బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతున్న జవాన్ దిగ్విజయంగా ఎనిమిది వందల కోట్లు దాటేసి వెయ్యి మార్కు వైపు పరుగులు పెడుతోంది. అన్ని భాషల్లోనూ చెప్పుకోదగ్గ రిలీజ్ ఏదీ లేకపోవడంతో నిన్న ఆదివారం కూడా పూర్తిగా కింగ్ ఖాన్ కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. వరస సెలవులను వాడుకుంటూ మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నాడు. ప్రధాన కేంద్రాల్లో పది రోజుల తర్వాత టికెట్లు దొరకని పరిస్థితి దీనికే చూస్తున్నామని నార్త్ బయ్యర్లు అంటున్నారు. సహస్రం చేరుకోవడం లాంఛనంగానే కనిపిస్తోంది. నాన్ హిందీ వెర్షన్లు బాగా నెమ్మదించినా భయపడే స్థాయిలో జోరు తగ్గలేదు.
తాజా అప్డేట్ ఏంటంటే జవాన్ ఎడిటింగ్ లో లేపేసిన ఫుటేజ్ లో 20 నిమిషాలను తీసుకుని డైరెక్టర్ కట్ పేరుతో కొత్త వెర్షన్ సిద్ధం చేయబోతున్నట్టుగా తెలిసింది. అయితే అలా అని వెంటనే టికెట్లు కొనకండి. ఇది ఓటిటి కోసమట. భారీ మొత్తాన్ని వెచ్చించి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ తమ సబ్ స్క్రైబర్స్ కోసం ఏదైనా స్పెషల్ గా ఇద్దామనే ప్రతిపాదన తెచ్చినప్పుడు దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ ఇద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్తగా తోడయ్యేవాటిలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు విక్రమ్ రాథోర్ కు సంబంధించిన ముఖ్యమైన సీన్లు కొన్ని ఉంటాయట.
సరే ఎప్పుడని అడిగితే మాత్రం కొంచెం వెయిట్ చేయక తప్పేలా లేదు. అగ్రిమెంట్ ప్రకారం విడుదలైన ఎనిమిది వారాల తర్వాత జవాన్ స్ట్రీమింగ్ కు వస్తుందని అంటున్నారు. అంటే అరవై రోజులు. పఠాన్ ఫిఫ్టీ డేస్ కి ఇచ్చేశారు. దీనికి కూడా డిలీటెడ్ సీన్స్ జోడించామని చెప్పారు కానీ అవి కేవలం నాలుగు నిమిషాలే ఉండటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. కానీ జవాన్ కు అలా కాదు. ఏకంగా ట్వంటీ మినిట్స్ అంటే చిన్న విషయం కాదు పెద్ద పంగడే. డిజిటల్ వర్గాల సమాచారం మేరకు అన్ని బాషల జవాన్ ఓటిటి స్ట్రీమింగ్ నవంబర్ 10న ఉండొచ్చని తెలిసింది.
This post was last modified on September 18, 2023 3:26 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…