భోళా శంకర్ తర్వాత సుస్మిత కొణిదెల నిర్మాతగా చేయాల్సిన సినిమా కన్నా ముందు చిరంజీవి మెగా 157 మొదలుపెట్టే సూచనలు పెరుగుతున్నాయి. కూతురు ప్రాజెక్టు విషయంలో స్క్రిప్ట్, దర్శకుడు రెండు అంశాల మీద ఇంకా ఏకాభిప్రాయం రాలేదట. దాంతో దర్శకుడు వశిష్ట ఫాంటసీ మూవీనే స్టార్ట్ చేసే దిశగా పనులు జరుగుతున్నట్టు మెగా కాంపౌండ్ న్యూస్. నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఒకవేళ సుస్మిత చిత్రం కొంత ఆలస్యంగా షురూ చేసినా అది వేగంగా పూర్తి చేసే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు.
ప్రస్తుతానికి హీరోయిన్ల వేట జరుగుతోందట. ప్రాథమికంగా మూడు ఆప్షన్లు పెట్టుకున్నట్టు తెలిసింది. నయనతార ఇప్పటికే సైరా నరసింహారెడ్డిలో చేసింది కాబట్టి జోడిగా తనైతే బాగుంటుందనే అభిప్రాయం టీమ్ లో ఉన్నట్టు తెలిసింది. గాడ్ ఫాదర్ లో చెల్లిగా నటించినా దాని ప్రభావం అంతగా పడలేదు. ఇక అనుష్క శెట్టిని కూడా అడుగుతున్నారట. ఇటీవలే రీ ఎంట్రీలో టాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న స్వీటీ గతంలో స్టాలిన్ లో స్పెషల్ సాంగ్, సైరాలో క్యామియో తప్ప చిరు సరసన ఫుల్ లెన్త్ రోల్ లో నటించలేదు. ఇప్పుడు ఓకే చెబితే జోడి పరంగా స్క్రీన్ మీద బాగుంటుంది.
సీతారామం మృణాల్ ఠాకూర్ ని కూడా అడుగుతున్నట్టు వినికిడి. అయితే ఇంత సీనియర్ హీరో పక్కన జోడిగా కడితే తర్వాత ఇబ్బందులు ఏమైనా వస్తాయనే ఆలోచన ఉండకపోదు. ప్రస్తుతం నాని హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఓకే చెప్పడం అంత సులభం కాకపోవచ్చు. పైగా హిందీలోనూ ఈ భామ బిజీగానే ఉంది. ఒకవేళ ఇవేవి వర్కౌట్ కానీ పక్షంలో వశిష్టకు కొత్త ఛాలెంజ్ మొదలవుతుంది. అసలే విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్న ఫాంటసీ మూవీ కాబట్టి మీడియం రేంజ్ వాళ్ళను తీసుకుని సర్దుకోవడానికి లేదు. ప్రతిదీ గ్రాండ్ గా ఉండాల్సిందే.
This post was last modified on September 9, 2023 11:50 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…