తెలుగు సినిమా చరిత్రలోల్ మొదటిసారి జాతీయ నటుడిగా అవార్డు సాధించాక అల్లు అర్జున్ ఆనందం గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అదే విధంగా తనకు ఈ పురస్కారం దక్కడం పట్ల బయట ఏమనుకుంటున్నారు, ఎలా టార్గెట్ చేయాలనుకుంటున్నారు తదితర విషయాలన్నీ గమనిస్తున్నట్టుగా ఇంటర్వ్యూలలో చెబుతున్న మాటలను బట్టి అర్థమవుతోంది. తానేమీ అందరి కంటే గొప్పవాడిని కానని, గతంలో ఎందరికో అర్హత ఉన్నా కేవలం టైం, పోటీ లాంటి కారణాల వల్ల మిస్ అయ్యుండొచ్చని, అంతే తప్ప బెస్ట్ యాక్టరనేది తన తలకు ఎక్కడం లేదని సవినయంగా చెప్పుకున్నాడు.
మొన్న రామ్ చరణ్ పెట్టిన విషెస్ ట్వీట్ కు బదులుగా సింపుల్ గా థాంక్ యు అంటూ బన్నీ స్పందించడం మీద ట్విట్టర్ లో పెద్ద రచ్చే జరిగింది. ఇద్దరూ మొక్కుబడిగా మెసేజులు పెట్టారనే ప్రచారం స్టార్టయ్యింది. కేవలం గంటల వ్యవధిలో చరణ్, ఉపాసనలు పంపించిన ఒక స్పెషల్ బొకే, గ్రీటింగ్ కార్డు ఫోటోని ఇన్స్ టాలో పోస్ట్ చేసి ఇది తనకు చాలా స్పెషలని చెప్పడం వెనుక అర్థం వస్తున్న పుకార్లకు చెక్ పెట్టడమే. అంతే కాదు చిరంజీవిని కలుసుకుని ఆనందాన్ని పంచుకోవడం, బ్రహ్మానందం ఇంటికి వెళ్లి గంటన్నర పైగా గడిపి రావడం ఇవన్నీ పరిణితి చూపించే పనులే.
తానంటే ఇష్టం లేని వాళ్ళు కూడా జాతీయ అవార్డు వచ్చినందుకు సంతోషపడుతున్నారని చెప్పిన బన్నీ ఫోకస్ మొత్తం పుష్ప 2 ఉండబోతోంది. ఒక్కసారిగా అంచనాలు మరింత పెరిగిపోవడంతో సుకుమార్, బన్నీ, దేవిశ్రీ ప్రసాద్ లు ముగ్గురికి కొత్త సవాళ్లు మొదలయ్యాయి. బాలీవుడ్ నుంచి పెద్దగా ఎవరూ స్పందించకపోవడం అభిమానులు, మీడియా దృష్టిలో లేకుండా పోలేదు. పైగా యాంటీ బ్యాచులు కొన్ని జై భీమ్, సార్పట్ట పరంపరకు రాలేదంటూ శోకాలు పెట్టడం కావాలని పుష్ప బ్రాండ్ ని లక్ష్యంగా పెట్టుకోవడమే. వీటి వల్ల కించిత్ కూడా నష్టమేమీ లేదు కానీ
This post was last modified on August 27, 2023 5:15 pm
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…
మొదటిసారి విడుదలైనప్పుడు ఫ్లాప్ అనిపించుకుని ఏళ్ళు గడిచేకొద్దీ కల్ట్ ముద్రతో రీ రిలీజులు సూపర్ హిట్ కావడం ఈ మధ్య…
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాలు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి…