సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు కొంచెం ఎక్కువే అన్నది వాస్తవం. సినిమాల ఫలితాల్లో తక్కువ పాత్ర ఉండే హీరోయిన్ల విషయంలోనూ సెంటిమెంట్లను బాగా పాటిస్తుంటారు ఇక్కడి జనాలు. వరుసగా రెండు మూడు హిట్లు పడగానే టాలెంట్తో సంబంధం లేకుండా గోల్డెన్ గర్ల్ అని ఆకాశానికి ఎత్తేయడం.. అదే సమయంలో వరుస ఫ్లాపులు రాగానే ఐరెన్ లెగ్ అని ముద్ర వేయడం ఇక్కడ మామూలే. కానీ అందరూ ఇదే దృష్టితో ఉంటారని చెప్పలేం.
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ విషయానికి వస్తే.. కథానాయికగా కెరీర్ ఆరంభంలో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న శ్రుతి హాసన్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘గబ్బర్ సింగ్’కు హీరోయిన్గా ఎంచుకోవడం మీద అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా ఒక ప్రముఖ నిర్మాత తనను పిలిచి.. వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్న శ్రుతిని కథానాయికగా పెట్టుకోవడం మీద హెచ్చరించాడని.. అది తనకెంతో బాధ కలిగించిందని.. తాను టాలెంట్ మాత్రమే చూస్తానని, వేరే విషయాలు పట్టించుకోనని చెప్పాడు హరీష్.
కట్ చేస్తే ‘గబ్బర్ సింగ్’ ఎంత పెద్ద బ్లాక్బస్టర్ అయిందో.. ఈ సినిమా తర్వాత శ్రుతి ఎంత బిజీ అయిందో అందరికీ తెలిసిందే. ఐతే వర్తమానంలోకి వస్తే.. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం మళ్లీ జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల లీడ్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో కథానాయిక పాత్రకు ‘ఏజెంట్’ భామ సాక్షి వైద్యను ఎంచుకోవడం తెలిసిందే.
ఐతే ‘ఏజెంట్’తో పాటు సాక్షి లేటెస్ట్ రిలీజ్ ‘గాండీవధారి అర్జున’ డిజాస్టర్ కావడంతో ఆమెను నెగెటివ్ సెంటిమెంట్గా భావించి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి తప్పిస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సాక్షి ఈ సినిమాకు సూట్ కాదని ఆమెను తప్పిస్తే ఓకే కానీ.. వరుసగా రెండు డిజాస్టర్లు పడ్డాయని ఆమె మీద ఐరెన్ లెగ్ ముద్ర వేసి బయటికి పంపిస్తుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అప్పట్లో శ్రుతి గురించి అలా అన్న హరీష్ శంకర్.. ఇప్పుడు ఇలా చేస్తాడని అనుకోలేం. మరి వాస్తవం ఏంటో చూడాలి.
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…