ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియా హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘తానాజీ’ చిత్రాన్ని రూపొందించిన ఓం రౌత్తో సినిమా చేయడానికి బాలీవుడ్ సూపర్ స్టార్లు లైన్లో ఉండగా అతను.. ఏరి కోరి మన ప్రభాస్తో.. అది కూడా రామాయణ కథను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశాడు. ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్ల దాకా ఉండొచ్చని అంటున్నారు.
వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలుపెట్టి ఆ తర్వాతి ఏడాది విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన టైమింగ్.. అలాగే రిలీజ్ చేయబోయే టైమింగ్ చాలా ప్రత్యేకం కావడం విశేషం. ఈ నెల ఐదో తారీఖున అయోధ్యలో రామాలయానికి భూమి పూజ జరిగింది. అది జరిగిన రెండు వారాలకే రాముడి కథతో ‘ఆది పురుష్’ అనౌన్స్ చేసి ఆసక్తి రేకెత్తించారు.
ఇక ఈ సినిమా విడుదలయ్యేదేమో రామాలయం పూర్తయ్యే సమయానికి అన్నది తాజా సమాచారం. దేశంలోని అద్భుత ఆలయ నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రపంచ స్థాయిలో అయోధ్య రామాలయాన్ని నిర్మించడానికి అయోధ్యరాామాలయ ట్రస్టు సన్నాహాలు చేస్తున్నాయి. వందల కోట్ల ఖర్చుతో అది నిర్మితం కానుంది.
కరోనా కారణంగా భూమి పూజ కార్యక్రమాన్ని సింపుల్గా చేసేశారు కానీ.. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మాత్రం హంగామా మామూలుగా ఉండదు. అప్పుడు దేశంలోని హిందువులందరి ఉద్వేగం పతాక స్థాయికి చేరుకోవడం ఖాయం. అది జరిగిన తర్వాత ‘ఆదిపురుష్’ సినిమాను రిలీజ్ చేస్తే టైమింగ్ అదిరిపోతుందంతే. సినిమా సరిగ్గా తీయాలే కానీ.. అద్భుత ఫలితం అందుకోవడానికి అవకాశముంది. కచ్చితంగా ప్రభాస్ మరోసారి ‘బాహుబలి’ తరహా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.
This post was last modified on August 22, 2020 2:58 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…