Movie News

కంగనా గాలి తీసేసిన సుశాంత్ లాయర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పటి నుంచి బాలీవుడ్లో ప్రముఖంగా వినిపిస్తున్న వాయిస్ కంగనా రనౌత్‌దే. బాలీవుడ్ మాఫియా సుశాంత్‌ను తొక్కేసిందని.. నెపోటిజం బ్యాచ్, వాళ్లను ప్రోత్సహించే కరణ్ జోహార్ లాంటి వాళ్ల వల్ల సుశాంత్‌ కుంగిపోయాడని.. అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించింది వాళ్లేనని ఆమె ఆరోపణలు చేసింది.

గత రెండు నెలల్లో ఇలా ఎన్నిసార్లు ఆరోపించిందో.. ఎన్ని వీడియో సందేశాలు పెట్టిందో లెక్కలేదు. కంగనాను అభిమానించే నసీరుద్దీన్ షా లాంటి వాళ్లు సైతం ఆమె తీరును ఖండించారు. సుశాంత్ మృతిని కంగనా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని విమర్శలు చేసిన వాళ్లూ లేకపోలేదు. ఐతే వాళ్లంతా అనడం వేరే కానీ.. స్వయంగా ఇప్పుడు సుశాంత్ కుటుంబ సభ్యులు పెట్టుకున్న లాయర్ వివేక్ సింగ్ కంగనా మీద ఇదే తరహా విమర్శలు చేశాడు.

సుశాంత్ మృతి విషయంలో అతడి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నది తన ప్రేయసి రియా చక్రవర్తి మీదే. ఆమెతో పాటు మరో ఇద్దరి మీద సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టులోనూ పిటిషన్ వేశాడు. ఈ కేసును సుశాంత్ కుటుంబ సభ్యుల తరఫున వాదిస్తున్న వివేక్ సింగ్.. సుశాంత్ మృతికి, బాలీవుడ్లో నెపోటిజానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు.

ఈ విషయంలో తాము బాలీవుడ్లో ఎవ్వరి మీదా ఆరోపణలు చేయదలుచుకోలేదన్నాడు. సుశాంత్ కొంత మేర నెపోటిజం వల్ల ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అని.. కానీ అతడి మృతికి అది కారణం కాదని అతనన్నాడు. కంగనా రనౌత్ ఆరోపణల గురించి అడిగితే.. ఆమె వ్యక్తిగత అజెండాతో వెళ్తోందని.. తాను లక్ష్యంగా చేసుకున్న కొందరు వ్యక్తుల్ని ఇరుకున పెట్టడం కోసం సుశాంత్ మృతిని వాడుకుంటోందని తేల్చేశాడు వివేక్. సుశాంత్ మృతికి రియానే కారణమని, అదే తమ ప్రధాన అభియోగమని అతనన్నాడు.

This post was last modified on August 22, 2020 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

40 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago