టాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం ప్రతిభతో మంచి స్థాయిని అందుకున్న యువ కథానాయకుల్లో విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టిల పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి. వీళ్లిద్దరూ హీరోలుగా బ్రేక్ అందుకోవడానికి ముందు అవకాశాల కోసం బాగానే కష్టపడ్డారు. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టిది మామూలు కష్టం కాదు. విజయ్కి అయినా పెళ్ళిచూపులు మూవీతో కొంచెం ముందుగానే బ్రేక్ వచ్చింది కానీ.. నవీన్ మాత్రం హీరోగా తొలి అవకాశం, సక్సెస్ కోసం చాలా సమయం వేచి చూడాల్సి వచ్చింది.
చివరికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. ఐతే నవీన్, విజయ్ ఇద్దరూ కూడా చాలా ఏళ్ల కిందటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం విశేషం. నిజానికి వాళ్లిద్దరూ కూడా ఆ సినిమా ఆడిషన్స్కు వెళ్లింది హీరో వేషాల కోసమే అట.
కానీ హీరోలుగా వేరే వాళ్లను ఎంపిక చేసి.. తమకు క్యారెక్టర్ రోల్స్ ఇవ్వడంతో చాలా బాధ పడ్డామని.. తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సక్సెస్ మీట్లో నవీన్ చెప్పుకొచ్చాడు. అయినా నిరాశ చెందకుండా తామిద్దరం వచ్చిన పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపాడు. ఆ స్థాయి నుంచి ఇప్పుడున్న స్థితికి తామిద్దరం రావడానికి ప్రేక్షకుల ఆదరణే కారణమని.. తాను, విజయ్ ఇప్పటికీ పరస్పరం మెసేజ్లు చేసుకుంటూ ఉంటామని నవీన్ తెలిపాడు.
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముందు తాను చాలా కష్టపడ్డానని.. తిండి లేక కడుపు మాడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయని నవీన్ తెలిపాడు. ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లు అన్నింటికీ సిద్ధపడే రావాలని అతనన్నాడు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నపుడు తాను షాకయ్యానని.. ఆ బాధ నుంచి బయటికి రావడానికి తనకు రెండు నెలలు టైం పట్టిందని నవీన్ గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on September 18, 2023 9:04 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…