లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగులు ఆగిపోయి అందరినీ అసహనానికి గురి చేస్తోంటే, ఈ సమయాన్ని మరికొందరు ప్రభావవంతంగా వాడుకుంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. లాక్ డౌన్లో ఎడిటింగ్ చేసుకుని చూసుకోగా కథాగమనంలో కొన్ని ఇబ్బందులున్నాయని అందరికీ అనిపించిందట.
దాంతో సమస్యలున్నాయని అనిపించిన చోట సన్నివేశాలు మార్చి రాసుకుంటున్నారట. మామూలుగా ఇంత ఖాళీ దొరక్కపోతే ఈ చిత్రానికి కరక్షన్లు, రీషూట్లు వుండేవి కాదు. ఈ గ్యాప్ వల్ల ఎక్కువమందికి చూపించడానికి, అభిప్రాయాలు సేకరించడానికి, అవసరమయిన కరక్షన్లు చేసుకోవడానికి వీలు చిక్కింది.
కందిరీగ తర్వాత రభస, హైపర్ చిత్రాలతో ఫెయిలయిన సంతోష్ శ్రీనివాస్కి దర్శకుడిగా ఇది చాలా కీలకం. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్కి కూడా ఇప్పుడు హిట్ బాగా అవసరం. కందిరీగ, అల్లుడు శీను తరహాలో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. నవంబర్లో మళ్లీ సెట్స్ మీదకు వెళ్లి వచ్చే ఫిబ్రవరికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on August 22, 2020 3:01 pm
జనసేనకు శుక్రవారం అత్యంత కీలకమైన రోజు. పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి 11 ఏళ్లు పూర్తి కానున్నాయి.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని…
ఫ్లాపుల నుంచి ఉపశమనం పొందుతూ 'క' రూపంలో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి దిల్ రుబాగా ప్రేక్షకుల…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నిత్యం…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి…
తెలంగాణ అసెంబ్లీలో గురువారం చోటుచేసుకున్న రచ్చ… బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో కలకలం…
ఖుషి తర్వాత స్క్రీన్ పై కనిపించకుండా పోయిన సమంతా తిరిగి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన…