మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. ఇంకో రెండు రోజుల్లో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న సినిమా ఇది. అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టిల క్రేజీ కాంబినేషన్లో యువ దర్వకుడు మహేష్ బాబు ఈ చిత్రాన్ని రూపొందించాడు. అనుష్క, నవీన్ల ఇంటిపేర్లనే తీసుకుని ఈ సినిమాకు టైటిల్ పెట్టడం అందరి దృష్టినీ ఆకర్షించింది. మరి ఈ టైటిలే ఎందుకు పెట్టారు.. ఆ ఆలోచన ఎలా వచ్చింది అన్నది ఆసక్తికరం.
దీని వెనుక స్టోరీని నవీన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘మా సినిమాను అనౌన్స్ చేశాక దానికి సంబంధించిన వార్తకు ఒక పేపర్లో ‘శెట్టితో పొలిశెట్టి’ అని హెడ్డింగ్ పెట్టారు. ఇదేదో బాగుందే దీని మీదే టైటిల్ ఎందుకు పెట్టకూడదు అనిపించి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అని పేరు పెట్టాం. సినిమాలో పాత్రల పేర్లు కూడా అవి కలిసి వచ్చేలాగే పెట్టుకున్నాం. అలా దీనికి టైటిల్ ఖరారైంది’’ అని నవీన్ వెల్లడించాడు. పేపర్లలో వచ్చే వార్తలను బట్టి కథలు తయారు కావడం మామూలే కానీ.. ఇలా హెడ్డింగ్ చూసి సినిమా టైటిల్ నిర్ణయించడం అరుదే.
ఇక ‘జాతిరత్నాలు’కు.. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి మధ్య చాలా గ్యాప్ రావడం గురించి నవీన్ స్పందిస్తూ.. ‘‘జాతిరత్నాలు సినిమా ముందే రెడీ అయినా.. కరోనా వల్ల రిలీజ్ ఆలస్యం అయింది. ఆ సినిమా రిలీజ్ టైంకి కూడా కరోనా ప్రబావం కొనసాగుతోంది. అప్పటికి ఇంకా ఎన్ని వేవ్లు ఉంటాయో.. ఎంత కాలం దాని ప్రభావం కొనసాగుతోంద అర్థం కాలేదు.
ఆ గందరగోళం మధ్య షూటింగ్ వద్దనుకుని ఊరుకున్నా. కరోనా ప్రభావం పూర్తిగా పోయాకే ఈ సినిమా షూట్ మొదలుపెట్టాం. గత ఏడాదంతా చిత్రీకరణ జరిగింది. ఈ ఏడాది మేకు రిలీజ్ అనుకున్నాం. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల సినిమా ఇంత ఆలస్యం అయింది. కానీ ఇకపై నా నుంచి ఇంత గ్యాప్ ఉండదు. ఇకపై వరుసగా సినిమాలు చేస్తా. ఏడాదికి రెండు రిలీజ్లు ఉండేలా చూసుకుంటా’’ అని నవీన్ పొలిశెట్టి వివరించాడు.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…