నిన్నటి తరం హీరోయిన్ కస్తూరి గురించి పరిచయం అక్కర్లేదు. ‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్ చెల్లెలి పాత్రలో.. ‘అన్నమయ్య’లో నాగార్జున్ సరసన కథానాయికగా ఆమె మంచి పాపులారిటీనే సంపాదించింది. హీరోయిన్గానే కాక.. క్యారెక్టర్ రోల్స్తో తమిళ, తెలుగు భాషల్లో చాలా సినిమాలే చేసింది కస్తూరి.
సినీ కెరీర్ ముగిశాక పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిల్ అయిపోయిన కస్తూరి ఈ మధ్య మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి సీరియళ్లు, సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే కొన్నేళ్ల కిందట ఆమె ఒక ఫొటో షూట్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తల్లి పాల మీద అవగాహన పెంచే క్రమంలో ఆమె టాప్ లెస్గా బిడ్డకు పాలిస్తున్న ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలు ఇంటర్నెట్లో బయటికి రావడం సంచలనం రేపింది.
ఓ ఇండియన్ హీరోయిన్ ఇలాంటి ఫొటో షూట్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. పైగా కస్తూరి లాంటి హోమ్లీ హీరోయిన్ ఇలా చేయడం మరింత సంచలనమైంది. దీనిపై వివాదం కూడా నడిచింది. దీని గురించి ఇప్పుడు ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడింది కస్తూరి. నిజానికి ఆ ఫొటో షూట్ తాను ఓ ఫారిన్ హెల్త్ మ్యాగజైన్ కోసం చేసిందని.. ఆ సొసైటీలో దీన్ని రిసీవ్ చేసుకునే విధానం వేరుగా ఉంటుందని.. తనకది ఏమాత్రం తప్పుగా అనిపించలేదని కస్తూరి తెలిపింది.
కానీ ఎవరో ఆ ఫొటోలను తమకు తెలియకుండా లీక్ చేసేశారని.. దీంతో ఇంటర్నెట్లో వైరల్ అయిపోయాయని.. అది తనకు ఇబ్బందికర పరిణామమే అని ఆమె అంది. మన వాళ్లు వేరే రకంగా ఆ ఫొటోలను తీసుకున్నారని.. మన సొసైటీలో అలాంటివి జీర్ణించుకోలేరని.. తన మీద విమర్శలు కూడా వచ్చాయని.. తాను చేసింది తప్పు అనిపించిందని కస్తూరి తెలిపింది.
This post was last modified on August 21, 2020 5:21 pm
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…