ఆరోగ్యం సహకరించకపోయినా ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలు చేసిన సమంతాకు 2024 చేదు జ్ఞాపకాలే ఇచ్చింది. శాకుంతలం దారుణమైన డిజాస్టర్ గా నిలవగా ఖుషి సైతం చివరికి ఫ్లాప్ గా మిగిలింది. మొదటి మూడు రోజుల హడావిడికే పరిమితమై తర్వాత పూర్తిగా నెమ్మదించి ఫైనల్ రన్ కు వచ్చేసింది. ఇక తను ఎదురు చూస్తున్న రిలీజ్ సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్. వరుణ్ ధావన్ జోడిగా ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మీద అమెజాన్ ప్రైమ్ భారీ ఎత్తున వందల కోట్ల పెట్టుబడి పెట్టింది.
వీటి సంగతలా ఉంచితే ప్రస్తుతం తనను పట్టి పీడిస్తున్న రుగ్మత నుంచి క్రమంగా కోలుకుంటున్న సామ్ త్వరలో ఫుల్ లెన్త్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం తలుపు తట్టినట్టు ముంబై టాక్. పవన్ కళ్యాణ్ పంజా తీసిన దర్శకుడు విష్ణువర్ధన్ తో నిర్మాత కరణ్ జోహార్ ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికోసమే కండల వీరుడు గుండు కొట్టించుకున్నాడు. మిలిటరీ ఆఫీసర్ గా చాలా పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేశారట. టైగర్ 3 బ్యాలన్స్ వర్క్, ప్రమోషన్లు పూర్తి కాగానే దీని రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.
అయితే సమంతాను ఖచ్చితంగా ఓకే చేశారా లేదానేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాకే తెలుస్తుంది. వరస ఫ్లాపుల దెబ్బకు సామ్ మార్కెట్ మీద కొంత ప్రభావం పడిన మాట వాస్తవమే. పైగా ఖుషిలో లుక్స్ పట్ల మిశ్రమ స్పందన వచ్చింది. అందుకే మళ్ళీ తనను తాను కొత్తగా మేకోవర్ చేసుకున్న సమంతాకు సల్మాన్ సరసన ప్రాజెక్టు ఓకే అయితే మరిన్ని ఆఫర్లు పట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఇలియానా తరహాలో అక్కడి స్టార్ హీరోలతో జోడి కట్టొచ్చు. యశోద, సిటాడెల్ లో ఫైట్లు చేసేందుకు వెనుకాడని సామ్ కు ఈ సినిమాలో కూడా అలాంటి స్టంట్లు ఉంటాయని సమాచారం.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…