ఏ భాషలో తీసినా కొన్ని సినిమాలు సోల్ పోకుండా ఉండాలంటే వాటిని డబ్బింగ్ ద్వారానే ఇతర ప్రేక్షకులకు అందించాలి. ప్రతిసారి అన్నింటికి రీమేక్ సూత్రం పనికి రాదు. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ లో చేసిన ఆర్టిస్టుల స్థాయిలో మళ్ళీ అలాంటి క్యాస్టింగే దొరక్కపోవచ్చు. 96ని ఏరికోరి మరీ జానుగా తెలుగులో తీసిన చేదు అనుభవాలు మనకు చాలానే ఉన్నాయి. సరే అనువాదమైనా సరే వీలైనంత త్వరగా వాటిని ఇవ్వగలిగితే నిర్మాతలకు కాసిన్ని డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎంత మంచి టాక్ వచ్చినా కొన్నింటి విషయంలో నిర్లక్ష్యం వహించడం కరెక్ట్ కాదు.
ఇటీవలి కాలంలో కన్నడ, మలయాళంలో రెండు అద్భుత విజయం సాధించిన చిత్రాలున్నాయి. మొదటిది శాండల్ వుడ్ లో వచ్చిన సప్తసాగర దాచే ఎల్లో సైడ్ ఏ. హృదయాలను మెలితిప్పే ఎమోషన్ తో దర్శకుడు దీన్ని తీర్చిదిద్దిన తీరు చూసిన ప్రతి ఒక్కరితో వాహ్ అనిపించుకుంది. నెరేషన్ కొంత స్లోగా అనిపించినా కథ డిమాండ్ ప్రకారం ఆ మాత్రం ఉండాలి. 777 ఛార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ భావోద్వేగాల సమ్మేళనం జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ట్విట్టర్ లో కొందరు ఫ్యాన్స్ డబ్బింగ్ గురించి అడిగితే అదే పనిలో ఉన్నామని చెప్పాడు రక్షిత్
ఇక మల్లువుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ఆర్డిఎక్స్(RDX) అవుట్ అండ్ అవుట్ థ్రిల్ ఇచ్చే యూత్ యాక్షన్ డ్రామా. ముగ్గురు కుర్రాళ్ల మధ్య బంధాన్ని, వాళ్లకు శత్రువుతో ఉన్న రివెంజ్ ని బ్యాలన్స్ చేస్తూ తీసిన తీరు విజిల్స్, కలెక్షన్స్ రెండూ తెప్పించుకుంది. మన ప్రేక్షకులకు నచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. వీటిని సరైన టైంలో డబ్ చేసి ఈ సెప్టెంబర్ 15 విడుదలకు రెడీ చేసి ఉంటే జనాలకు ఆప్షన్లు ఉండేవి. కానీ నిర్మాతల ఆలోచన ఎలా ఉందో అంతు చిక్కడం లేదు. ఓటిటిల జమానాలో డబ్బింగ్ అయినా రీమేక్ అయినా వీలైనంత ఆలస్యం చేయకూడదు. లేట్ చేస్తేనే నష్టం.
This post was last modified on September 12, 2023 2:51 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…