Movie News

20 నిమిషాల బోనస్ ఇవ్వనున్న జవాన్

బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతున్న జవాన్ దిగ్విజయంగా ఎనిమిది వందల కోట్లు దాటేసి వెయ్యి మార్కు వైపు పరుగులు పెడుతోంది. అన్ని భాషల్లోనూ చెప్పుకోదగ్గ రిలీజ్ ఏదీ లేకపోవడంతో నిన్న ఆదివారం కూడా పూర్తిగా కింగ్ ఖాన్ కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. వరస సెలవులను వాడుకుంటూ మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నాడు. ప్రధాన కేంద్రాల్లో పది రోజుల తర్వాత టికెట్లు దొరకని పరిస్థితి దీనికే చూస్తున్నామని నార్త్ బయ్యర్లు అంటున్నారు. సహస్రం చేరుకోవడం లాంఛనంగానే కనిపిస్తోంది. నాన్ హిందీ వెర్షన్లు బాగా నెమ్మదించినా భయపడే స్థాయిలో జోరు తగ్గలేదు.

తాజా అప్డేట్ ఏంటంటే జవాన్ ఎడిటింగ్ లో లేపేసిన ఫుటేజ్ లో 20 నిమిషాలను తీసుకుని డైరెక్టర్ కట్ పేరుతో కొత్త వెర్షన్ సిద్ధం చేయబోతున్నట్టుగా తెలిసింది. అయితే అలా అని వెంటనే టికెట్లు కొనకండి. ఇది ఓటిటి కోసమట. భారీ మొత్తాన్ని వెచ్చించి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ తమ సబ్ స్క్రైబర్స్ కోసం ఏదైనా స్పెషల్ గా ఇద్దామనే ప్రతిపాదన తెచ్చినప్పుడు దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ ఇద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్తగా తోడయ్యేవాటిలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు విక్రమ్ రాథోర్ కు సంబంధించిన ముఖ్యమైన సీన్లు కొన్ని ఉంటాయట.

సరే ఎప్పుడని అడిగితే మాత్రం కొంచెం వెయిట్ చేయక తప్పేలా లేదు. అగ్రిమెంట్ ప్రకారం విడుదలైన ఎనిమిది వారాల తర్వాత జవాన్ స్ట్రీమింగ్ కు వస్తుందని అంటున్నారు. అంటే అరవై రోజులు. పఠాన్ ఫిఫ్టీ డేస్ కి ఇచ్చేశారు. దీనికి కూడా డిలీటెడ్ సీన్స్ జోడించామని చెప్పారు కానీ అవి కేవలం నాలుగు నిమిషాలే ఉండటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. కానీ జవాన్ కు అలా కాదు. ఏకంగా ట్వంటీ మినిట్స్ అంటే చిన్న విషయం కాదు పెద్ద పంగడే. డిజిటల్ వర్గాల సమాచారం మేరకు అన్ని బాషల జవాన్ ఓటిటి స్ట్రీమింగ్ నవంబర్ 10న ఉండొచ్చని తెలిసింది. 

This post was last modified on September 18, 2023 3:26 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

2 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

4 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

5 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

5 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

6 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

6 hours ago