నిన్న రిలీజైన సినిమాల్లో డబ్బింగ్ బొమ్మ మార్క్ ఆంటోని మినహాయించి మిగిలినవన్నీ చిన్నవే కావడంతో వాటి మీద ప్రేక్షకులకు పెద్దగా ఫోకస్ రాలేదు. ఉన్నంతలో మాస్ మహారాజా రవితేజ నిర్మాతగా వ్యవహరించిన ఛాంగురే బంగారురాజా మీదే కాస్తో కూస్తో అంచనాలు నెలకొన్నాయి. ఆయనే దగ్గరుండి ప్రమోషన్లు చూసుకోవడంతో ఎంతో కొంత మ్యాటర్ ఉంటుందనే నమ్మకంతో థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ లేకపోలేదు. సతీష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీలో కార్తీక్ రత్నం, సత్య ప్రధాన పాత్రలు పోషించగా సీనియర్ క్యాస్టింగ్ గట్టిగానే పెట్టుకున్నారు. ఇంతకీ బొమ్మ ఎలా ఉంది.
మెకానిక్ పనులు చేసుకునే బంగార్రాజు(కార్తీక్ రత్నం)కు దూకుడెక్కువ. తనుండే ఊరు దుగ్గాడ రంగురాళ్లు, వజ్రాలకు ప్రసిద్ధి. వర్షం పడితే చాలు జనాలంతా వాటి వేటలో పడతారు. బంగార్రాజుతో గొడవపడ్డ అతని స్నేహితుడు సోమినాయుడు(రాజ్ తిరందాసు) అనుకోకుండా హత్యకు గురవుతాడు. ఈ మర్డర్ కాస్తా హీరో మీద పడుతుంది. ఈ కేసుకి తాతారావు(సత్య), గాటీ(రవిబాబు)లకు కనెక్షన్ ఉంటుంది. అసలు నేరస్థుడిని పట్టుకోవడమే బంగార్రాజు లక్ష్యంగా మారుతుంది. కథపరంగా ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు. ఇదే తరహా లైన్ తో మొన్న నెలే ఇంకో చిన్న బడ్జెట్ సినిమా వచ్చింది.
దర్శకడు సతీష్ వర్మ కథనం ప్లస్ కామెడీని నమ్ముకున్నాడు కానీ వాటిని సరైన రీతిలో బ్యాలన్స్ చేయడంలో తడబడటంతో ఛాంగురే బంగారురాజా నత్తనడకన సాగుతూ ఓపికకు పరీక్ష పెడుతుంది. కాసిన్ని జోకులు నవ్వించినప్పటికీ పాత్రలను కనెక్ట్ చేయడం, ఎమోషన్స్ రిజిస్టర్ చేయడం లాంటి అంశాల్లో పూర్తిగా తేలిపోయాడు. సస్పెన్స్ ని విప్పే క్రమం ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో చంపినవాడు ఎవరనే ఆసక్తి కూడా ఫస్ట్ హాఫ్ కే చచ్చిపోతుంది. మణిరత్నం యువ స్టైల్ లో మూడు పాత్రల కోణం నుంచి రిపీట్ సీన్లతో ఇలాంటి స్టోరీ చెప్పాలనుకోవడం బ్లండర్. దానికి తగ్గ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…