విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘ఖుషి’ కి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా మరుసటి రోజు మెల్లగా కలెక్షన్స్ తో పికప్ అయింది. వీకెండ్ మంచి వసూళ్లు సాదించింది. కానీ తర్వాత అకాల వర్షాలు సినిమా కలెక్షన్స్ పై ఎఫక్ట్ చూపించాయి. అక్కడి నుండి సినిమా రెవెన్యూ పరంగా డ్రాప్ అవుతూ వచ్చింది. ఇక ఈ వీకెండ్ జవాన్ తెలుగు స్టేట్స్ లో భారీ వసూళ్లు రాబట్టనుంది. ఇప్పటికే డే 1 తెలుగు రాష్ట్రాల్లో ఊహించని కలెక్షన్స్ వచ్చాయి. మరో పక్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కూడా మంచి వసూళ్లు అందుకుంటుంది.
ఈ లెక్కన చూస్తే విజయ్ ఈ సినిమాతో 100 కోట్ల గ్రాస్ చేరడం చాలా కష్టంగా కనిపిస్తుంది. విజయ్ ను స్టార్ ను చేసింది అర్జున్ రెడ్డి సినిమా అయినప్పటికీ 100 కోట్లతో టాప్ ప్లేస్ లో నిలపింది మాత్రం ‘గీత గోవిందం’. ఆ సినిమా తర్వాత విజయ్ వరుసగా ఫ్లాప్స్ , డిజాస్టర్స్ అందుకున్నాడు. లైగర్ తో మళ్ళీ 100 కోట్లు కొడతాడని భావిస్తే అది కూడా డిజాస్టర్ అనిపించుకుంది. ఇక ఖుషి మీదే ఆశలు పెట్టుకున్న విజయ్ కి ఈ సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ అందించలేకపోయింది. సినిమాకు ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.
బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 15 కోట్ల వరకూ రావాల్సి ఉంది. దీంతో ఇప్పుడు గీత గోవిందంతో 100 కోట్ల బ్లాక్ బస్టర్ అందించిన పరశురామ్ మీదే విజయ్ మళ్ళీ నమ్మకం పెట్టుకున్నాడు. పరశురామ్ డైరెక్షన్ లో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి థియేటర్స్ లోకి రాబోతుంది. ప్రస్తుతం విజయ్ ఈ సినిమా షూటింగ్ ను ఫాస్ట్ గా కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. విజయ్ కి తొలి 100 కోట్ల సినిమా ఇచ్చిన దర్శకుడు పరశురామ్ మళ్ళీ ఈ సినిమాతో రౌడీ స్టార్ కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తాడేమో చూడాలి.
This post was last modified on September 8, 2023 4:27 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…