Movie News

బాలయ్య నిప్పురవ్వే అక్షయ్ రాణిగంజ్

బయోపిక్కులు ఎంచుకోవడంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తర్వాతే ఎవరైనా. ఇప్పటిదాకా ఎన్ని చేశారో లెక్క బెట్టడం కష్టం. సూర్య ఆకాశం నీ హద్దురాని సైతం వదలకుండా అదే దర్శకురాలితో తెరకెక్కించడం ఆయనకే చెల్లింది. తాజాగా మిషన్ రాణిగంజ్ పేరుతో ఒక సర్వైవర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది 1989లో జరిగిన నిజ జీవిత ట్రాజెడీ ఆధారంగా తెరకెక్కింది. గతంలో అక్కికి రుస్తుం రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు టిను సురేష్ దేశాయ్ దీనికి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 6న థియేటర్లలో రానుంది.

దీనికి బాలయ్య సినిమాకు కనెక్షన్ ఏంటనేగా మీ డౌట్ అక్కడికే వద్దాం. 1993లో నిప్పురవ్వ వచ్చింది. విజయశాంతి నిర్మాణ భాగస్వామి కం హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో ఏళ్ళ తరబడి నిర్మాణం జరుపుకుని బంగారు బుల్లోడుతో పాటు ఒకే రోజు విడుదలయ్యింది. రాణి గంజ్ బొగ్గు గనుల్లో జరిగిన విషాదాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని తెలంగాణ సింగరేణి మైన్స్ బ్యాక్ డ్రాప్ కు మార్చి నిప్పురవ్వకు కమర్షియల్ హంగులు జోడించారు. తీవ్రమైన జాప్యంతో పాటు అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినా స్టాండర్డ్స్ పరంగా విమర్శకుల మెప్పు పొందింది.

అండర్ గ్రౌండ్ బొగ్గు గనుల్లో వందలాది కార్మికులు తవ్వకాల్లో ఉండగా హఠాత్తుగా నీరొచ్చి మైన్ ని ముంచేస్తుంది. వాళ్ళను బాలకృష్ణ కాపాడే ఎపిసోడ్ చాలా కష్టపడి తీశారు. ఇప్పుడు దాన్నే పూర్తి స్థాయి రియల్ ఇన్సి డెంట్ గా మార్చి వాస్తవికతకు మరింత దగ్గరగా తీశారు. ఒకే కథ కాకపోయినా బ్యాక్ డ్రాప్ పరంగా సారూప్యతలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అప్పటి ప్రమాదంలో 220 కార్మికులు పని చేస్తున్న సమయంలో ఆరుగురు చనిపోగా 68 మందిని రక్షించి బయటికి తీసుకొచ్చారు. అదే రాణిగంజ్ అసలు నేపథ్యం.

This post was last modified on September 6, 2023 10:02 pm

Share

Recent Posts

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

15 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

1 hour ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

4 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago