మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. 80వ దశకంలో ఆంధ్రా ప్రాంతాన్ని గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ముందు ప్లాన్ చేశారు.
కానీ ఈ మధ్య చిత్ర బృందంలో పునరాలోచన మొదలైంది. ‘సలార్’ సెప్టెంబరు 28 నుంచి వాయిదా పడటంతో ఆ వీకెండ్ను వాడుకుందామని చూశారు. ప్రి ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచారు. ఒక వారం పాటు ఈ టార్గెట్తోనే పని చేసింది చిత్ర బృందం. అందుకే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాట తాలూకు ప్రోమోల్లో దసరా రిలీజ్ గురించి ప్రస్తావనే లేదు. అలా అని కొత్త డేట్ కూడా ఇవ్వలేదు.
డిస్ట్రిబ్యూటర్లకు కూడా ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరాకు రాదన్నట్లుగా హింట్ ఇచ్చారు. ఈ సమాచారంతో దసరాకు షెడ్యూల్ అయిన ‘భగవంత్ కేసరి’, ‘లియో’ చిత్రాల టీమ్స్ సంతోషించాయి. వాటికి మరింతగా థియేటర్ల బుకింగ్స్ జరిగాయి. తీరా చూస్తే ‘టైగర్ నాగేశ్వరరావు’ను సలార్ డేట్కు రిలీజ్ చేయడం కష్టమని తేలింది. అలా అని తిరిగి దసరాకు రిలీజ్ వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
విడుదల తేదీ విషయంలో ఇటు చిత్ర బృందంలో, అటు డిస్ట్రిబ్యూటర్లలో అయోమయం కొనసాగుతోంది. పండుగ సీజన్ కోసమని భగవంత్ కేసరి, లియోలతో పోటీ పడటం కరెక్టా లేక ఒక వారం ముందుగా సోలోగా రిలీజ్ చేయడం మంచిదా అనే చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సోలో రిలీజ్ కోసం క్రేజీ డేట్ను వదిలేయడం మీద తర్జన భర్జనలు నడుస్తున్నాయి. మరి ‘టైగర్’ ఏ రోజు ప్రేక్షకులను పలకరిస్తాడో చూడాలి.
This post was last modified on September 13, 2023 8:17 pm
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…