Movie News

ధృవ మిస్ చేసుకున్న ప్రభాస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెస్ట్ మూవీస్ లో ఖచ్చితంగా చోటు దక్కించుకునే సినిమా ధృవ. తమిళ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ కి రీమేక్ అయినప్పటికీ దర్శకుడు సురేందర్ రెడ్డి దాన్ని తీర్చిదిద్దిన తీరు ఇక్కడా సూపర్ హిట్ అందించింది. అయితే ఒరిజినల్ సృష్టికర్త మోహన్ రాజా దీనికి సంబంధించిన ఒక షాకింగ్ విషయం చెప్పారు. అదేంటంటే మొదట ఈ కథ రాసుకున్నది ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకునట. స్టోరీ చెప్పడం పూర్తయ్యాక తాను ప్రస్తుతం ప్రేమకథ చేసే ఆలోచనలో ఉన్నానని, ఇప్పుడీ పోలీస్ డ్రామా చేయలేనని చెప్పడంతో మోహన్ రాజా చెన్నైకి తిరిగి వెళ్లిపోయారు.

ఈలోగా నాగార్జున ఆజాద్ ని విజయ్ తో తీసే అవకాశం రావడంతో దాన్నే వేలాయుధంగా తీసి సూపర్ హిట్ అందుకున్నారు. మళ్ళీ తని ఒరువన్ ని బయటికి  తీసి ఎవరెవరినో అడగటం ఎందుకు, తమ్ముడు జయం రవితోనే చేస్తే పోలా అని అలోచించి వెంటనే ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించాడు. కెరీర్ లో మోహన్ రాజా మొదటి స్ట్రెయిట్ మూవీ అదే. నయనతారని హీరోయిన్ గా తీసుకుని అరవింద్ స్వామిని విలన్ గా చేసి క్రేజీ క్యాస్టింగ్ తో తక్కువ టైంలో పూర్తి చేసి ఆ ఏడాది పెద్ద హిట్స్ లో ఒకటి అందుకున్నాడు. దాన్నే అల్లు అరవింద్, చిరంజీవి చూసి నచ్చేసి హక్కులు తెచ్చేసుకున్నారు.

ఒకవేళ ధృవ కనక ప్రభాస్ చేసుంటే ఎలా ఉండేదన్న ఊహే ఫ్యాన్స్ ని తెగ బాధ పెడుతోంది. ఎందుకంటే అలాంటి కథలు అరుదుగా వస్తాయి. రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా అన్ని వర్గాలను మెప్పించే స్కోప్ ఉన్నవి రావడం లక్కే. అన్నట్టు తని ఒరువన్ 2ని రెడీ చేసిన మోహన్ రాజా దాన్ని రామ్ చరణ్ కి వినిపిస్తాడా లేదా అనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఒకవేళ నిజంగా కథ బాగుంటే మాత్రం సమాంతరంగా చేయడం మంచిది. అక్కడ హిట్టయ్యాక చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అసలే మెగా ఫ్యాన్స్ రీమేక్ అనే పదం వినపడితే చాలు కస్సుమంటున్నారు. 

This post was last modified on September 4, 2023 12:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

5 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

8 hours ago