‘బేబి’తో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుని మంచి ఊపున్న యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ నుంచి త్వరలోనే మరో కొత్త సినిమా రాబోతోంది. అదే.. గంగం గణేశా. ఈ సినిమా మొదలైనపుడు.. మేకింగ్ దశలో పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. కానీ ‘బేబి’తో ఆనంద్ పెద్ద సక్సెస్ అందుకున్నాక ఈ సినిమా టీజర్ను లాంచ్ చేశారు. టాలీవుడ్లో ఎప్పట్నుంచో చూస్తున్న.. కొత్త దర్శకులు ఎక్కువమంది ప్రిఫర్ చేసే క్రైమ్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కింది. టీజర్ అయితే ఆద్యంతం వినోదాత్మకంగానే సాగింది.
ఐతే ఇందులో ఎక్కువగా యూత్ దృష్టిని ఆకర్షించింది.. సోషల్ మీడియాలో వైలర్ అయింది మాత్రం.. చివర్లో వచ్చే ఒక డైలాగే. ‘‘చెప్పింది చెప్పినట్లు చేస్తే.. మీ వాటాలు మీ చేతిలో పెడతా’’ అంటూ విలన్ నార్త్ యాసలో డైలాగ్ చెబితే.. హీరో పక్కనున్న కామెడీ క్యారెక్టర్ ఆశ్చర్యపోయి చూస్తుంది. వెంటనే హీరో ‘‘అది వాటాలు’’ అని నొక్కి వక్కాణిస్తాడు. ఈ సీన్ ఉద్దేశం ఏంటన్నది అందరికీ తెలిసిందే. వెబ్ సిరీస్ల్లో ఇలాంటి బూతులు ఈ రోజుల్లో చాాలా సాధారణం అయిపోయాయి.
ఇలాంటివి కుర్రాళ్లకు ఫన్నీగా అనిపించొచ్చు కానీ.. అబ్బాయిలు ఇలాంటి జోకులు వేసుకోవడం కూడా కామనే. కానీ ఈ జోకులు అలవాటైన వాళ్లకు కూడా సినిమాల్లో ఇలాంటి డైలాగులు వింటే ఇబ్బందిగానే ఉంటుంది. ఇక అమ్మాయిలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఉండగా ఇలాంటి డైలాగ్ వినిపిస్తే ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఐతే సినిమాలకు వచ్చేసరికి ఇలాంటి డైలాగులు ఎడిట్ అయిపోతుంటాయి. లేదా మ్యూట్ అవుతుంటాయి. ఈ మధ్య నాగశౌర్య సినిమా ‘రంగబలి’ ట్రైలర్లో కూడా ‘ఎవరైనా నా సంక ఎక్కాలని చూస్తే.. దింపి.. తా’’ అంటూ పచ్చి బూతు డైలాగ్ పేల్చాడు. అది సినిమాలో మ్యూట్ అయింది.
కానీ ట్రైలర్ రిలీజైనపుడు ఆ డైలాగ్ మీద చర్చ జరిగి పబ్లిసిటీకి ఉపయోగపడింది. అంతకుముందు ‘ఫలక్నుమా దాస్’లో కూడా ‘దెం..తే షేపవుట్ అయిపోతావ్’’ అంటూ ట్రైలర్లో పెట్టిన డైలాగ్ హాట్ టాపిక్ అయింది. ఇలాంటి డైలాగులు సినిమాల్లో పెట్టాలన్న ఆలోచన కూడా ఒక్పపుడు వచ్చేది కాదు. కానీ ఇప్పుడేమో వీటిని నార్మలైజ్ చేసేస్తున్నారు. సినిమాల్లో డైలాగులు లేచిపోవచ్చు.. లేదా మ్యూట్ కావచ్చు. కానీ టీజర్, ట్రైలర్లకు సెన్సార్ ఉండదు కాబట్టి పబ్లిసిటీకి ఉపయోగపడతాయని ఇలాంటి డైలాగులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదో రకం పబ్లిసిటీ ట్రిక్ లాగా మారిపోయింది.
This post was last modified on September 16, 2023 2:49 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…