Movie News

లాక్‍ డౌన్‍లో అల్లుడి కథ మారింది

లాక్‍ డౌన్‍ వల్ల సినిమా షూటింగులు ఆగిపోయి అందరినీ అసహనానికి గురి చేస్తోంటే, ఈ సమయాన్ని మరికొందరు ప్రభావవంతంగా వాడుకుంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‍ హీరోగా ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్‍ శ్రీనివాస్‍ డైరెక్షన్‍లో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్‍ దాదాపుగా పూర్తి కావచ్చింది. లాక్‍ డౌన్‍లో ఎడిటింగ్‍ చేసుకుని చూసుకోగా కథాగమనంలో కొన్ని ఇబ్బందులున్నాయని అందరికీ అనిపించిందట.

దాంతో సమస్యలున్నాయని అనిపించిన చోట సన్నివేశాలు మార్చి రాసుకుంటున్నారట. మామూలుగా ఇంత ఖాళీ దొరక్కపోతే ఈ చిత్రానికి కరక్షన్లు, రీషూట్లు వుండేవి కాదు. ఈ గ్యాప్‍ వల్ల ఎక్కువమందికి చూపించడానికి, అభిప్రాయాలు సేకరించడానికి, అవసరమయిన కరక్షన్లు చేసుకోవడానికి వీలు చిక్కింది.

కందిరీగ తర్వాత రభస, హైపర్‍ చిత్రాలతో ఫెయిలయిన సంతోష్‍ శ్రీనివాస్‍కి దర్శకుడిగా ఇది చాలా కీలకం. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‍కి కూడా ఇప్పుడు హిట్‍ బాగా అవసరం. కందిరీగ, అల్లుడు శీను తరహాలో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. నవంబర్‍లో మళ్లీ సెట్స్ మీదకు వెళ్లి వచ్చే ఫిబ్రవరికి విడుదల చేసేలా ప్లాన్‍ చేస్తున్నారు.

This post was last modified on August 22, 2020 3:01 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మల్టీస్టారర్ సినిమా మన దగ్గర లైటేనా

కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు…

23 minutes ago

స్పిరిట్ మీద నమ్మకంతోనే సల్మాన్ రిస్కు

కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…

1 hour ago

భగవంతుడు మీద ప్రతాప్ ప్రభావం

టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…

2 hours ago

ఇంతకీ ధోని ఎక్కడ?

ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…

2 hours ago

శిల్పా రవికి ఈసారి టికెట్ లేనట్టేనా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…

2 hours ago

లెనిన్ అసలు సమస్య పెద్ది కాదు

జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…

3 hours ago