Movie News

800 వికెట్ల బరువైన భావోద్వేగం

క్రికెటర్ల బయోపిక్కులు తెరకు కొత్తేమీ కాదు. ఎంఎస్ ధోని కథ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సచిన్, అజారుద్దీన్, మిథాలీ రాజ్ ల మీద వచ్చిన సినిమాలు కొన్ని విజయం సాధించాయి, కొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇవన్నీ మన దేశం ఆటగాళ్లవే. కానీ మొదటిసారి శ్రీలంక క్రీడాకారుడి జీవితాన్ని స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం జరిగింది. అదే 800. శ్రీలంక సుప్రసిద్ధ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ లైఫ్ స్టోరీ స్క్రీన్ పై రానుంది. సచిన్ టెండూల్కర్ చేతుల మీద ఇవాళ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ముత్తయ్య(మధుర్ మిట్టల్) తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస వెళ్లిన కుటుంబం. కడు పేదరికంలో ఎన్నో అవమానాల మధ్య చాలీ చాలని తిండితో రోజులు గడుపుతూ ఉంటారు. క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి ఉన్న మురళీధరన్ ఈ అవరోధాలు తట్టుకుని జాతీయ జట్టులో చోటు సంపాదించుకుంటాడు. బాక్సింగ్ డే మ్యాచ్ లో బంతిని విసురుతున్నాడనే అభియోగం మీద క్రీడకు దూరం చేయడంతో అంతుచిక్కని వలయంలో చిక్కుకుంటాడు. పడిన చోటే లేవాలనే సూత్రం అనుసరించి తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రపంచానికి నిరూపిస్తాడు. అదెలా జరిగిందో స్క్రీన్ మీద చూడాలి.

ఇలాంటివి బోలెడు చూసినప్పటికీ బరువైన డ్రామా ఈ 800లో కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీలంకలో ఎప్పుడూ చూడని చీకటి కోణాలను ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఎల్టిటిఈ చీఫ్ ప్రభాకరన్ తో ముత్తయ్య సంభాషించడం, బస్సులో ప్రయాణిస్తుండగా సాటి క్రికెటర్లతో పాటు బాంబు దాడికి గురవ్వడం లాంటి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు పొందుపరిచారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. మొత్తానికి క్రికెట్ ని విపరీతంగా ఇష్టపడే వాళ్ళను టార్గెట్ చేసుకున్న 800 ఆ అంచనాలకు తగ్గట్టే కనిపిస్తోంది.

Satya

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

25 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

4 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

9 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

10 hours ago