ఒక్క సలార్ సినిమా వాయిదా పడేసరికి వివిధ భాషల్లో ఎన్ని సినిమాలు రీ షెడ్యూల్ అయ్యాయో తెలిసిందే. సలార్ వాయిదా వార్త బ్రేక్ అయ్యాక ఇండియాలో అన్ని మేజర్ ఫిలిం ఇండస్ట్రీలు చిన్నపాటి కుదుపుకి లోనయ్యాయి. సలార్ వాయిదా అయితే పక్కా అని తేలిపోయింది కానీ.. కొత్త డేట్ ఏదనే విషయంలోనే క్లారిటీ లేదు. సలార్ బాంబు ఎక్కడ తమ మీద పడుతుందో అని తర్వాత రెండు మూడు నెలల్లో రిలీజ్ ఖరారు చేసుకున్న సినిమాల నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.
సంక్రాంతి అని.. క్రిస్మస్ అని.. దీపావళి అని.. ఇలా రకరకాల సీజన్లను పరిశీలిస్తున్నారు. మధ్యలో పండుగ సీజన్ను పక్కన పెట్టి నవంబరు 24కి ఫిక్సయినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఐతే క్రిస్మస్, సంక్రాంతి అంటే మరీ ఆలస్యం అయిపోతుంది.. పైగా ఆయా సీజన్ల మీద చాలా సినిమాలు ఆశలు పెట్టుకున్నాయి. కాబట్టి ఆ రెండు ఆప్షన్లను పక్కన పెట్టేశారు.
నవంబరు 24న రిలీజ్ చేస్తే పండుగ అడ్వాంటేజ్ ఉండదు, పైగా ఇంకో వారానికే యానిమల్ లాంటి క్రేజీ మూవీ వస్తుంది. అందుకే పలు విధాల ఆలోచించి దీపావళి వీకెండ్లో సలార్ను రిలీజ్ చేద్దామని కొంచెం గట్టిగానే ఆలోచిస్తోందట చిత్ర బృందం. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ వీకెండే కోరుకుంటున్నారట. దీపావళి టాలీవుడ్కు అంత అచ్చొచ్చిన సీజన్ కాకపోయినా.. నార్త్ ఇండియాతో పాటు తమిళనాట క్రేజీ సీజనే. లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది కూడా.
అందుకే ఆ టైంలో సల్మాన్ ఖాన్ సినిమా టైగర్3 షెడ్యూల్ అయి ఉన్నప్పటికీ.. సలార్ను అప్పుడే దించుదామని చూస్తున్నారట. టైగర్ 3 వాయిదా పడుతుందనే సంకేతాలు ఇప్పటి వరకు అయితే రాలేదు. మరి సల్మాన్ సినిమా పోటీలో ఉన్నా సై అంటున్నారంటే సలార్ టీం కాన్ఫిడెన్సే వేరని చెప్పాలి. అదే ఫిక్స్ అయితే మాత్రం సల్మాన్కు చాలా కష్టమవుతుంది. అసలే సల్మాన్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. కాబట్టి ఈ నేపథ్యంలో సల్మాన్ అండ్ టీం గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…