మూడేళ్ళ క్రితం స్కామ్ 1992 వెబ్ సిరీస్ తో స్టాక్ మార్కెట్ మోసగాడిగా పేరు తెచ్చుకున్న హర్షద్ మెహతా జీవితాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు హన్సల్ మెహతా. అంతర్జాతీయ స్థాయిలో దానికి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తనే నిర్మాతగా మారి తుషార్ హీరానందని డైరెక్షన్ లో స్కామ్ 2003 తీసుకొచ్చారు. ఇరవై ఏళ్ళ క్రితం దేశాన్ని ఊపేసిన స్టాంప్ పేపర్ల కుంభకోణం సూత్రధారి తెల్జి జీవితంలోని పలు కీలక అంశాలును, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. మొన్నటి నుంచే ఇది స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఇంతకీ సిరీస్ ఎలా ఉంది.
డిగ్రీ చదివినా ఉద్యోగం లేని అబ్దుల్ కరీం తెల్గి (గగన్ దేవ్ రియార్) ఉపాధి కోసం రైల్లో పండ్లు అమ్ముతూ ఉంటాడు. ఇతనిది కర్ణాటకలోని ఖానాపూర్ ఊరు. వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఇతని నైపుణ్యాన్ని చూసిన షౌకత్ ఖాన్ ముంబై రమ్మని కోరతాడు. కష్టాలు గట్టెక్కడం కోసం అక్కడికి వెళ్తాడు తెల్గి. నగరంలో ఏమి తెలియని ఇతను అతి తక్కువ కాలంలో వేల కోట్ల విలువ చేసే స్టాంపుల స్కామ్ ఎలా చేశాడు, వ్యవస్థకు దొరక్కుండా అన్నేళ్లు ఎలా తప్పించుకున్నాడనేదే అసలు స్టోరీ. 1982 నేపథ్యంతో మొదలుపెట్టి 2023 దాకా కథ నడిచేలా స్క్రిప్ట్ రాసుకున్నాడు తుషార్.
మొత్తం అయిదు ఎపిసోడ్లను చెరి 50 నిమిషాల పాటు అందించారు. ఒక సామాన్యుడు ఎక్కడో నాస్తిక్ లో ప్రింటయ్యే స్టాంప్ పేపర్ల రవాణాను పసిగట్టడం, నకిలీ వాటిని చెలామణిలోకి తీసుకురావడానికి అవినీతి ప్రభుత్వ వ్యవస్థను, రాజకీయ నాయకులను వాడుకున్న క్రమం చాలా నీట్ గా చూపించాడు తుషార్. నిడివిలో ల్యాగ్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగానే సాగింది. అయితే సీజన్ 1లో కేవలం ప్లాట్ ఎస్టాబ్లిషమెంట్ మాత్రమే చేశారు. 2000 సంవత్సరం తర్వాత తెల్గి చేసిన మోసాలు, ఎలా దొరికాడు, ఎందుకు ఆసుపత్రి పాలయ్యాడు, దుబాయ్ లో చేసిందేంటి లాంటి ప్రశ్నలకు సమాధానాలు సీజన్ 2 కోసం దాచి పెట్టారు. సో తెల్గి లైఫ్ ని పూర్తిగా చూపించలేదు. స్కామ్ 92 అంత గొప్పగా లేకపోయినా ఈ 2003 మంచి ప్రయత్నంగా నిలిచింది.
This post was last modified on September 2, 2023 7:28 pm
మే నెల వచ్చేసింది. ఇంతకు ముందు చెప్పిన ప్రకారం తొమ్మిదో తేదీ రావాల్సిన హరిహర వీరమల్లు నిర్మాణ సంస్థ చెప్పకుండానే…
గత ముప్పై రోజులకు పైగా డ్రై పీరియడ్ నరకం చవి చూసిన థియేటర్లకు మళ్ళీ కళ వచ్చేసింది. నాని హిట్…
అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లుగా దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వానికి పంటి కింద రాళ్ల మాదిరిగా విపత్తులు-వివాదాలు ముసురుకుంటున్నాయి. పది మాసాల పాలనలో…
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు చనిపోయిన ఘటన ఏపీలో పెను కలకలం రేపింది.…
'ది రాజా సాబ్' టీజర్ సిద్ధంగా ఉంది, డబ్బింగ్ చెప్పేస్తే అయిపోతుందని ఒక వార్త. 'ఫౌజీ' త్వరగా పూర్తయ్యే సూచనలున్నాయి…
ఇటీవలే విడుదలైన సింగిల్ టీజర్ లో ప్రస్తుత ట్రెండ్ ని అనుసరిస్తూ శ్రీవిష్ణు చేసిన కొన్ని అనుకరణలు వివాదానికి దారి…