తెలుగు సినిమా చరిత్రలోల్ మొదటిసారి జాతీయ నటుడిగా అవార్డు సాధించాక అల్లు అర్జున్ ఆనందం గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అదే విధంగా తనకు ఈ పురస్కారం దక్కడం పట్ల బయట ఏమనుకుంటున్నారు, ఎలా టార్గెట్ చేయాలనుకుంటున్నారు తదితర విషయాలన్నీ గమనిస్తున్నట్టుగా ఇంటర్వ్యూలలో చెబుతున్న మాటలను బట్టి అర్థమవుతోంది. తానేమీ అందరి కంటే గొప్పవాడిని కానని, గతంలో ఎందరికో అర్హత ఉన్నా కేవలం టైం, పోటీ లాంటి కారణాల వల్ల మిస్ అయ్యుండొచ్చని, అంతే తప్ప బెస్ట్ యాక్టరనేది తన తలకు ఎక్కడం లేదని సవినయంగా చెప్పుకున్నాడు.
మొన్న రామ్ చరణ్ పెట్టిన విషెస్ ట్వీట్ కు బదులుగా సింపుల్ గా థాంక్ యు అంటూ బన్నీ స్పందించడం మీద ట్విట్టర్ లో పెద్ద రచ్చే జరిగింది. ఇద్దరూ మొక్కుబడిగా మెసేజులు పెట్టారనే ప్రచారం స్టార్టయ్యింది. కేవలం గంటల వ్యవధిలో చరణ్, ఉపాసనలు పంపించిన ఒక స్పెషల్ బొకే, గ్రీటింగ్ కార్డు ఫోటోని ఇన్స్ టాలో పోస్ట్ చేసి ఇది తనకు చాలా స్పెషలని చెప్పడం వెనుక అర్థం వస్తున్న పుకార్లకు చెక్ పెట్టడమే. అంతే కాదు చిరంజీవిని కలుసుకుని ఆనందాన్ని పంచుకోవడం, బ్రహ్మానందం ఇంటికి వెళ్లి గంటన్నర పైగా గడిపి రావడం ఇవన్నీ పరిణితి చూపించే పనులే.
తానంటే ఇష్టం లేని వాళ్ళు కూడా జాతీయ అవార్డు వచ్చినందుకు సంతోషపడుతున్నారని చెప్పిన బన్నీ ఫోకస్ మొత్తం పుష్ప 2 ఉండబోతోంది. ఒక్కసారిగా అంచనాలు మరింత పెరిగిపోవడంతో సుకుమార్, బన్నీ, దేవిశ్రీ ప్రసాద్ లు ముగ్గురికి కొత్త సవాళ్లు మొదలయ్యాయి. బాలీవుడ్ నుంచి పెద్దగా ఎవరూ స్పందించకపోవడం అభిమానులు, మీడియా దృష్టిలో లేకుండా పోలేదు. పైగా యాంటీ బ్యాచులు కొన్ని జై భీమ్, సార్పట్ట పరంపరకు రాలేదంటూ శోకాలు పెట్టడం కావాలని పుష్ప బ్రాండ్ ని లక్ష్యంగా పెట్టుకోవడమే. వీటి వల్ల కించిత్ కూడా నష్టమేమీ లేదు కానీ
This post was last modified on August 27, 2023 5:15 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…