ఎమోషనల్ అండ్ సెన్సిబుల్ సినిమాలు తీస్తాడని పేరున్న దర్శకుడు శేఖర్ కమ్ముల తన కెరీర్ లో మొదటిసారి భారీ బడ్జెట్ తో ఒక మల్టీస్టారర్ తీయడం గత ఏడాది నుంచే మూవీ లవర్స్ కి హాట్ టాపిక్ గా ఉంది. అయితే షూటింగ్ ప్రారంభం కావడంలో మాత్రం బాగా జాప్యం జరిగింది. ఈ ఆలస్యానికి కారణం కీలకమైన కింగ్ మేకర్ లాంటి క్యారెక్టర్ కి నాగార్జున అంగీకారం కోసం వెయిట్ చేయడం వల్లేనట. తొలుత కథ విన్న నాగ్ కు అది బాగా నచ్చినప్పటికీ ఫుల్ వెర్షన్ ని పలుమార్లు విన్న తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీనికి మించిన మరో స్ట్రాంగ్ రీజన్ కూడా ఉందట.
నాగచైతన్యకు లవ్ స్టోరీ రూపంలో పెద్ద హిట్టు ఇచ్చిన శేఖర్ కమ్ముల మీద నాగార్జునకు మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. పైగా ఇప్పుడు ధనుష్ మూవీ తీస్తున్న ఏషియన్ సంస్థ అధినేత సునీల్ నారంగ్ కుటుంబంతో ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో నో చెప్పడానికి ఛాన్స్ లేకపోయింది. పైగా తమిళంలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది కాబట్టి రక్షకుడు తర్వాత మళ్ళీ అరవ ప్రేక్షకులను మరోసారి పలకరించవచ్చనే ఆలోచన కలిగి ఉండొచ్చు. అయితే నాసామి రంగా చర్చల్లో చాలా సమయం ఖర్చు పెట్టాల్సి రావడంతో ధనుష్ సినిమాలో తానున్న విషయాన్ని లేట్ గా అనౌన్స్ చేయించారు.
ఏది ఏమైనా ఒక క్రేజీ కాంబోకి శ్రీకారం చుట్టిన మాట వాస్తవం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ పీరియాడిక్ డ్రాప్ లో ఉంటుందని తెలిసింది. నలభై ఏళ్ళ క్రితం దేశాన్ని ఊపేసిన ఒక సంఘటన ఆధారంగా పలు రాజకీయ నాయకులు,, మాఫియా డాన్ల చుట్టూ చాలా ఇంటెన్స్ డ్రామాని డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. లవ్ స్టోరీ తర్వాత చాలా గ్యాప్ వచ్చినా పర్ఫెక్షన్ రావాలని ఈ స్క్రిప్ట్ మీద నెలల తరబడి వర్క్ చేసిన శేఖర్ కమ్ముల ఫైనల్ గా బెస్ట్ ఇస్తారని అంటున్నారు. నా సామిరంగా సంక్రాంతికి వస్తే నాగ్ ధనుష్ ల సినిమా దసరా రిలీజ్ కు ప్లాన్ చేస్తారట.
This post was last modified on August 29, 2023 4:23 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…