టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి సినిమా సక్సెస్ మీట్లో చేసిన ప్రకటన సంచలనం రేపింది. ఇప్పటిదాకా ఎన్నడూ లేని విధంగా అభిమానులకు తన ఆదాయం నుంచి వాటా ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకోవడం చర్చనీయాంశం అయింది. ఖుషి సినిమాకు గాను తాను అందుకున్న రెమ్యూనరేషన్ నుంచి వంద మంది అభిమానుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున మొత్తంగా కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు విజయ్ ప్రకటించాడు.
ప్రేక్షకుల అభిమానానిని క్యాష్ చేసుకునేవాళ్లే కానీ.. వాళ్లకు ఇలా ఆదాయంలో వాటా ఇవ్వడం ఇంతవరకు జరగలేదు. ఐతే దీని మీద కూడా కౌంటర్లు వేసిన వాళ్లు లేకపోలేదు. ఖుషి సినిమా వీకెండ్ తర్వాత డల్ అయిన నేపథ్యంలో పబ్లిసిటీ కోసం విజయ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడని.. నిజంగా అతను అభిమానులకు సాయం చేస్తాడా, దీన్ని ఎవరు ఫాలో అప్ చేస్తారు, వెరిఫై చేస్తారు అని రకరకాలుగా మాట్లాడారు ఆ జనం.
కానీ విజయ్ మాత్రం మాట నిలబెట్టుకున్నాడు. కొన్ని రోజుల కిందటే ఈ సాయం పొందేందుకు ఒక ఫామ్ షేర్ చేసిన విజయ్.. తన టీంతో కలిసి సాయం అవసరమైన వారిని ఎంపిక చేశాడు. తాను ఎవరికి సాయం చేస్తున్నానో ఆ వంద మంది అభిమానుల జాబితాను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అంతే కాక ఒక ఈవెంట్ కూడా ఏర్పాటు చేసి చెప్పినట్లే అభిమానులకు సాయాన్ని అందజేశాడు. నిజానికి తొలి వీకెండ్ తర్వాత ఖుషి వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. విజయ్ స్టేట్మెంట్ సినిమా ప్రమోషన్లకేమీ ఉపకరించలేదు. ఒక్క యుఎస్లో తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అయినా సరే.. విజయ్ అదేమీ పట్టించుకోకుండా చెప్పినట్లే అభిమానులకు కోటి రూపాయల సాయం అందించి మాట నిలబెట్టుకుని శభాష్ అనిపించుకున్నాడు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…