సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పటి నుంచి బాలీవుడ్లో ప్రముఖంగా వినిపిస్తున్న వాయిస్ కంగనా రనౌత్దే. బాలీవుడ్ మాఫియా సుశాంత్ను తొక్కేసిందని.. నెపోటిజం బ్యాచ్, వాళ్లను ప్రోత్సహించే కరణ్ జోహార్ లాంటి వాళ్ల వల్ల సుశాంత్ కుంగిపోయాడని.. అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించింది వాళ్లేనని ఆమె ఆరోపణలు చేసింది.
గత రెండు నెలల్లో ఇలా ఎన్నిసార్లు ఆరోపించిందో.. ఎన్ని వీడియో సందేశాలు పెట్టిందో లెక్కలేదు. కంగనాను అభిమానించే నసీరుద్దీన్ షా లాంటి వాళ్లు సైతం ఆమె తీరును ఖండించారు. సుశాంత్ మృతిని కంగనా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని విమర్శలు చేసిన వాళ్లూ లేకపోలేదు. ఐతే వాళ్లంతా అనడం వేరే కానీ.. స్వయంగా ఇప్పుడు సుశాంత్ కుటుంబ సభ్యులు పెట్టుకున్న లాయర్ వివేక్ సింగ్ కంగనా మీద ఇదే తరహా విమర్శలు చేశాడు.
సుశాంత్ మృతి విషయంలో అతడి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నది తన ప్రేయసి రియా చక్రవర్తి మీదే. ఆమెతో పాటు మరో ఇద్దరి మీద సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టులోనూ పిటిషన్ వేశాడు. ఈ కేసును సుశాంత్ కుటుంబ సభ్యుల తరఫున వాదిస్తున్న వివేక్ సింగ్.. సుశాంత్ మృతికి, బాలీవుడ్లో నెపోటిజానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు.
ఈ విషయంలో తాము బాలీవుడ్లో ఎవ్వరి మీదా ఆరోపణలు చేయదలుచుకోలేదన్నాడు. సుశాంత్ కొంత మేర నెపోటిజం వల్ల ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అని.. కానీ అతడి మృతికి అది కారణం కాదని అతనన్నాడు. కంగనా రనౌత్ ఆరోపణల గురించి అడిగితే.. ఆమె వ్యక్తిగత అజెండాతో వెళ్తోందని.. తాను లక్ష్యంగా చేసుకున్న కొందరు వ్యక్తుల్ని ఇరుకున పెట్టడం కోసం సుశాంత్ మృతిని వాడుకుంటోందని తేల్చేశాడు వివేక్. సుశాంత్ మృతికి రియానే కారణమని, అదే తమ ప్రధాన అభియోగమని అతనన్నాడు.
This post was last modified on August 22, 2020 10:08 am
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…