తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే నయనతార ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళవుతున్నా డిమాండ్ మాత్రం అలాగే మెయింటైన్ చేస్తూ కొత్త హీరోయిన్లకు సవాల్ విసురుతున్నారు. సాధారణంగా పెళ్ళయాక అవకాశాలు తగ్గిపోవడం ఎవరికైనా సహజమే. కొందరు మాత్రమే దీనికి మినహాయింపుగా నిలుస్తారు. మన దగ్గర సమంతను ఉదాహరణగా తీసుకోవచ్చు. కానీ తను ఎలాంటి పాత్రయినా చేసే రేంజని పూర్తిగా చెప్పలేం. కానీ నయన్ విషయంలో మాత్రం దర్శకులు అలాంటి అనుమానాలు పెట్టుకోవడం లేదు. గ్లామరైనా యాక్షనైనా ఈజీ మోసేస్తుందని నమ్మకం చూపిస్తున్నారు.
తాజాగా తన రెమ్యునరేషన్ పది కోట్ల దాకా ఛార్జ్ చేస్తున్నట్టు చెన్నై టాక్. జిఎస్టిలు గట్రా కలుపుకుంటే ఇంకో కోటి అదనంగా ఉండొచ్చట. ఇంత మొత్తం అడుగుతున్నా ఎస్ అనే ప్రొడ్యూసర్లే ఎక్కువగా ఉన్నారని సమాచారం. మాములుగా ఇంత పారితోషికం ఒక మీడియం రేంజ్ స్టార్ హీరోకి ఇవ్వడమే కష్టం. అలాంటిది హీరోయిన్ కు ఆఫర్ చేయడం చిన్న విషయం కాదు. పైగా ఇటీవలే జవాన్ అదిరిపోయే బ్లాక్ బస్టర్ కావడంతో హిందీ నుంచి కూడా దర్శకులు వచ్చి కథలు వినిపిస్తున్నట్టు తెలిసింది. ఇద్దరు పిల్లల తల్లనే సంగతే ఎవరికీ గుర్తు రానంత మేజిక్ నయనతార చేస్తోందన్న మాట.
జవాన్ కైతే అంత ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రతి సినిమాకు ఇలా వర్కౌట్ కాదని విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం జయం రవితో నటించిన ఇరైవర్ ఈ నెల 28 విడుదల కానుంది. మరో రెండు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు షూటింగ్ కు వెళ్లాల్సి ఉంది. స్టార్ హీరోల సరసన ఇంకా ఏ ప్రాజెక్టు ఓకే చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి 157కి అడుగుతున్నారు కానీ ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదట. ఏది ఏమైనా సుదీర్ఘ కాలం మార్కెట్ ని కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళలో నయన్ దే అగ్ర స్థానం. ఆ తర్వాత త్రిష, తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్ళు ఫుల్ బిజీగా కాలక్షేపం చేసేసుకుంటున్నారు.
This post was last modified on September 12, 2023 11:18 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…