ఈ మధ్యే నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా డిజిటల్లో రిలీజైంది ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా. ఆ చిత్రానికి మంచి రివ్యూలే వచ్చాయి. ప్రేక్షకుల స్పందన కూడా బాగుంది. పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్ర శాటిలైట్ హక్కులను ఈటీవీ వాళ్లు కొనుక్కున్నారు. ఆ డీల్ రూ.2.5 కోట్లని తెలుస్తోంది. అది సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తం అంటున్నారు.
కొత్త సినిమాల శాటిలైట్ హక్కులను ఈటీవీ కొనడం తక్కువ. ఇదేదో చిన్న సినిమా కావడంతో తమకు రీజనబుల్ అనిపించిన ప్రైస్ పెట్టి సినిమా కొన్నారు. త్వరలోనే ఈటీవీలో ప్రిమియర్ వేయాలనుకుంటున్నారు. కాగా హైదరాబాద్లోని ఓ కేబుల్ ఛానెల్ ఈ సినిమాను నేరుగా తమ ఛానెల్లో వేసేసింది. ఈ విషయం ఈటీవీ వాళ్ల దృష్టికి వెళ్లి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలంటూ నోటీసు పంపడం గమనార్హం.
కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్ హక్కులు కొంటే.. తెలుగు సినిమాలకు ఎంతో రీచ్ ఉన్న హైదరాబాద్లో కేబుల్ టీవీలో సినిమా వేసేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఈ వ్యవహారం సీరియస్ అయి.. ఆ కేబుల్ టీవీ యజమాని ఈటీవీ వాళ్లను శరణుజొచ్చారట. ఆ కేబుల్ టీవీలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ప్రసారం అవుతోందని ఈటీవీ వాళ్లను అలెర్ట్ చేసిన వ్యక్తి.. లైన్లోకి వచ్చి ఈటీవీ వాళ్లకు నచ్చజెప్పారట.
చివరికి ఒక వార్నింగ్తో ఈటీవీ వాళ్లు సరిపెట్టి.. లీగల్ నోటీసులు వెనక్కి తీసుకున్నారట. ఈ విషయం మిగతా టాప్ తెలుగు ఛానెళ్లకు కూడా తెలిసిందని.. కేబుల్ ఛానెళ్లకు ఈ వ్యవహారం ఒక హెచ్చరిక అవుతుందని.. ఇంకోసారి ఏ ఛానెల్ అయినా ఇలా చేస్తే అంత తేలిగ్గా వదలొద్దని ఉమ్మడిగా నిర్ణయించుకున్నాయని సమాచారం. సత్యదేవ్ హీరోగా ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ను బాహుబలి నిర్మాతలు ప్రొడ్యూస్ చేశారు.
This post was last modified on August 21, 2020 12:10 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…