మూడేళ్ళ క్రితం స్కామ్ 1992 వెబ్ సిరీస్ తో స్టాక్ మార్కెట్ మోసగాడిగా పేరు తెచ్చుకున్న హర్షద్ మెహతా జీవితాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు హన్సల్ మెహతా. అంతర్జాతీయ స్థాయిలో దానికి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తనే నిర్మాతగా మారి తుషార్ హీరానందని డైరెక్షన్ లో స్కామ్ 2003 తీసుకొచ్చారు. ఇరవై ఏళ్ళ క్రితం దేశాన్ని ఊపేసిన స్టాంప్ పేపర్ల కుంభకోణం సూత్రధారి తెల్జి జీవితంలోని పలు కీలక అంశాలును, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. మొన్నటి నుంచే ఇది స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఇంతకీ సిరీస్ ఎలా ఉంది.
డిగ్రీ చదివినా ఉద్యోగం లేని అబ్దుల్ కరీం తెల్గి (గగన్ దేవ్ రియార్) ఉపాధి కోసం రైల్లో పండ్లు అమ్ముతూ ఉంటాడు. ఇతనిది కర్ణాటకలోని ఖానాపూర్ ఊరు. వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఇతని నైపుణ్యాన్ని చూసిన షౌకత్ ఖాన్ ముంబై రమ్మని కోరతాడు. కష్టాలు గట్టెక్కడం కోసం అక్కడికి వెళ్తాడు తెల్గి. నగరంలో ఏమి తెలియని ఇతను అతి తక్కువ కాలంలో వేల కోట్ల విలువ చేసే స్టాంపుల స్కామ్ ఎలా చేశాడు, వ్యవస్థకు దొరక్కుండా అన్నేళ్లు ఎలా తప్పించుకున్నాడనేదే అసలు స్టోరీ. 1982 నేపథ్యంతో మొదలుపెట్టి 2023 దాకా కథ నడిచేలా స్క్రిప్ట్ రాసుకున్నాడు తుషార్.
మొత్తం అయిదు ఎపిసోడ్లను చెరి 50 నిమిషాల పాటు అందించారు. ఒక సామాన్యుడు ఎక్కడో నాస్తిక్ లో ప్రింటయ్యే స్టాంప్ పేపర్ల రవాణాను పసిగట్టడం, నకిలీ వాటిని చెలామణిలోకి తీసుకురావడానికి అవినీతి ప్రభుత్వ వ్యవస్థను, రాజకీయ నాయకులను వాడుకున్న క్రమం చాలా నీట్ గా చూపించాడు తుషార్. నిడివిలో ల్యాగ్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగానే సాగింది. అయితే సీజన్ 1లో కేవలం ప్లాట్ ఎస్టాబ్లిషమెంట్ మాత్రమే చేశారు. 2000 సంవత్సరం తర్వాత తెల్గి చేసిన మోసాలు, ఎలా దొరికాడు, ఎందుకు ఆసుపత్రి పాలయ్యాడు, దుబాయ్ లో చేసిందేంటి లాంటి ప్రశ్నలకు సమాధానాలు సీజన్ 2 కోసం దాచి పెట్టారు. సో తెల్గి లైఫ్ ని పూర్తిగా చూపించలేదు. స్కామ్ 92 అంత గొప్పగా లేకపోయినా ఈ 2003 మంచి ప్రయత్నంగా నిలిచింది.
This post was last modified on September 2, 2023 7:28 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…