నిన్న రిలీజైన సినిమాల్లో డబ్బింగ్ బొమ్మ మార్క్ ఆంటోని మినహాయించి మిగిలినవన్నీ చిన్నవే కావడంతో వాటి మీద ప్రేక్షకులకు పెద్దగా ఫోకస్ రాలేదు. ఉన్నంతలో మాస్ మహారాజా రవితేజ నిర్మాతగా వ్యవహరించిన ఛాంగురే బంగారురాజా మీదే కాస్తో కూస్తో అంచనాలు నెలకొన్నాయి. ఆయనే దగ్గరుండి ప్రమోషన్లు చూసుకోవడంతో ఎంతో కొంత మ్యాటర్ ఉంటుందనే నమ్మకంతో థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ లేకపోలేదు. సతీష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీలో కార్తీక్ రత్నం, సత్య ప్రధాన పాత్రలు పోషించగా సీనియర్ క్యాస్టింగ్ గట్టిగానే పెట్టుకున్నారు. ఇంతకీ బొమ్మ ఎలా ఉంది.
మెకానిక్ పనులు చేసుకునే బంగార్రాజు(కార్తీక్ రత్నం)కు దూకుడెక్కువ. తనుండే ఊరు దుగ్గాడ రంగురాళ్లు, వజ్రాలకు ప్రసిద్ధి. వర్షం పడితే చాలు జనాలంతా వాటి వేటలో పడతారు. బంగార్రాజుతో గొడవపడ్డ అతని స్నేహితుడు సోమినాయుడు(రాజ్ తిరందాసు) అనుకోకుండా హత్యకు గురవుతాడు. ఈ మర్డర్ కాస్తా హీరో మీద పడుతుంది. ఈ కేసుకి తాతారావు(సత్య), గాటీ(రవిబాబు)లకు కనెక్షన్ ఉంటుంది. అసలు నేరస్థుడిని పట్టుకోవడమే బంగార్రాజు లక్ష్యంగా మారుతుంది. కథపరంగా ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు. ఇదే తరహా లైన్ తో మొన్న నెలే ఇంకో చిన్న బడ్జెట్ సినిమా వచ్చింది.
దర్శకడు సతీష్ వర్మ కథనం ప్లస్ కామెడీని నమ్ముకున్నాడు కానీ వాటిని సరైన రీతిలో బ్యాలన్స్ చేయడంలో తడబడటంతో ఛాంగురే బంగారురాజా నత్తనడకన సాగుతూ ఓపికకు పరీక్ష పెడుతుంది. కాసిన్ని జోకులు నవ్వించినప్పటికీ పాత్రలను కనెక్ట్ చేయడం, ఎమోషన్స్ రిజిస్టర్ చేయడం లాంటి అంశాల్లో పూర్తిగా తేలిపోయాడు. సస్పెన్స్ ని విప్పే క్రమం ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో చంపినవాడు ఎవరనే ఆసక్తి కూడా ఫస్ట్ హాఫ్ కే చచ్చిపోతుంది. మణిరత్నం యువ స్టైల్ లో మూడు పాత్రల కోణం నుంచి రిపీట్ సీన్లతో ఇలాంటి స్టోరీ చెప్పాలనుకోవడం బ్లండర్. దానికి తగ్గ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.
This post was last modified on September 16, 2023 10:40 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి…
ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే.…
70 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల మన శంకర…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ…
ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు…
పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన…