స్వతహాగా తెలుగువాడు అయినప్పటికీ.. తమిళంలో హీరోగా మంచి పేరు సంపాదించి స్టార్గా ఎదిగాడు విశాల్. యాక్షన్ సినిమాలతో అతడికి మాస్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ‘అభిమన్యుడు’ లాంటి సినిమాలు పెద్ద స్టార్ల చిత్రాలకు దీటుగా వసూళ్లు రాబట్టాయి తమిళనాడులో. ఐతే కొన్నేళ్లుగా విశాల్కు సరైన సక్సెస్ లేదు. ప్రస్తుతం అతను హీరోగా ‘మార్క్ ఆంటోనీ’ అనే సినిమా చేస్తున్నాడు.
చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ పీరియడ్ ఫిలిం వచ్చే నెలలో వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. ఐతే ఈ సినిమా కోసం విశాల్ ఒక మంచి ఛాన్స్ మిస్సయ్యాడట. ప్రస్తుతం తమిళంలో టాప్ స్టార్లలో ఒకడైన విజయ్కి అతను విలన్గా నటించాల్సిందట. కానీ డేట్ల సమస్య కారణంగా ఆ సినిమా చేయలేకపోయినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో విశాల్ వెల్లడించాడు.
‘లియో’లో సీనియర్ నటుడు అర్జున్ హరాల్డ్ దాస్ అనే నెగెటివ్ రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించిన టీజర్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. నిజానికి ఈ పాత్రను విశాల్ చేయాల్సిందట. అతణ్ని దృష్టిలో ఉంచుకునే దాన్ని డిజైన్ చేశాడట. కానీ ‘మార్క్ ఆంటోనీ’కి అప్పటికే డేట్లు కేటాయించడం వల్ల విశాల్ ఈ సినిమా చేయలేనని చెప్పాడట.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన పరిస్థితి అర్థం చేసుకుని అర్జున్ను ఆ పాత్రలోకి తీసుకున్నట్లు విశాల్ తెలిపాడు. విశాల్ లాంటి మాచో హీరో.. విజయ్ ముందు విలన్గా నిలబడితే.. వీళ్లిద్దరి మధ్య క్లాష్ వస్తే ఆ కిక్కే వేరుగా ఉండేది. విశాల్ ఇప్పటిదాకా విలన్ పాత్ర చేసింది లేదు. అందువల్ల అతడి కెరీర్లోనూ ఇదొక వైవిధ్యమైన పాత్రగా ఉండేది. ‘లియో’లో సంజయ్ దత్ ప్రధాన విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి హైపే ఉంది.
This post was last modified on September 2, 2023 7:26 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…