తమిళంలో విలక్షణ కథలతో ప్రయాణం చేసే స్టార్ డైరెక్టర్లలో వెంకట్ ప్రభు ఒకడు. ఇళయరాజా తమ్ముడు, సంగీత దర్శకుడు గంగై అమరన్ తనయుడైన వెంకట్.. దర్శకుడిగా తొలి చిత్రం ‘చెన్నై 28’తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిందా చిత్రం. ఆ తర్వాత సరోజ, గోవా, మన్కాతా, మాస్ లాంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు వెంకట్.
ఇలాంటి మంచి ట్రాక్ రికార్డున్న దర్శకుడు.. మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో జట్టు కట్టి తెలుగు, తమిళ భాషల్లో ‘కస్టడీ’ అనే సినిమా తీశాడు. వెంకట్ ప్రభు లాంటి దర్శకుడితో పని చేయడం చైతూ అదృష్టం అనుకున్నారు చాలామంది. కానీ ఆ సినిమా చైతూకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అసలే ఒడుదొడుకుల్లో ఉన్న చైతూ కెరీర్ను ఇంకా కిందికి లాగేసిందీ చిత్రం. తమిళంలో కూడా ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపలేదు.
‘కస్టడీ’ సినిమాలో వెంకట్ ప్రభు మార్కే కనిపించకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరిచింది. ఐతే ఇలాంటి డిజాస్టర్ ఇచ్చాక విజయ్ లాంటి సూపర్ స్టార్తో వెంకట్ జట్టు కట్టబోతున్నట్లుగా ప్రచారం జరిగినపుడు చాలామందికి ఆశ్చర్యం కలిగింది. నిజంగా వెంకట్ను నమ్మి విజయ్ ఈ అవకాశం ఇస్తాడా అనుకున్నారు. కానీ ఆ ప్రచారమే నిజమైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలోనే విజయ్ తన 68వ సినిమాను చేయబోతున్నాడు.
ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. భవిష్యత్తులోకి స్వాగతం అన్న క్యాప్షన్తో ఒక వెరైటీ పోస్టర్ ద్వారా సినిమాను అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే ఇది వెంకట్ ప్రభు మార్కు వెరైటీ సినిమా అనే విషయం అర్థమవుతోంది. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ చేసే చివరి సినిమా ఇదే అని.. అందుకే ఇందులో రాజకీయ అంశాలు కూడా ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మరి ఆ ప్రచారం ఎంత వరకు నిజమో కానీ.. ఈ సినిమా అనౌన్స్మెంట్తోనే మంచి హైప్ తెచ్చుకుందన్నది మాత్రం వాస్తవం.
This post was last modified on September 1, 2023 10:51 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…