ఏదైనా క్రేజ్ ఉన్న పెద్ద సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వీలైనంత త్వరగా మొదలుపెడితే ఎక్కువ థియేటర్లు నిండేందుకు ఆస్కారం ఉంటుంది. అప్పటిదాకా ఉన్న బజ్ ని ఆధారంగా చేసుకుని మొదటిరోజే చూద్దామని డిసైడయ్యే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అలాంటిది విజయ్ దేవరకొండ ఖుషికి సంబంధించి ఇప్పటిదాకా ఆన్ లైన్ బుకింగ్స్ షురూ కాలేదు. ఆగస్ట్ 30 ఉదయం పది గంటల నుంచి మొదలుపెడతామని అఫీషియల్ గా ప్రకటించారు. అంటే ఫస్ట్ షో షో పడే సమయానికి సరిగ్గా ఓ నలభై అయిదు గంటల ముందన్న మాట. ఇది చాలా లేట్ కిందే లెక్క.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇంత నెమ్మదితనం సేఫ్ కాదు. అయితే ఖుషి నిర్మించిన మైత్రి మూవీ మేకర్సే దీన్ని స్వంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో నైజామ్ ప్రాంతంలో ఉన్న ఎగ్జిబిటర్ల నుంచి పంపకాలకు సంబంధించిన ఒప్పందాలు ఆలస్యం కావడం వల్లే థియేటర్ల లిస్టు ఇంకా పూర్తి స్థాయిలో ఫైనల్ కాలేదని ట్రేడ్ టాక్. ఎన్ని చర్చలు జరుగుతున్నా త్వరగా కొలిక్కి రాకపోవడంతో ఆన్ లైన్ అమ్మకాలు వేగంగా మొదలుపెట్టలేదని తెలిసింది. సెప్టెంబర్ 7న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, షారుఖ్ ఖాన్ జవాన్ లు వస్తున్న నేపథ్యంలో ఖుషికి ఎన్ని రోజులు అగ్రిమెంట్ చేసుకోవాలనే సందిగ్ధం ఉందట.
ఇవన్నీ సర్దుకుంటాయి కానీ ఖుషి మీదున్న పాజిటివ్ బజ్ భారీ ఓపెనింగ్స్ గా మారాలంటే టాక్ చాలా కీలకం కానుంది. జైలర్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఊపిచ్చే సక్సెస్ ఏదీ రాలేదు. బెదురులంక 2012 పర్వాలేదనిపించినా ఆ కాసింత దూకుడు ఆదివారం వరకే పరిమితమయ్యింది. అందుకే ఇప్పుడు మళ్ళీ థియేటర్లు కళకళలాడాలంటే ఖుషి బ్లాక్ బస్టరని పబ్లిక్ తో అనిపించాలి. విజయ్ దేవరకొండ – సమంతా – శివ నిర్వాణల కాంబినేషన్ తో పాటు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ బజ్ తీసుకొచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడమే కావాల్సింది. చూద్దాం.
This post was last modified on August 29, 2023 12:21 pm
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…