ప్రిమియర్లతోనే హాఫ్ మిలియన్.. వన్ మిలియన్ అంటూ స్టార్ హీరోల సినిమాల యుఎస్ కలెక్షన్ల గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అభిమానులు. కానీ విడుదలకు నెల రోజుల సమయం ఉండగానే ప్రి సేల్స్తో హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేయడం మాత్రం అందరు హీరోలకూ సాధ్యం కాదు. బాక్సాఫీస్ ‘డైనోసర్’ ప్రభాస్కు ఈ ఘనత సొంతమైంది.
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లు అయినప్పటికీ.. తన కొత్త చిత్రం ‘సలార్’కు హైప్ మామూలుగా లేదు. ప్రభాస్ కటౌట్కు తగ్గ మాస్ మూవీ కావడం, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన చిత్రం కావడంతో ‘సలార్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు 28న రిలీజ్ అనుకుని 40 రోజుల ముందు టికెట్ల అమ్మకాలు మొదలుపెడితే పది రోజులు తిరిగేసరికే సినిమా హాఫ్ మిలియన్ మార్కును దాటేసింది.
పక్కా ప్లానింగ్తో ‘సలార్’ యుఎస్ ప్రిమియర్స్ సేల్స్ మొదలుపెట్టగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎంతో ఎగ్జైట్ అవుతూ టికెట్లు కొన్నారు. కానీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ సినిమాను వాయిదా వేసేసింది చిత్ర బృందం. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. సలార్ 28న రాదని డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం వెళ్లిపోయింది. యుఎస్లో సైతం టికెట్ల అమ్మకాలు ఆగిపోయాయి.
షోలన్నీ తొలగించారు. రీఫండ్స్ కూడా మొదలవుతున్నాయి. సర్వీస్ ఛార్జీలు మినహాయించుకుని మిగతా డబ్బులు వెనక్కి ఇస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ అదృష్టం కొద్దీ ఇంకా ప్రమోషన్ల మీద ఏమీ ఖర్చు పెట్టకపోవడం వల్ల వాళ్లకొచ్చిన నష్టమేమీ లేదు. ప్రి సేల్స్ ఊపు చూస్తే ప్రిమియర్లతోనే ‘సలార్’ 2 మిలియన్ మార్కును టచ్ చేసేలా కనిపించింది. కానీ ఈ ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. ఇక ‘సలార్’ కోసం ఆల్టర్నేట్ డేట్స్ చూస్తోంది టీం. సంక్రాంతి డేట్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 2, 2023 5:03 pm
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…