టాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం ప్రతిభతో మంచి స్థాయిని అందుకున్న యువ కథానాయకుల్లో విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టిల పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి. వీళ్లిద్దరూ హీరోలుగా బ్రేక్ అందుకోవడానికి ముందు అవకాశాల కోసం బాగానే కష్టపడ్డారు. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టిది మామూలు కష్టం కాదు. విజయ్కి అయినా పెళ్ళిచూపులు మూవీతో కొంచెం ముందుగానే బ్రేక్ వచ్చింది కానీ.. నవీన్ మాత్రం హీరోగా తొలి అవకాశం, సక్సెస్ కోసం చాలా సమయం వేచి చూడాల్సి వచ్చింది.
చివరికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. ఐతే నవీన్, విజయ్ ఇద్దరూ కూడా చాలా ఏళ్ల కిందటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం విశేషం. నిజానికి వాళ్లిద్దరూ కూడా ఆ సినిమా ఆడిషన్స్కు వెళ్లింది హీరో వేషాల కోసమే అట.
కానీ హీరోలుగా వేరే వాళ్లను ఎంపిక చేసి.. తమకు క్యారెక్టర్ రోల్స్ ఇవ్వడంతో చాలా బాధ పడ్డామని.. తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సక్సెస్ మీట్లో నవీన్ చెప్పుకొచ్చాడు. అయినా నిరాశ చెందకుండా తామిద్దరం వచ్చిన పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపాడు. ఆ స్థాయి నుంచి ఇప్పుడున్న స్థితికి తామిద్దరం రావడానికి ప్రేక్షకుల ఆదరణే కారణమని.. తాను, విజయ్ ఇప్పటికీ పరస్పరం మెసేజ్లు చేసుకుంటూ ఉంటామని నవీన్ తెలిపాడు.
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముందు తాను చాలా కష్టపడ్డానని.. తిండి లేక కడుపు మాడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయని నవీన్ తెలిపాడు. ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లు అన్నింటికీ సిద్ధపడే రావాలని అతనన్నాడు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నపుడు తాను షాకయ్యానని.. ఆ బాధ నుంచి బయటికి రావడానికి తనకు రెండు నెలలు టైం పట్టిందని నవీన్ గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on September 18, 2023 9:04 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…