క్రికెటర్ల బయోపిక్కులు తెరకు కొత్తేమీ కాదు. ఎంఎస్ ధోని కథ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సచిన్, అజారుద్దీన్, మిథాలీ రాజ్ ల మీద వచ్చిన సినిమాలు కొన్ని విజయం సాధించాయి, కొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇవన్నీ మన దేశం ఆటగాళ్లవే. కానీ మొదటిసారి శ్రీలంక క్రీడాకారుడి జీవితాన్ని స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం జరిగింది. అదే 800. శ్రీలంక సుప్రసిద్ధ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ లైఫ్ స్టోరీ స్క్రీన్ పై రానుంది. సచిన్ టెండూల్కర్ చేతుల మీద ఇవాళ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ముత్తయ్య(మధుర్ మిట్టల్) తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస వెళ్లిన కుటుంబం. కడు పేదరికంలో ఎన్నో అవమానాల మధ్య చాలీ చాలని తిండితో రోజులు గడుపుతూ ఉంటారు. క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి ఉన్న మురళీధరన్ ఈ అవరోధాలు తట్టుకుని జాతీయ జట్టులో చోటు సంపాదించుకుంటాడు. బాక్సింగ్ డే మ్యాచ్ లో బంతిని విసురుతున్నాడనే అభియోగం మీద క్రీడకు దూరం చేయడంతో అంతుచిక్కని వలయంలో చిక్కుకుంటాడు. పడిన చోటే లేవాలనే సూత్రం అనుసరించి తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రపంచానికి నిరూపిస్తాడు. అదెలా జరిగిందో స్క్రీన్ మీద చూడాలి.
ఇలాంటివి బోలెడు చూసినప్పటికీ బరువైన డ్రామా ఈ 800లో కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీలంకలో ఎప్పుడూ చూడని చీకటి కోణాలను ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఎల్టిటిఈ చీఫ్ ప్రభాకరన్ తో ముత్తయ్య సంభాషించడం, బస్సులో ప్రయాణిస్తుండగా సాటి క్రికెటర్లతో పాటు బాంబు దాడికి గురవ్వడం లాంటి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు పొందుపరిచారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. మొత్తానికి క్రికెట్ ని విపరీతంగా ఇష్టపడే వాళ్ళను టార్గెట్ చేసుకున్న 800 ఆ అంచనాలకు తగ్గట్టే కనిపిస్తోంది.
This post was last modified on September 5, 2023 6:28 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…