Movie News

బ్ర‌హ్మి నోట క‌న్నీళ్లు తెప్పించే మాట‌

ఇప్పుడు వివిధ రంగాల్లో ప్ర‌ముఖులుగా వెలుగొందుతున్న చాలా మంది ఒక‌ప్పుడు అనేక క‌ష్టాలు ప‌డ్డ‌వాళ్లే. తిండికి, క‌నీస అవ‌స‌రాల‌కు ఇబ్బంది ప‌డ్డ‌వాళ్లే. అలాంటి వాళ్ల‌లో తానూ ఒక‌డిన‌ని అంటున్నారు లెజెండ‌రీ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం. ఎప్పుడూ తెర‌పై న‌వ్వించే ఆయ‌న.. అప్పుడ‌ప్పుడూ వ్య‌క్తిగ‌త విష‌యాలు చెబుతూ ఎమోష‌న‌ల్ అవుతుంటారు.

లాక్ డౌన్ నేప‌థ్యంలో ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ త‌న చిన్న‌ప్ప‌టి రోజుల్ని గుర్తు చేసుకుని ఆయ‌న ఉద్వేగానికి గుర‌య్యారు. చిన్న‌ప్పుడు త‌మ కుటుంబంలో అంద‌రూ ఆక‌లితో అల‌మ‌టించిన‌ట్లు ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

‘‘ఒక పూట భోజనం లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు. మా నాన్న భోజనం పెట్టే వరకూ మా ఆరుగురు అన్నదమ్ములం ఎలా ఎదురు చూశామో నాకు తెలుసు. కొన్నిసార్లు కేవలం మంచినీళ్లు తాగి పడుకొన్న రోజులు ఉన్నాయి. రెక్కాడితో కానీ డొక్కాడదనే పరిస్థితి నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఎం.ఎ చేసి, లెక్చరర్‌ ఉద్యోగంలో చేరి.. ఈ స్థితికి వచ్చాను. అందుకే సహనంగా, ఓర్పుగా ఉండమని చెప్పే అర్హత నాకు ఉంది కాబట్టి చెబుతున్నా. పనికి వెళ్తేనే కుటుంబానికి రోజు గడిచే పరిస్థితిని నేను అనుభవించా. అది ఎంతో భయంకరంగా ఉంటుంది. 18 రోజులు తిండి తినకపోతే చనిపోతారంటారు. 17 రోజులు ఎవరి ముందు చేతులు చాచొద్దు. 18వ రోజు అడుక్కోరా.. లేకపోతే చచ్చిపోతావు అని మా నాన్న నాకు చెప్పేవారు’’ అని బ్ర‌హ్మి గుర్తు చేసుకున్నారు.

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ఎంతో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని.. ఆ ప‌రిస్థితుల్లో మనందరి కోసం పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, పోలీసుల్ని, పాత్రికేయుల్ని అభినందించాలని.. ప్రధాని మోడీ వీళ్లంద‌రినీ ప్రోత్సహిస్తూ సమావేశాల్లో ప్రసంగిస్తున్నారని బ్ర‌హ్మి అన్నాడు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రెస్‌మీట్ పెడితే ఓ భరోసా క‌లుగుతోంద‌ని.. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ వయసులో చిన్నవాడైనా మంత్రులతో చర్చించి ప్రజలు బాధపడకూడదని చర్యలు తీసుకుంటున్నార‌ని.. ఇలాంటి నాయ‌కుల‌కు అంద‌రం స‌హ‌క‌రించాల‌ని బ్ర‌హ్మి పిలుపునిచ్చారు.

This post was last modified on April 25, 2020 9:44 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago