భోళా శంకర్ తర్వాత సుస్మిత కొణిదెల నిర్మాతగా చేయాల్సిన సినిమా కన్నా ముందు చిరంజీవి మెగా 157 మొదలుపెట్టే సూచనలు పెరుగుతున్నాయి. కూతురు ప్రాజెక్టు విషయంలో స్క్రిప్ట్, దర్శకుడు రెండు అంశాల మీద ఇంకా ఏకాభిప్రాయం రాలేదట. దాంతో దర్శకుడు వశిష్ట ఫాంటసీ మూవీనే స్టార్ట్ చేసే దిశగా పనులు జరుగుతున్నట్టు మెగా కాంపౌండ్ న్యూస్. నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఒకవేళ సుస్మిత చిత్రం కొంత ఆలస్యంగా షురూ చేసినా అది వేగంగా పూర్తి చేసే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు.
ప్రస్తుతానికి హీరోయిన్ల వేట జరుగుతోందట. ప్రాథమికంగా మూడు ఆప్షన్లు పెట్టుకున్నట్టు తెలిసింది. నయనతార ఇప్పటికే సైరా నరసింహారెడ్డిలో చేసింది కాబట్టి జోడిగా తనైతే బాగుంటుందనే అభిప్రాయం టీమ్ లో ఉన్నట్టు తెలిసింది. గాడ్ ఫాదర్ లో చెల్లిగా నటించినా దాని ప్రభావం అంతగా పడలేదు. ఇక అనుష్క శెట్టిని కూడా అడుగుతున్నారట. ఇటీవలే రీ ఎంట్రీలో టాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న స్వీటీ గతంలో స్టాలిన్ లో స్పెషల్ సాంగ్, సైరాలో క్యామియో తప్ప చిరు సరసన ఫుల్ లెన్త్ రోల్ లో నటించలేదు. ఇప్పుడు ఓకే చెబితే జోడి పరంగా స్క్రీన్ మీద బాగుంటుంది.
సీతారామం మృణాల్ ఠాకూర్ ని కూడా అడుగుతున్నట్టు వినికిడి. అయితే ఇంత సీనియర్ హీరో పక్కన జోడిగా కడితే తర్వాత ఇబ్బందులు ఏమైనా వస్తాయనే ఆలోచన ఉండకపోదు. ప్రస్తుతం నాని హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఓకే చెప్పడం అంత సులభం కాకపోవచ్చు. పైగా హిందీలోనూ ఈ భామ బిజీగానే ఉంది. ఒకవేళ ఇవేవి వర్కౌట్ కానీ పక్షంలో వశిష్టకు కొత్త ఛాలెంజ్ మొదలవుతుంది. అసలే విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్న ఫాంటసీ మూవీ కాబట్టి మీడియం రేంజ్ వాళ్ళను తీసుకుని సర్దుకోవడానికి లేదు. ప్రతిదీ గ్రాండ్ గా ఉండాల్సిందే.
This post was last modified on September 9, 2023 11:50 am
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…