టాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం ప్రతిభతో మంచి స్థాయిని అందుకున్న యువ కథానాయకుల్లో విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టిల పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి. వీళ్లిద్దరూ హీరోలుగా బ్రేక్ అందుకోవడానికి ముందు అవకాశాల కోసం బాగానే కష్టపడ్డారు. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టిది మామూలు కష్టం కాదు. విజయ్కి అయినా పెళ్ళిచూపులు మూవీతో కొంచెం ముందుగానే బ్రేక్ వచ్చింది కానీ.. నవీన్ మాత్రం హీరోగా తొలి అవకాశం, సక్సెస్ కోసం చాలా సమయం వేచి చూడాల్సి వచ్చింది.
చివరికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. ఐతే నవీన్, విజయ్ ఇద్దరూ కూడా చాలా ఏళ్ల కిందటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం విశేషం. నిజానికి వాళ్లిద్దరూ కూడా ఆ సినిమా ఆడిషన్స్కు వెళ్లింది హీరో వేషాల కోసమే అట.
కానీ హీరోలుగా వేరే వాళ్లను ఎంపిక చేసి.. తమకు క్యారెక్టర్ రోల్స్ ఇవ్వడంతో చాలా బాధ పడ్డామని.. తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సక్సెస్ మీట్లో నవీన్ చెప్పుకొచ్చాడు. అయినా నిరాశ చెందకుండా తామిద్దరం వచ్చిన పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపాడు. ఆ స్థాయి నుంచి ఇప్పుడున్న స్థితికి తామిద్దరం రావడానికి ప్రేక్షకుల ఆదరణే కారణమని.. తాను, విజయ్ ఇప్పటికీ పరస్పరం మెసేజ్లు చేసుకుంటూ ఉంటామని నవీన్ తెలిపాడు.
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముందు తాను చాలా కష్టపడ్డానని.. తిండి లేక కడుపు మాడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయని నవీన్ తెలిపాడు. ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లు అన్నింటికీ సిద్ధపడే రావాలని అతనన్నాడు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నపుడు తాను షాకయ్యానని.. ఆ బాధ నుంచి బయటికి రావడానికి తనకు రెండు నెలలు టైం పట్టిందని నవీన్ గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on September 18, 2023 9:04 am
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…