ఎమోషనల్ అండ్ సెన్సిబుల్ సినిమాలు తీస్తాడని పేరున్న దర్శకుడు శేఖర్ కమ్ముల తన కెరీర్ లో మొదటిసారి భారీ బడ్జెట్ తో ఒక మల్టీస్టారర్ తీయడం గత ఏడాది నుంచే మూవీ లవర్స్ కి హాట్ టాపిక్ గా ఉంది. అయితే షూటింగ్ ప్రారంభం కావడంలో మాత్రం బాగా జాప్యం జరిగింది. ఈ ఆలస్యానికి కారణం కీలకమైన కింగ్ మేకర్ లాంటి క్యారెక్టర్ కి నాగార్జున అంగీకారం కోసం వెయిట్ చేయడం వల్లేనట. తొలుత కథ విన్న నాగ్ కు అది బాగా నచ్చినప్పటికీ ఫుల్ వెర్షన్ ని పలుమార్లు విన్న తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీనికి మించిన మరో స్ట్రాంగ్ రీజన్ కూడా ఉందట.
నాగచైతన్యకు లవ్ స్టోరీ రూపంలో పెద్ద హిట్టు ఇచ్చిన శేఖర్ కమ్ముల మీద నాగార్జునకు మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. పైగా ఇప్పుడు ధనుష్ మూవీ తీస్తున్న ఏషియన్ సంస్థ అధినేత సునీల్ నారంగ్ కుటుంబంతో ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో నో చెప్పడానికి ఛాన్స్ లేకపోయింది. పైగా తమిళంలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది కాబట్టి రక్షకుడు తర్వాత మళ్ళీ అరవ ప్రేక్షకులను మరోసారి పలకరించవచ్చనే ఆలోచన కలిగి ఉండొచ్చు. అయితే నాసామి రంగా చర్చల్లో చాలా సమయం ఖర్చు పెట్టాల్సి రావడంతో ధనుష్ సినిమాలో తానున్న విషయాన్ని లేట్ గా అనౌన్స్ చేయించారు.
ఏది ఏమైనా ఒక క్రేజీ కాంబోకి శ్రీకారం చుట్టిన మాట వాస్తవం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ పీరియాడిక్ డ్రాప్ లో ఉంటుందని తెలిసింది. నలభై ఏళ్ళ క్రితం దేశాన్ని ఊపేసిన ఒక సంఘటన ఆధారంగా పలు రాజకీయ నాయకులు,, మాఫియా డాన్ల చుట్టూ చాలా ఇంటెన్స్ డ్రామాని డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. లవ్ స్టోరీ తర్వాత చాలా గ్యాప్ వచ్చినా పర్ఫెక్షన్ రావాలని ఈ స్క్రిప్ట్ మీద నెలల తరబడి వర్క్ చేసిన శేఖర్ కమ్ముల ఫైనల్ గా బెస్ట్ ఇస్తారని అంటున్నారు. నా సామిరంగా సంక్రాంతికి వస్తే నాగ్ ధనుష్ ల సినిమా దసరా రిలీజ్ కు ప్లాన్ చేస్తారట.
This post was last modified on August 29, 2023 4:23 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…