తమిళంలో విలక్షణ కథలతో ప్రయాణం చేసే స్టార్ డైరెక్టర్లలో వెంకట్ ప్రభు ఒకడు. ఇళయరాజా తమ్ముడు, సంగీత దర్శకుడు గంగై అమరన్ తనయుడైన వెంకట్.. దర్శకుడిగా తొలి చిత్రం ‘చెన్నై 28’తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిందా చిత్రం. ఆ తర్వాత సరోజ, గోవా, మన్కాతా, మాస్ లాంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు వెంకట్.
ఇలాంటి మంచి ట్రాక్ రికార్డున్న దర్శకుడు.. మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో జట్టు కట్టి తెలుగు, తమిళ భాషల్లో ‘కస్టడీ’ అనే సినిమా తీశాడు. వెంకట్ ప్రభు లాంటి దర్శకుడితో పని చేయడం చైతూ అదృష్టం అనుకున్నారు చాలామంది. కానీ ఆ సినిమా చైతూకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అసలే ఒడుదొడుకుల్లో ఉన్న చైతూ కెరీర్ను ఇంకా కిందికి లాగేసిందీ చిత్రం. తమిళంలో కూడా ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపలేదు.
‘కస్టడీ’ సినిమాలో వెంకట్ ప్రభు మార్కే కనిపించకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరిచింది. ఐతే ఇలాంటి డిజాస్టర్ ఇచ్చాక విజయ్ లాంటి సూపర్ స్టార్తో వెంకట్ జట్టు కట్టబోతున్నట్లుగా ప్రచారం జరిగినపుడు చాలామందికి ఆశ్చర్యం కలిగింది. నిజంగా వెంకట్ను నమ్మి విజయ్ ఈ అవకాశం ఇస్తాడా అనుకున్నారు. కానీ ఆ ప్రచారమే నిజమైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలోనే విజయ్ తన 68వ సినిమాను చేయబోతున్నాడు.
ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. భవిష్యత్తులోకి స్వాగతం అన్న క్యాప్షన్తో ఒక వెరైటీ పోస్టర్ ద్వారా సినిమాను అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే ఇది వెంకట్ ప్రభు మార్కు వెరైటీ సినిమా అనే విషయం అర్థమవుతోంది. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ చేసే చివరి సినిమా ఇదే అని.. అందుకే ఇందులో రాజకీయ అంశాలు కూడా ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మరి ఆ ప్రచారం ఎంత వరకు నిజమో కానీ.. ఈ సినిమా అనౌన్స్మెంట్తోనే మంచి హైప్ తెచ్చుకుందన్నది మాత్రం వాస్తవం.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…