Movie News

టైగర్.. రెంటికీ చెడేలా ఉన్నాడే

మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. 80వ దశకంలో ఆంధ్రా ప్రాంతాన్ని గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ముందు ప్లాన్ చేశారు.

కానీ ఈ మధ్య చిత్ర బృందంలో పునరాలోచన మొదలైంది. ‘సలార్’ సెప్టెంబరు 28 నుంచి వాయిదా పడటంతో ఆ వీకెండ్‌ను వాడుకుందామని చూశారు. ప్రి ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచారు. ఒక వారం పాటు ఈ టార్గెట్‌తోనే పని చేసింది చిత్ర బృందం. అందుకే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాట తాలూకు ప్రోమోల్లో దసరా రిలీజ్ గురించి ప్రస్తావనే లేదు. అలా అని కొత్త డేట్ కూడా ఇవ్వలేదు.

డిస్ట్రిబ్యూటర్లకు కూడా ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరాకు రాదన్నట్లుగా హింట్ ఇచ్చారు. ఈ సమాచారంతో దసరాకు షెడ్యూల్ అయిన ‘భగవంత్ కేసరి’, ‘లియో’ చిత్రాల టీమ్స్ సంతోషించాయి. వాటికి మరింతగా థియేటర్ల బుకింగ్స్ జరిగాయి. తీరా చూస్తే ‘టైగర్ నాగేశ్వరరావు’ను సలార్ డేట్‌కు రిలీజ్ చేయడం కష్టమని తేలింది. అలా అని తిరిగి దసరాకు రిలీజ్ వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

విడుదల తేదీ విషయంలో ఇటు చిత్ర బృందంలో, అటు డిస్ట్రిబ్యూటర్లలో అయోమయం కొనసాగుతోంది. పండుగ సీజన్ కోసమని భగవంత్ కేసరి, లియోలతో పోటీ పడటం కరెక్టా లేక ఒక వారం ముందుగా సోలోగా రిలీజ్ చేయడం మంచిదా అనే చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సోలో రిలీజ్ కోసం క్రేజీ డేట్‌ను వదిలేయడం మీద తర్జన భర్జనలు నడుస్తున్నాయి. మరి ‘టైగర్’ ఏ రోజు ప్రేక్షకులను పలకరిస్తాడో చూడాలి.

This post was last modified on September 13, 2023 8:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏమిటో నితిన్ ధైర్యం?

అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మ‌స్‌కు అనుకున్న ఆ చిత్రం…

1 hour ago

బిగ్ డే : తండేల్ మీదే అందరి కళ్ళు

నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…

3 hours ago

‘పట్టు’ లేదని ముందే తెలుసుకున్నారా

ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…

10 hours ago

‘అమ‌రావ‌తి’ని ఆప‌ద్దు: ఈసీ లేఖ‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో…

14 hours ago

ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం.. సీఎం రేవంత్ ప్లాన్‌

'ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన…

15 hours ago

బాస్ ఈజ్ బాస్ : విశ్వక్ సేన్

వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…

15 hours ago