భాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఎవరికైనా ఓకే చెప్పే దుల్కర్ సల్మాన్ కి ఇటీవలే కింగ్ అఫ్ కొత్త పెద్ద షాకే ఇచ్చింది. కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా సుమారు పాతిక కోట్ల దాకా నష్టం మిగిల్చి ప్యాన్ ఇండియా ఆశలను ఆవిరి చేసింది. కెజిఎఫ్ ఫార్ములాతో ఏదో చేయబోయి దర్శకుడు బోర్లా కొట్టించేశాడు. అయితే దీనివల్ల ఇప్పటికిప్పుడు ఇమేజ్ కొచ్చిన నష్టం ఏమి లేదు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో మాత్రం దుల్కర్ చాలా స్పెషల్ గా నిలుస్తున్నాడు. కేవలం మార్కెట్ కోణంలోనే కాకుండా తనుంటే సినిమాకు మరింత యాక్టింగ్ ఫ్లేవర్ తోడవుతుందనే ఉద్దేశంతో దర్శకులు పాత్రలను డిజైన్ చేస్తున్నారు
ప్రాజెక్ట్ కెలో తాను ఉన్నది నిజమే అయినా అది చెప్పి చెప్పకుండా తప్పించుకున్న దుల్కర్ దర్శకుడు నాగ అశ్విన్ తో మహానటి టైంలో ఏర్పడ్డ బాండింగ్ వల్ల లెన్త్ ఎంతనేది అడగకుండా నటించాడని ఆల్రెడీ టాక్ ఉంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు భాగమైన మల్టీస్టారర్ లో ప్రభాస్ తో కలిసి స్క్రీన్ పంచుకునే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాడు. మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో రూపొందబోయే యాక్షన్ డ్రామాలోనూ దుల్కర్ ఉన్నాడట. ఇవి కాకుండా ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్ లో సూర్య చేయబోయే మూవీలోనూ దుల్కర్ ఉన్నాడని చెన్నై టాక్.
ఇలా ఒకేసారి రెండు మూడు ఇతర బాషల కమిట్మెంట్లు ఇస్తున్న దుల్కర్ అలా అని మలయాళంని నిర్లక్ష్యం చేయడం లేదు. ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేయనిదే ఇంటికి రావొద్దని తండ్రి మమ్ముట్టి క్రమం తప్పకుండ హెచ్చరిస్తూ ఉంటారట. మితిమీరిన జాప్యంతో ఏళ్ళ తరబడి ఒక మూవీ మీద ఉండటం హీరో కెరీర్ కి అంత మంచిది కాదని, అది తాను పాటించడం వల్లే ఇండియాలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో వందల సినిమాలు చేశానని చెబుతారట. నాన్న మాటను తూచా తప్పకుండ పాటిస్తున్న దుల్కర్ ఆ కారణంగానే నిడివి కన్నా ముందు కంటెంట్ కి ప్రాధాన్యం ఇస్తున్నాడు.
This post was last modified on September 14, 2023 11:34 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…