ఈ వేసవిలో భారీ అంచనాల మధ్య విడుదలైన అఖిల్ మూవీ ఏజెంట్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. రూ.80 కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా అందులో పదిశాతం షేర్ కూడా రాబట్టలేకపోయింది థియేట్రికల్ రన్లో. ఐతే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసి నాలుగు నెలలు దాటినా ఇప్పటిదాకా ఓటీటీలో రిలీజ్ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిజానికి ఈ సినిమా థియేటర్లలో ఉండగానే డిజిటల్ రిలీజ్ గురించి సోనీ లివ్ ఓటీటీ వాళ్లు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఈ సినిమాను డిజిటల్గా రిలీజ్ చేయాలని కూడా అనుకున్నారు. కానీ ఎందుకో తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. వారం తిరిగేసరికే థియేటర్ల నుంచి లేచిపోయిన ఈ చిత్రాన్ని డిజిటల్గా రిలీజ్ చేయడానికి ఎందుకు పునరాలోచించారో అర్థం కాలేదు.
మధ్యలో ఈ సినిమాను డిజిటల్ రిలీజ్కు తగ్గట్లుగా ఎడిట్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ నిర్మాతతో విభేదాలు తలెత్తి ఈ ప్రాజెక్టు నుంచి దర్శకుడు సురేందర్ రెడ్డి రిలీజ్ వీక్లోనే దూరం జరిగాడు. మరి ఎడిటింగ్ సంగతి ఏమైందో ఏమో తెలియదు. నెలలు గడుస్తున్నాయి. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ సంగతి ఏమైందో తెలియదు. డబ్బులు పెట్టి సినిమా డిజిటల్ రైట్స్ కొన్న సోనీ లివ్ వాళ్లు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియదు.
బహుశా సినిమా డిజాస్టర్ కావడంతో ముందు చెల్లిస్తామన్న మొత్తం ఇవ్వడానికి సోనీ లివ్ వాళ్లు వెనుకంజ వేసి ఉండొచ్చేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయి ఓటీటీలో అయినా అఖిల్ కోసం చూద్దాం అనుకున్న అక్కినేని అభిమానులకు… అసలెందుకీ సినిమా అంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలుసుకోవాలని అనుకున్న సగటు ప్రేక్షకులకు నిరాశ తప్పట్లేదు. మరి నిర్మాత అనిల్ సుంకర డిజిటల్ రిలీజ్ ఎప్పుడు చేయిస్తారో?
This post was last modified on September 7, 2023 2:05 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…