సలార్ తప్పుకోవడంతో ఒక్కసారిగా చిన్న సినిమాల నిర్మాతలు, హీరోలు అలెర్ట్ అయిపోయి ఆ డేట్ మీద కర్చీఫ్ వేసేందుకు పోటీ పడుతున్నారు. మొన్న సితార ఎంటర్ టైన్మెంట్స్ తమ మ్యాడ్ ని మొదటి ప్రకటనగా ఇచ్చేయగా ఇవాళ రూల్స్ రంజన్ బృందం ప్రెస్ మీట్ పెట్టి మరీ సెప్టెంబర్ 28న వస్తున్నామని చెప్పేశారు. స్కంద, టైగర్ నాగేశ్వరరావులు సైతం అదే డేట్ చూస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా ముందుగానే చెప్పేసుకోవడం ద్వారా ఒక అడ్వాంటేజ్ ఉంటుందని గుర్తించిన ప్రొడ్యూసర్లు ముందస్తు జాగ్రత్తగా తమ వైపు ఒక లాజిక్ ఉండేలా రిజర్వేషన్ చేసుకుంటున్నారు.
ఎంచుకుంటున్న కంటెంట్ వల్ల ట్రోలింగ్ కి గురవుతున్న కిరణ్ అబ్బవరం ముఖ్యంగా మీటర్ విషయంలో ఎదురుకున్న విమర్శలు అన్ని ఇన్ని కావు. మరీ నేలవిడిచి సాము చేసే రీతిలో తనకే మాత్రం సెట్ కానీ పోలీస్ ఆఫీసర్ మాస్ తో చేసిన ఆ సినిమా దారుణంగా డిజాస్టరవ్వడమే కాదు సమర్పించిన మైత్రికి సైతం ఒక బ్లాక్ మార్క్ లా ఉండిపోయింది. కిరణ్ కు అంతకు ముందు దక్కిన వినరో భాగ్యము విష్ణు కథ డీసెంట్ సక్సెస్ దీని దెబ్బకే గుర్తు లేనంతగా ఎగిరిపోయింది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం రూల్స్ రంజన్ ని సమర్పిస్తుండగా ఆయన అబ్బాయి రత్నం కృష్ణ డైరెక్షన్ చేశారు.
ఈ సందర్భంగా చాలా ప్రశ్నలే ఎదురయ్యాయి కానీ యూనిట్ సభ్యులు అన్నింటికి ఓపిగ్గా సమాధానం చెప్పారు. రూల్స్ రంజన్ జనం దృష్టిలో పడేందుకు శ్రేయ ఘోషల్ పాడిన సమ్మోహనుడా పెదవిస్తానీకే పాట, అందులో హీరోయిన్ నేహా శెట్టి గ్లామర్ ఆరబోత బాగా క్లిక్ అయ్యాయి. ఎంటర్ టైన్మెంట్ జానర్ లోనే రూపొందినప్పటికీ ఇందులో అన్ని అంశాలు ఉంటాయని అంటున్నారు. త్వరలో ఒక ప్యాన్ ఇండియా ప్రాజెక్టుకి రెడీ అవుతున్న కిరణ్ అబ్బవరంకి ఇది పెద్ద హిట్ అయితేనే దానికి సంబంధించిన అడుగులు వేగంగా పడతాయి. చూడాలి మరి ఈసారైనా టాలెంట్ కి పాజిటివ్ ఫలితం తోడవుతుందో లేదో.
This post was last modified on September 4, 2023 2:12 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…