ఇటీవలే కన్నడలో విడుదలై సంచలన విజయం సాధించిన సప్తసాగర దాచె ఎల్లో ఎట్టకేలకు తెలుగులో సప్తసాగరాలు దాటి పేరుతో డబ్బింగ్ చేసి వచ్చే సెప్టెంబర్ 22న విడుదల చేయబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. 777 చార్లీ, అతడే శ్రీమన్నారాయణతో మన ప్రేక్షకులకు పరిచయమైన రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ ఎమోషనల్ డ్రామా హైదరాబాద్ లో రెండు వారాలకు పైగా పరిమిత షోలతోనూ మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఒరిజినల్ వెర్షన్ చూసిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపించారు.
టైమింగ్ పరంగా సప్తసాగరాలు దాటి మంచి డేట్ తీసుకుంది. 22వ తేదీ చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అష్టదిగ్బంధనం, రుద్రంకోట, తంతిరం, చీటర్, వారేవా జతగాళ్ళు లాంటి చిన్న చిత్రాలే రేస్ లో ఉన్నాయి. టాక్ మీద నిలవాలి తప్పించి బజ్ లేదు. ఉన్నంతలో రీ రిలీజ్ అవుతున్న 7జి బృందావన కాలనీకు క్రేజ్ కనిపిస్తోంది. సో ఆడియన్స్ కి సప్తసాగరాలు దాటి మంచి ఆప్షన్ అవుతుంది. పీపుల్స్ బ్యానర్ కాబట్టి థియేటర్ల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్క్రీన్ కౌంట్ ఎంత కావాలన్నా దొరుకుతుంది. అయితే ఇంత హెవీ ఎమోషనల్ కంటెంట్ మన జనాలకు కనెక్ట్ అవ్వాలి.
సప్తసాగరాలు దాటిలో ఇది మొదటి భాగమే. సెకండ్ పార్ట్ అక్టోబర్ 20 వస్తుంది. ఒకవేళ తెలుగు డబ్బింగ్ హిట్ అయితే కొనసాగింపు మాత్రం వచ్చే నెల ఆలస్యం కావొచ్చు. ఎందుకంటే భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు లాంటి మాస్ బొమ్మల మధ్య ఈ సీక్వెల్ నెగ్గుకురావడం అంత సులభంగా ఉండదు. ఏదైనా సరే ఇప్పుడీ ఫస్ట్ పార్ట్ కి టాలీవుడ్ ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి రెండో భాగం త్వరగా తీసుకురావాలా వద్దానే నిర్ణయం తీసుకుంటారు. ఒక కార్ డ్రైవర్, వర్ధమాన గాయనికి మధ్య జరిగే ప్రేమకథగా హేమంత్ రావు దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ లో రూపొందించారు.
This post was last modified on September 15, 2023 5:20 pm
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…
అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా…