Movie News

ధృవ మిస్ చేసుకున్న ప్రభాస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెస్ట్ మూవీస్ లో ఖచ్చితంగా చోటు దక్కించుకునే సినిమా ధృవ. తమిళ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ కి రీమేక్ అయినప్పటికీ దర్శకుడు సురేందర్ రెడ్డి దాన్ని తీర్చిదిద్దిన తీరు ఇక్కడా సూపర్ హిట్ అందించింది. అయితే ఒరిజినల్ సృష్టికర్త మోహన్ రాజా దీనికి సంబంధించిన ఒక షాకింగ్ విషయం చెప్పారు. అదేంటంటే మొదట ఈ కథ రాసుకున్నది ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకునట. స్టోరీ చెప్పడం పూర్తయ్యాక తాను ప్రస్తుతం ప్రేమకథ చేసే ఆలోచనలో ఉన్నానని, ఇప్పుడీ పోలీస్ డ్రామా చేయలేనని చెప్పడంతో మోహన్ రాజా చెన్నైకి తిరిగి వెళ్లిపోయారు.

ఈలోగా నాగార్జున ఆజాద్ ని విజయ్ తో తీసే అవకాశం రావడంతో దాన్నే వేలాయుధంగా తీసి సూపర్ హిట్ అందుకున్నారు. మళ్ళీ తని ఒరువన్ ని బయటికి  తీసి ఎవరెవరినో అడగటం ఎందుకు, తమ్ముడు జయం రవితోనే చేస్తే పోలా అని అలోచించి వెంటనే ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించాడు. కెరీర్ లో మోహన్ రాజా మొదటి స్ట్రెయిట్ మూవీ అదే. నయనతారని హీరోయిన్ గా తీసుకుని అరవింద్ స్వామిని విలన్ గా చేసి క్రేజీ క్యాస్టింగ్ తో తక్కువ టైంలో పూర్తి చేసి ఆ ఏడాది పెద్ద హిట్స్ లో ఒకటి అందుకున్నాడు. దాన్నే అల్లు అరవింద్, చిరంజీవి చూసి నచ్చేసి హక్కులు తెచ్చేసుకున్నారు.

ఒకవేళ ధృవ కనక ప్రభాస్ చేసుంటే ఎలా ఉండేదన్న ఊహే ఫ్యాన్స్ ని తెగ బాధ పెడుతోంది. ఎందుకంటే అలాంటి కథలు అరుదుగా వస్తాయి. రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా అన్ని వర్గాలను మెప్పించే స్కోప్ ఉన్నవి రావడం లక్కే. అన్నట్టు తని ఒరువన్ 2ని రెడీ చేసిన మోహన్ రాజా దాన్ని రామ్ చరణ్ కి వినిపిస్తాడా లేదా అనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఒకవేళ నిజంగా కథ బాగుంటే మాత్రం సమాంతరంగా చేయడం మంచిది. అక్కడ హిట్టయ్యాక చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అసలే మెగా ఫ్యాన్స్ రీమేక్ అనే పదం వినపడితే చాలు కస్సుమంటున్నారు. 

This post was last modified on September 4, 2023 12:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

3 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

6 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

7 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago