Movie News

18 నెలల నిరీక్షణకు యష్ ముగింపు

ఊహించిన దానికన్నా చాలా పెద్ద స్థాయిలో కెజిఎఫ్ తో ప్యాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకున్న శాండల్ వుడ్ హీరో యష్ దాని దెబ్బకే కొత్త సినిమా విషయంలో విపరీతమైన జాప్యం చేయాల్సి వచ్చింది. కాంబినేషన్లకు టెంప్ట్ అయిపోయి తొందపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇతర బాషల స్టార్లను చూసి అర్థం చేసుకుని చాలా మెల్లగా అడుగులు వేస్తున్నాడు. కెజిఎఫ్ 2 రిలీజై ఏడాది దాటుతున్నా ఇప్పటిదాకా కొత్త అనౌన్స్ మెంట్ రాకపోవడం పట్ల అభిమానులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇంకెంత కాలం వెయిట్ చేయాలని సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు ఈ సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ పడనుంది. యష్ 19 డిసెంబర్ మూడో వారంలో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు బెంగళూరు న్యూస్. గోవాలో జరిగే డ్రగ్ మాఫియా రాకెట్ చుట్టూ ఈ కథ నడుస్తుందని ఇన్ సైడ్ టాక్. దీని కోసమే యష్ కొన్ని నెలల క్రితం ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు గన్ షూటింగ్ తదితర వాటిలో ప్రత్యేక శిక్షణ పొందాడు. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న అవార్డు విన్నింగ్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ డ్రామా రూపొందనుంది. తన శైలికి భిన్నంగా కమర్షియల్ జానర్ లో కథ రాసుకున్నారట.

దీనికి సంబంధించి అప్డేట్స్ ని నవంబర్ నుంచి ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ తప్ప వేరొకటి ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఎంత ఆలస్యమవుతున్నా సరే యష్ పర్ఫెక్షన్ కోసమే ఇంత కాలం ఆగినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. బాలీవుడ్ నుంచి రామాయణం ఆఫర్ వచ్చినప్పటికీ దాని పట్ల అంత సుముఖంగా లేడని వినికిడి. రెగ్యులర్ స్టార్ల ఆలోచనలకు భిన్నంగా గీతూ మోహన్ దాస్ ని ఎంచుకున్న యష్ కెజిఎఫ్ ని మించిన సక్సెస్ ని కొట్టాలనే పంతంతో ఉన్నాడు. రాఖీ భాయ్ ని ఆవిడ ఎలా చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. లెట్ సీ. 

This post was last modified on September 13, 2023 12:04 am

Share

Recent Posts

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

8 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

55 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago