టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి సినిమా సక్సెస్ మీట్లో చేసిన ప్రకటన సంచలనం రేపింది. ఇప్పటిదాకా ఎన్నడూ లేని విధంగా అభిమానులకు తన ఆదాయం నుంచి వాటా ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకోవడం చర్చనీయాంశం అయింది. ఖుషి సినిమాకు గాను తాను అందుకున్న రెమ్యూనరేషన్ నుంచి వంద మంది అభిమానుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున మొత్తంగా కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు విజయ్ ప్రకటించాడు.
ప్రేక్షకుల అభిమానానిని క్యాష్ చేసుకునేవాళ్లే కానీ.. వాళ్లకు ఇలా ఆదాయంలో వాటా ఇవ్వడం ఇంతవరకు జరగలేదు. ఐతే దీని మీద కూడా కౌంటర్లు వేసిన వాళ్లు లేకపోలేదు. ఖుషి సినిమా వీకెండ్ తర్వాత డల్ అయిన నేపథ్యంలో పబ్లిసిటీ కోసం విజయ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడని.. నిజంగా అతను అభిమానులకు సాయం చేస్తాడా, దీన్ని ఎవరు ఫాలో అప్ చేస్తారు, వెరిఫై చేస్తారు అని రకరకాలుగా మాట్లాడారు ఆ జనం.
కానీ విజయ్ మాత్రం మాట నిలబెట్టుకున్నాడు. కొన్ని రోజుల కిందటే ఈ సాయం పొందేందుకు ఒక ఫామ్ షేర్ చేసిన విజయ్.. తన టీంతో కలిసి సాయం అవసరమైన వారిని ఎంపిక చేశాడు. తాను ఎవరికి సాయం చేస్తున్నానో ఆ వంద మంది అభిమానుల జాబితాను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అంతే కాక ఒక ఈవెంట్ కూడా ఏర్పాటు చేసి చెప్పినట్లే అభిమానులకు సాయాన్ని అందజేశాడు. నిజానికి తొలి వీకెండ్ తర్వాత ఖుషి వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. విజయ్ స్టేట్మెంట్ సినిమా ప్రమోషన్లకేమీ ఉపకరించలేదు. ఒక్క యుఎస్లో తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అయినా సరే.. విజయ్ అదేమీ పట్టించుకోకుండా చెప్పినట్లే అభిమానులకు కోటి రూపాయల సాయం అందించి మాట నిలబెట్టుకుని శభాష్ అనిపించుకున్నాడు.
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ కళ తెచ్చే సినిమా అవుతుందని అందరూ ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకున్నారు.…
మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన మూవీ ప్రేమలు. దీంట్లో జంటగా నటించిన నస్లెన్, మమిత బైజు ఎంత…
కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం,…
సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…