ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా సక్సెస్ అందని ద్రాక్షగా నిలిచిపోయిన కుర్ర హీరో రాజ్ తరుణ్ ఈసారి తిరగబడరా సామీగా వస్తున్నాడు. అప్పుడెప్పుడో గోపీచంద్ కి యజ్ఞం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక కొన్ని ఫ్లాపులతో గ్యాప్ తీసుకున్న ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. సురక్ష ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ మీద చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ కనిపిస్తోంది. పెద్దగా హడావిడి లేకుండా దీని టీజర్ ని సైలెంట్ గా రిలీజ్ చేశారు. విడుదల తేదీ ఇంకా ఖరారు చేయనప్పటికీ సెప్టెంబర్ లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిమిషంన్నర వీడియోలో కథకు సంబంధించిన క్లూస్ ఇచ్చారు.
ఎవరైనా చిన్న పిల్లలు తప్పిపోతే వాళ్ళను తల్లితండ్రుల దగ్గరికి చేర్చడంలో అంతు లేని సంతోషాన్ని పొందటం ఆ యువకుడి(రాజ్ తరుణ్) నిత్యకృత్యం. అతను విపరీత భయస్తుడు. ప్రాణాలంటే మహా ప్రీతీ. బాలయ్య బెనిఫిట్ షో టికెట్ల కోసం హత్య చేసినా పర్వాలేదనే డేరింగ్ అమ్మాయి (మల్వి మల్హోత్రా)ని ప్రేమిస్తాడు. గంజాయి వనం లాంటి ముఠాని నడిపిస్తున్న ఓ లోకల్ డాన్(మకరంద్ దేశ్ పాండే) మన హీరోకి ఓ ప్రమాదరకమైన పని అప్పజెబుతాడు. అసలు వీళ్లిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, ఆయుధం చూస్తే వణికిపోయే కుర్రాడు కత్తులు పట్టుకుని ఊచకోత ఎందుకు చేశాడనేదే కథ.
లైన్ పరంగా ఆసక్తికరంగానే ఉంది. జై బాలయ్య నినాదంతో పాటు అఖండ రెఫరెన్సులు బాగా వాడేశారు. జెబి – భోలే శవాలి సంయుక్తంగా సంగీతం అందించగా జవహర్ రెడ్డి ఛాయాగ్రాణం సమకూర్చారు. కాన్సెప్ట్ అయితే ఆసక్తికరంగా ఉంది. చలాకిగా కనిపించే రాజ్ తరుణ్ ఇందులో పిరికివాడిగా చూపించడం వెరైటీగా ఉంది. సరదాగా టైం పాస్ చేయించినా చాలు థియేటర్లకు వస్తామంటున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే తిరగబడరా స్వామి ఉంటే వర్కౌట్ అవుతుంది. అంచనాలు నిలబెట్టుకునే రాజ్ తరుణ్ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత హిట్టు పడ్డట్టే. రిలీజ్ డేట్ ని త్వరలో ఫిక్స్ చేయబోతున్నారు.
This post was last modified on August 28, 2023 10:58 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…