‘గంగోత్రి’ సినిమాలో అల్లు అర్జున్ను చూసిన వాళ్లకు.. అతను ఒక హీరోగా ఇప్పుడున్న స్థాయికి ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన బన్నీ.. తాజాగా ‘పుష్ప’ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకుని తెలుగు సినీ పరిశ్రమకే గర్వ కారణంగా నిలిచాడు. ఇప్పుడీ స్థాయిని అందుకున్న కెరీర్ ఆరంభంలో పడ్డ ఇబ్బందుల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకు కూడా అవమానాలు తప్పలేదని వెల్లడించాడు. ‘గంగోత్రి’ సినిమాకు ముందు, తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బన్నీ మాటల్లోనే తెలుసుకుందాం.
‘‘నా అరంగేట్రం అంత సాఫీగా ఏమీ జరగలేదు. నా చదువు పూర్తయిన తర్వాత ఒక పెద్ద బేనర్లో నాకు ఆఫర్ వచ్చింది. కానీ తర్వాత నేను బాలేనని రిజెక్ట్ చేశారు. అప్పుడు నాన్న, చిరంజీవి గారు చాలా బాధ పడ్డారు. నన్ను పెట్టి సొంతంగా సినిమా తీయాలనుకున్నారు. ఆ సమయంలో రాఘవేంద్రరావు గారి నుంచి ‘గంగోత్రి’ ప్రపోజల్ వచ్చింది. నాన్న, అశ్వినీదత్ గారు, చిన్నికృష్ణ గారు.. ఇలా అందరూ కలిసి ఆ ప్రాజెక్ట్ సెట్ చేశారు. అదే.. గంగోత్రి. ఆ సినిమా పెద్ద హిట్టయింది.
కానీ నటుడిగా నేను ఫెయిలయ్యాను. ఆ సినిమా సమయానికి ఒక నటుడిగా నేను సిద్ధంగా లేను. చిన్నప్పట్నుంచి నేను ఫెయిల్యూరే, మళ్లీ ఫెయిల్యూరా.. అనుకున్నాను. నాన్న కూడా వెంటనే నన్ను పెట్టి సినిమా తీయలేని పరిస్థితి. ఆ సమయంలో సినిమా తీయడం అంత సులువు కాదు. ఐతే నాకు నటన వచ్చని నమ్మేవాడిని. ఆ సమయంలోనే దిల్ రాజు గారు వచ్చి ‘కొత్త వాళ్లతో ఆర్య సినిమా తీస్తున్నాం’ అని చెప్పారు. ఆ సినిమా చేశాక నేను వెనుదిరిగి చూసుకోలేదు. ముళ్లబాటలో ఉన్న వాడిని రోడ్డు మీదికి వచ్చా’’ అని బన్నీ గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on August 27, 2023 11:08 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…