కరోనా మహమ్మారి బారిన పడ్డ దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్ని రోజుల పరిస్థితి విషమించి ఐసీయూలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారన్న సమాచారం బయటికి వచ్చిన దగ్గర్నుంచి ఆయన అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. తమ ఇంట్లో మనిషి ఆ స్థితిలో ఉన్నట్లుగా జనాలు బాధ పడుతున్నారు.. తన పాటలతో అపరిమిత ఆనందాన్ని ఇచ్చిన ఆయన క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తన్నారు. అయితే బాలు ఆరోగ్య స్థితి గురించి రోజుకో రకంగా అప్ డేట్ వస్తుండటం వారిని కలవర పరుస్తోంది. ముందు ఆయన పరిస్థితి విషమం అన్నారు.. తర్వాత కోలుకున్నట్లు వార్తలొచ్చాయి.
కానీ గత రెండు రోజుల్లో పరిస్థితి మళ్లీ విషమించినట్లు అప్ డేట్ రావడం.. బాలు తనయుడు ఎస్పీ చరణ్ గురువారం నాటి అప్ డేట్ ఇస్తూ తీవ్ర భావోద్వేగానికి గురికావడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోయింది. ఎక్కడ చేదు వార్త వినాల్సి వస్తుందో అని కంగారు పడ్డారు. ఐతే వారి ఆందోళన తగ్గించే అప్ డేట్ ఇచ్చాడు చరణ్ శుక్రవారం. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న అతను.. ఆయన కోసం ప్రార్థనలు కొనసాగించాలన్నాడు. బాలు కోలుకున్నట్లు కాదని.. కానీ డాక్టర్లు తాజా బులిటెన్లో క్రిటికల్ అనే పదం వాడకుండా స్టేబుల్ అనడం మాత్రం ఊరటనిచ్చే విషయమని అతనన్నాడు. చరణ్ కూడా కొంచెం ప్రశాంతంగా కనిపించడం.. బాలుకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి ఇచ్చిన బులిటెన్లోనిజంగానే ఎక్కడా క్రిటికల్ అనే పదం వాడకపోవడం బాలు అభిమానులకు ఉపశమనమే.
This post was last modified on August 21, 2020 9:26 pm
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…