ఒక పెద్ద ప్యాన్ ఇండియా సినిమా వాయిదా పడితే దాన్ని ఆషామాషీగా పుకారు రూపంలో చెప్పకూడదు. అఫీషియల్ గా ప్రొడక్షన్ హౌస్ నుంచి కనీసం ఒక పోస్టర్ రూపంలో రావాలి. కానీ హోంబాలే ఫిలిమ్స్ కి అదేమీ పట్టలేదు. సెప్టెంబర్ 28 నుంచి సలార్ పోస్ట్ పోన్ అయిన సంగతి ప్రపంచమంతా కోడై కూస్తున్నా తాము మాత్రం సైలెంట్ గా ఉండటం ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగించింది. అయితే కొత్త డేట్ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నందు వల్లే ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారని బెంగళూరు టాక్. పలు దఫాలు డిస్ట్రిబ్యూటర్లతో ఫోన్లలో తీవ్ర చర్చలు జరిగాయని తెలిసింది.
సలార్ టీమ్ మూడు ఆప్షన్లు చూస్తోంది. ఒకటి నవంబర్. అయితే బయ్యర్లు దీని పట్ల అంత సానుకూలంగా లేరు. దసరా, దీపావళి పండగలయ్యాక చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని అభిప్రాయపడుతున్నారు. రెండు డిసెంబర్. ఆల్రెడీ ఇతర సినిమాలతో ప్యాక్ అయిపోయింది. కానీ ఇంత భారీ చిత్రాలకు అది సూటబుల్ కాదు. ఇక జనవరి చూస్తేనేమో గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, విజయ్ దేవరకొండ 13 కాచుకుని ఉన్నాయి. సలార్ వస్తుందంటే ఒకటో రెండో డ్రాప్ అవ్వాలి. అదేదో ఇప్పుడే చెప్పాలి. మరీ ఆలస్యం చేస్తే తోటి నిర్మాతల నుంచే నిరసన సెగలు చూడాల్సి వస్తుంది.
మొన్న జూన్ లో వంద రోజుల కౌంట్ డౌన్ అంటూ హంగామా మొదలుపెట్టిన హోంబాలే సంస్థ మాట మీద ఉండేలా ప్లాన్ చేసుకోకపోవడం ముమ్మాటికీ ప్లానింగ్ లోపమే. విఎఫెక్స్ పనులు సరిగా జరగలేదనే టాక్ వినిపిస్తోంది కానీ నిజానిజాలు టీమ్ కే ఎరుక. తన వంతు నటించడం పూర్తి చేశాడు కాబట్టి ఇక్కడ ప్రభాస్ ని తప్పు బట్టేందుకు ఏమీ లేదు. కాకపోతే అభిమానులు బాధ పడటం గుర్తించి భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. చివరికి ఏ డెసిషన్ వస్తుందోననే సస్పెన్స్ మూవీ లవర్స్ నే కాదు ఇండస్ట్రీ వర్గాలను సైతం తీవ్రంగా వేధిస్తోంది.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…