నిన్న రిలీజైన సినిమాల్లో డబ్బింగ్ బొమ్మ మార్క్ ఆంటోని మినహాయించి మిగిలినవన్నీ చిన్నవే కావడంతో వాటి మీద ప్రేక్షకులకు పెద్దగా ఫోకస్ రాలేదు. ఉన్నంతలో మాస్ మహారాజా రవితేజ నిర్మాతగా వ్యవహరించిన ఛాంగురే బంగారురాజా మీదే కాస్తో కూస్తో అంచనాలు నెలకొన్నాయి. ఆయనే దగ్గరుండి ప్రమోషన్లు చూసుకోవడంతో ఎంతో కొంత మ్యాటర్ ఉంటుందనే నమ్మకంతో థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ లేకపోలేదు. సతీష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీలో కార్తీక్ రత్నం, సత్య ప్రధాన పాత్రలు పోషించగా సీనియర్ క్యాస్టింగ్ గట్టిగానే పెట్టుకున్నారు. ఇంతకీ బొమ్మ ఎలా ఉంది.
మెకానిక్ పనులు చేసుకునే బంగార్రాజు(కార్తీక్ రత్నం)కు దూకుడెక్కువ. తనుండే ఊరు దుగ్గాడ రంగురాళ్లు, వజ్రాలకు ప్రసిద్ధి. వర్షం పడితే చాలు జనాలంతా వాటి వేటలో పడతారు. బంగార్రాజుతో గొడవపడ్డ అతని స్నేహితుడు సోమినాయుడు(రాజ్ తిరందాసు) అనుకోకుండా హత్యకు గురవుతాడు. ఈ మర్డర్ కాస్తా హీరో మీద పడుతుంది. ఈ కేసుకి తాతారావు(సత్య), గాటీ(రవిబాబు)లకు కనెక్షన్ ఉంటుంది. అసలు నేరస్థుడిని పట్టుకోవడమే బంగార్రాజు లక్ష్యంగా మారుతుంది. కథపరంగా ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు. ఇదే తరహా లైన్ తో మొన్న నెలే ఇంకో చిన్న బడ్జెట్ సినిమా వచ్చింది.
దర్శకడు సతీష్ వర్మ కథనం ప్లస్ కామెడీని నమ్ముకున్నాడు కానీ వాటిని సరైన రీతిలో బ్యాలన్స్ చేయడంలో తడబడటంతో ఛాంగురే బంగారురాజా నత్తనడకన సాగుతూ ఓపికకు పరీక్ష పెడుతుంది. కాసిన్ని జోకులు నవ్వించినప్పటికీ పాత్రలను కనెక్ట్ చేయడం, ఎమోషన్స్ రిజిస్టర్ చేయడం లాంటి అంశాల్లో పూర్తిగా తేలిపోయాడు. సస్పెన్స్ ని విప్పే క్రమం ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో చంపినవాడు ఎవరనే ఆసక్తి కూడా ఫస్ట్ హాఫ్ కే చచ్చిపోతుంది. మణిరత్నం యువ స్టైల్ లో మూడు పాత్రల కోణం నుంచి రిపీట్ సీన్లతో ఇలాంటి స్టోరీ చెప్పాలనుకోవడం బ్లండర్. దానికి తగ్గ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.
This post was last modified on September 16, 2023 10:40 am
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్కు అనుకున్న ఆ చిత్రం…
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…
ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…