ఒక పెద్ద ప్యాన్ ఇండియా సినిమా వాయిదా పడితే దాన్ని ఆషామాషీగా పుకారు రూపంలో చెప్పకూడదు. అఫీషియల్ గా ప్రొడక్షన్ హౌస్ నుంచి కనీసం ఒక పోస్టర్ రూపంలో రావాలి. కానీ హోంబాలే ఫిలిమ్స్ కి అదేమీ పట్టలేదు. సెప్టెంబర్ 28 నుంచి సలార్ పోస్ట్ పోన్ అయిన సంగతి ప్రపంచమంతా కోడై కూస్తున్నా తాము మాత్రం సైలెంట్ గా ఉండటం ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగించింది. అయితే కొత్త డేట్ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నందు వల్లే ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారని బెంగళూరు టాక్. పలు దఫాలు డిస్ట్రిబ్యూటర్లతో ఫోన్లలో తీవ్ర చర్చలు జరిగాయని తెలిసింది.
సలార్ టీమ్ మూడు ఆప్షన్లు చూస్తోంది. ఒకటి నవంబర్. అయితే బయ్యర్లు దీని పట్ల అంత సానుకూలంగా లేరు. దసరా, దీపావళి పండగలయ్యాక చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని అభిప్రాయపడుతున్నారు. రెండు డిసెంబర్. ఆల్రెడీ ఇతర సినిమాలతో ప్యాక్ అయిపోయింది. కానీ ఇంత భారీ చిత్రాలకు అది సూటబుల్ కాదు. ఇక జనవరి చూస్తేనేమో గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, విజయ్ దేవరకొండ 13 కాచుకుని ఉన్నాయి. సలార్ వస్తుందంటే ఒకటో రెండో డ్రాప్ అవ్వాలి. అదేదో ఇప్పుడే చెప్పాలి. మరీ ఆలస్యం చేస్తే తోటి నిర్మాతల నుంచే నిరసన సెగలు చూడాల్సి వస్తుంది.
మొన్న జూన్ లో వంద రోజుల కౌంట్ డౌన్ అంటూ హంగామా మొదలుపెట్టిన హోంబాలే సంస్థ మాట మీద ఉండేలా ప్లాన్ చేసుకోకపోవడం ముమ్మాటికీ ప్లానింగ్ లోపమే. విఎఫెక్స్ పనులు సరిగా జరగలేదనే టాక్ వినిపిస్తోంది కానీ నిజానిజాలు టీమ్ కే ఎరుక. తన వంతు నటించడం పూర్తి చేశాడు కాబట్టి ఇక్కడ ప్రభాస్ ని తప్పు బట్టేందుకు ఏమీ లేదు. కాకపోతే అభిమానులు బాధ పడటం గుర్తించి భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. చివరికి ఏ డెసిషన్ వస్తుందోననే సస్పెన్స్ మూవీ లవర్స్ నే కాదు ఇండస్ట్రీ వర్గాలను సైతం తీవ్రంగా వేధిస్తోంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…