లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగులు ఆగిపోయి అందరినీ అసహనానికి గురి చేస్తోంటే, ఈ సమయాన్ని మరికొందరు ప్రభావవంతంగా వాడుకుంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. లాక్ డౌన్లో ఎడిటింగ్ చేసుకుని చూసుకోగా కథాగమనంలో కొన్ని ఇబ్బందులున్నాయని అందరికీ అనిపించిందట.
దాంతో సమస్యలున్నాయని అనిపించిన చోట సన్నివేశాలు మార్చి రాసుకుంటున్నారట. మామూలుగా ఇంత ఖాళీ దొరక్కపోతే ఈ చిత్రానికి కరక్షన్లు, రీషూట్లు వుండేవి కాదు. ఈ గ్యాప్ వల్ల ఎక్కువమందికి చూపించడానికి, అభిప్రాయాలు సేకరించడానికి, అవసరమయిన కరక్షన్లు చేసుకోవడానికి వీలు చిక్కింది.
కందిరీగ తర్వాత రభస, హైపర్ చిత్రాలతో ఫెయిలయిన సంతోష్ శ్రీనివాస్కి దర్శకుడిగా ఇది చాలా కీలకం. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్కి కూడా ఇప్పుడు హిట్ బాగా అవసరం. కందిరీగ, అల్లుడు శీను తరహాలో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. నవంబర్లో మళ్లీ సెట్స్ మీదకు వెళ్లి వచ్చే ఫిబ్రవరికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on August 22, 2020 3:01 pm
గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…
ఇటీవలే విడుదలైన టాక్సిక్ టీజర్ మీద పాజిటివ్, నెగటివ్ రెండు రకాల రియాక్షన్లు సోషల్ మీడియాలో కనిపించాయి. వయొలెన్స్ ఎక్కువయ్యిందని…
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…