సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పటి నుంచి బాలీవుడ్లో ప్రముఖంగా వినిపిస్తున్న వాయిస్ కంగనా రనౌత్దే. బాలీవుడ్ మాఫియా సుశాంత్ను తొక్కేసిందని.. నెపోటిజం బ్యాచ్, వాళ్లను ప్రోత్సహించే కరణ్ జోహార్ లాంటి వాళ్ల వల్ల సుశాంత్ కుంగిపోయాడని.. అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించింది వాళ్లేనని ఆమె ఆరోపణలు చేసింది.
గత రెండు నెలల్లో ఇలా ఎన్నిసార్లు ఆరోపించిందో.. ఎన్ని వీడియో సందేశాలు పెట్టిందో లెక్కలేదు. కంగనాను అభిమానించే నసీరుద్దీన్ షా లాంటి వాళ్లు సైతం ఆమె తీరును ఖండించారు. సుశాంత్ మృతిని కంగనా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని విమర్శలు చేసిన వాళ్లూ లేకపోలేదు. ఐతే వాళ్లంతా అనడం వేరే కానీ.. స్వయంగా ఇప్పుడు సుశాంత్ కుటుంబ సభ్యులు పెట్టుకున్న లాయర్ వివేక్ సింగ్ కంగనా మీద ఇదే తరహా విమర్శలు చేశాడు.
సుశాంత్ మృతి విషయంలో అతడి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నది తన ప్రేయసి రియా చక్రవర్తి మీదే. ఆమెతో పాటు మరో ఇద్దరి మీద సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టులోనూ పిటిషన్ వేశాడు. ఈ కేసును సుశాంత్ కుటుంబ సభ్యుల తరఫున వాదిస్తున్న వివేక్ సింగ్.. సుశాంత్ మృతికి, బాలీవుడ్లో నెపోటిజానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు.
ఈ విషయంలో తాము బాలీవుడ్లో ఎవ్వరి మీదా ఆరోపణలు చేయదలుచుకోలేదన్నాడు. సుశాంత్ కొంత మేర నెపోటిజం వల్ల ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అని.. కానీ అతడి మృతికి అది కారణం కాదని అతనన్నాడు. కంగనా రనౌత్ ఆరోపణల గురించి అడిగితే.. ఆమె వ్యక్తిగత అజెండాతో వెళ్తోందని.. తాను లక్ష్యంగా చేసుకున్న కొందరు వ్యక్తుల్ని ఇరుకున పెట్టడం కోసం సుశాంత్ మృతిని వాడుకుంటోందని తేల్చేశాడు వివేక్. సుశాంత్ మృతికి రియానే కారణమని, అదే తమ ప్రధాన అభియోగమని అతనన్నాడు.
This post was last modified on August 22, 2020 10:08 am
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…