రీ రిలీజులు కూడా పక్కాగా ప్లాన్ చేసుకుని విడుదల చేయాల్సిన ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. సరైన ప్రణాళిక ఉంటే కాసుల వర్షం ఖాయమే. సెప్టెంబర్ 22 రాబోతున్న 7జి బృందావన్ కాలనీ మీద డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న ప్లానింగ్ చూస్తుంటే స్టార్ హీరోలు లేకుండా కేవలం కొత్త మొహాలతో రికార్డులు నమోదు చేసిన పాత సినిమాగా కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఉంది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, యూరప్ లాంటి దేశాల్లోనూ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. థియేటర్లు కూడా సరిపడా దొరకనుండటంతో ఏడు రోజుల పాటు వసూళ్ల మోత ఖాయమే.
ఈ మూవీకి కలిసొస్తున్న అతి పెద్ద సానుకూలాంశం ఆ రోజు కొత్త రిలీజులు ఒక్కటంటే ఒక్కటి లేకపోవడం. సలార్ వస్తుందని భయపడి సెప్టెంబర్ మూడో వారాన్ని అనాథలా వదిలేశారు. తీరా చూస్తే ప్రభాస్ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఇది ఊహించని పరిణామం కావడంతో అప్పటికప్పుడు 22కి సిద్ధమయ్యేలా ఏ నిర్మాతా లేకపోవడంలో 7జి బృందావన్ కాలనీకి భలే కలిసొస్తుంది. ఆరంజ్, మన్మథుడుకి థియేటర్లలో ఊగిపోయిన ప్రేక్షకులు ఇక యువన్ శంకర్ రాజా చేసిన మేజిక్ కి, రవి-సోనియా అగర్వాల్ మధ్య లవ్ ట్రాక్ కి ఏ రేంజ్ లో పరవశించిపోతారో చెప్పడం కష్టమే.
ఎంతలేదన్నా నాలుగైదు రోజుల పాటు స్ట్రాంగ్ రన్ ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే జవాన్ అప్పటికంతా చల్లారిపోయి ఉంటుంది. వినాయచవితికి వచ్చే చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీ ఏదో అద్భుతంగా ఉన్నాయని టాక్ వస్తే తప్ప మార్కెట్ లో వారం మించి నిలబడవు. సో ఆడియన్స్ కి బృందావన్ కాలనీనే బెస్ట్ ఛాయస్ అవుతుంది. అయినా ఎంత విచిత్రమైన పరిస్థితి కాకపోతే టివిలో యూట్యూబ్ లో అరిగిపోయిన బ్లాక్ బస్టర్ల కోసం ఇంతగా హైప్ ఏర్పడుతోందంటే కొత్త సినిమాల నిర్మాతలు దర్శకులు తప్పెక్కడ జరుగుతోందో అర్జెంటుగా గుర్తించాలి.
This post was last modified on September 7, 2023 12:32 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…