లేపేసిన ఫుటేజ్ లో 20 నిమిషాలను తీసుకుని డైరెక్టర్ కట్ పేరుతో కొత్త వెర్షన్ సిద్ధం చేయబోతున్నట్టుగా తెలిసింది. అయితే అలా అని వెంటనే టికెట్లు కొనకండి. ఇది ఓటిటి కోసమట. భారీ మొత్తాన్ని వెచ్చించి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ తమ సబ్ స్క్రైబర్స్ కోసం ఏదైనా స్పెషల్ గా ఇద్దామనే ప్రతిపాదన తెచ్చినప్పుడు దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ ఇద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్తగా తోడయ్యేవాటిలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు విక్రమ్ రాథోర్ కు సంబంధించిన ముఖ్యమైన సీన్లు కొన్ని ఉంటాయట.
సరే ఎప్పుడని అడిగితే మాత్రం కొంచెం వెయిట్ చేయక తప్పేలా లేదు. అగ్రిమెంట్ ప్రకారం విడుదలైన ఎనిమిది వారాల తర్వాత జవాన్ స్ట్రీమింగ్ కు వస్తుందని అంటున్నారు. అంటే అరవై రోజులు. పఠాన్ ఫిఫ్టీ డేస్ కి ఇచ్చేశారు. దీనికి కూడా డిలీటెడ్ సీన్స్ జోడించామని చెప్పారు కానీ అవి కేవలం నాలుగు నిమిషాలే ఉండటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. కానీ జవాన్ కు అలా కాదు. ఏకంగా ట్వంటీ మినిట్స్ అంటే చిన్న విషయం కాదు పెద్ద పంగడే. డిజిటల్ వర్గాల సమాచారం మేరకు అన్ని బాషల జవాన్ ఓటిటి స్ట్రీమింగ్ నవంబర్ 10న ఉండొచ్చని తెలిసింది.
This post was last modified on September 18, 2023 3:26 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…
మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…