ఇటీవలే కన్నడలో విడుదలై సంచలన విజయం సాధించిన సప్తసాగర దాచె ఎల్లో ఎట్టకేలకు తెలుగులో సప్తసాగరాలు దాటి పేరుతో డబ్బింగ్ చేసి వచ్చే సెప్టెంబర్ 22న విడుదల చేయబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. 777 చార్లీ, అతడే శ్రీమన్నారాయణతో మన ప్రేక్షకులకు పరిచయమైన రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ ఎమోషనల్ డ్రామా హైదరాబాద్ లో రెండు వారాలకు పైగా పరిమిత షోలతోనూ మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఒరిజినల్ వెర్షన్ చూసిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపించారు.
టైమింగ్ పరంగా సప్తసాగరాలు దాటి మంచి డేట్ తీసుకుంది. 22వ తేదీ చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అష్టదిగ్బంధనం, రుద్రంకోట, తంతిరం, చీటర్, వారేవా జతగాళ్ళు లాంటి చిన్న చిత్రాలే రేస్ లో ఉన్నాయి. టాక్ మీద నిలవాలి తప్పించి బజ్ లేదు. ఉన్నంతలో రీ రిలీజ్ అవుతున్న 7జి బృందావన కాలనీకు క్రేజ్ కనిపిస్తోంది. సో ఆడియన్స్ కి సప్తసాగరాలు దాటి మంచి ఆప్షన్ అవుతుంది. పీపుల్స్ బ్యానర్ కాబట్టి థియేటర్ల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్క్రీన్ కౌంట్ ఎంత కావాలన్నా దొరుకుతుంది. అయితే ఇంత హెవీ ఎమోషనల్ కంటెంట్ మన జనాలకు కనెక్ట్ అవ్వాలి.
సప్తసాగరాలు దాటిలో ఇది మొదటి భాగమే. సెకండ్ పార్ట్ అక్టోబర్ 20 వస్తుంది. ఒకవేళ తెలుగు డబ్బింగ్ హిట్ అయితే కొనసాగింపు మాత్రం వచ్చే నెల ఆలస్యం కావొచ్చు. ఎందుకంటే భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు లాంటి మాస్ బొమ్మల మధ్య ఈ సీక్వెల్ నెగ్గుకురావడం అంత సులభంగా ఉండదు. ఏదైనా సరే ఇప్పుడీ ఫస్ట్ పార్ట్ కి టాలీవుడ్ ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి రెండో భాగం త్వరగా తీసుకురావాలా వద్దానే నిర్ణయం తీసుకుంటారు. ఒక కార్ డ్రైవర్, వర్ధమాన గాయనికి మధ్య జరిగే ప్రేమకథగా హేమంత్ రావు దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ లో రూపొందించారు.
This post was last modified on September 15, 2023 5:20 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…