టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి సినిమా సక్సెస్ మీట్లో చేసిన ప్రకటన సంచలనం రేపింది. ఇప్పటిదాకా ఎన్నడూ లేని విధంగా అభిమానులకు తన ఆదాయం నుంచి వాటా ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకోవడం చర్చనీయాంశం అయింది. ఖుషి సినిమాకు గాను తాను అందుకున్న రెమ్యూనరేషన్ నుంచి వంద మంది అభిమానుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున మొత్తంగా కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు విజయ్ ప్రకటించాడు.
ప్రేక్షకుల అభిమానానిని క్యాష్ చేసుకునేవాళ్లే కానీ.. వాళ్లకు ఇలా ఆదాయంలో వాటా ఇవ్వడం ఇంతవరకు జరగలేదు. ఐతే దీని మీద కూడా కౌంటర్లు వేసిన వాళ్లు లేకపోలేదు. ఖుషి సినిమా వీకెండ్ తర్వాత డల్ అయిన నేపథ్యంలో పబ్లిసిటీ కోసం విజయ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడని.. నిజంగా అతను అభిమానులకు సాయం చేస్తాడా, దీన్ని ఎవరు ఫాలో అప్ చేస్తారు, వెరిఫై చేస్తారు అని రకరకాలుగా మాట్లాడారు ఆ జనం.
కానీ విజయ్ మాత్రం మాట నిలబెట్టుకున్నాడు. కొన్ని రోజుల కిందటే ఈ సాయం పొందేందుకు ఒక ఫామ్ షేర్ చేసిన విజయ్.. తన టీంతో కలిసి సాయం అవసరమైన వారిని ఎంపిక చేశాడు. తాను ఎవరికి సాయం చేస్తున్నానో ఆ వంద మంది అభిమానుల జాబితాను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అంతే కాక ఒక ఈవెంట్ కూడా ఏర్పాటు చేసి చెప్పినట్లే అభిమానులకు సాయాన్ని అందజేశాడు. నిజానికి తొలి వీకెండ్ తర్వాత ఖుషి వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. విజయ్ స్టేట్మెంట్ సినిమా ప్రమోషన్లకేమీ ఉపకరించలేదు. ఒక్క యుఎస్లో తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అయినా సరే.. విజయ్ అదేమీ పట్టించుకోకుండా చెప్పినట్లే అభిమానులకు కోటి రూపాయల సాయం అందించి మాట నిలబెట్టుకుని శభాష్ అనిపించుకున్నాడు.
This post was last modified on September 14, 2023 8:14 pm
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం…