మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. 80వ దశకంలో ఆంధ్రా ప్రాంతాన్ని గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ముందు ప్లాన్ చేశారు.
కానీ ఈ మధ్య చిత్ర బృందంలో పునరాలోచన మొదలైంది. ‘సలార్’ సెప్టెంబరు 28 నుంచి వాయిదా పడటంతో ఆ వీకెండ్ను వాడుకుందామని చూశారు. ప్రి ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచారు. ఒక వారం పాటు ఈ టార్గెట్తోనే పని చేసింది చిత్ర బృందం. అందుకే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాట తాలూకు ప్రోమోల్లో దసరా రిలీజ్ గురించి ప్రస్తావనే లేదు. అలా అని కొత్త డేట్ కూడా ఇవ్వలేదు.
డిస్ట్రిబ్యూటర్లకు కూడా ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరాకు రాదన్నట్లుగా హింట్ ఇచ్చారు. ఈ సమాచారంతో దసరాకు షెడ్యూల్ అయిన ‘భగవంత్ కేసరి’, ‘లియో’ చిత్రాల టీమ్స్ సంతోషించాయి. వాటికి మరింతగా థియేటర్ల బుకింగ్స్ జరిగాయి. తీరా చూస్తే ‘టైగర్ నాగేశ్వరరావు’ను సలార్ డేట్కు రిలీజ్ చేయడం కష్టమని తేలింది. అలా అని తిరిగి దసరాకు రిలీజ్ వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
విడుదల తేదీ విషయంలో ఇటు చిత్ర బృందంలో, అటు డిస్ట్రిబ్యూటర్లలో అయోమయం కొనసాగుతోంది. పండుగ సీజన్ కోసమని భగవంత్ కేసరి, లియోలతో పోటీ పడటం కరెక్టా లేక ఒక వారం ముందుగా సోలోగా రిలీజ్ చేయడం మంచిదా అనే చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సోలో రిలీజ్ కోసం క్రేజీ డేట్ను వదిలేయడం మీద తర్జన భర్జనలు నడుస్తున్నాయి. మరి ‘టైగర్’ ఏ రోజు ప్రేక్షకులను పలకరిస్తాడో చూడాలి.
This post was last modified on September 13, 2023 8:17 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…