నాలుగు రోజులుగా టాలీవుడ్లో చర్చలన్నీ అల్లు అర్జున్ చుట్టూనే తిరుగుతున్నాయి. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడు బన్నీనే కావడం విశేషం. అల్లు అర్జున్ కంటే ముందు ఎంతోమంది గొప్ప నటులు.. అద్భుత నటన కనబరిచిన పాత్రలు ఎన్నో ఉన్నప్పటికీ.. బన్నీకి ప్రతిభకు తోడు అదృష్టం కూడా కలిసి రావడంతో అతడిని జాతీయ పురస్కారం వరించింది.
ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐతే బన్నీ గురించి మిగతా వాళ్లంతా ఎలా స్పందించారన్నది పక్కన పెడితే అతడి బన్నీ నటుడు కావడంలో తెర వెనుక పాత్ర పోషించిన తన ముద్దుల మావయ్య చిరంజీవి, బన్నీ ఎదుగుదలలో కీలకంగా ఉన్న దర్శకుడు సుకుమార్.. అవార్డు విషయంలో బన్నీతో ఏం మాట్లాడారన్నది ఆసక్తికరం. ఈ విషయాలను బన్నీనే స్వయంగా మీడియా మీట్లో వెల్లడించాడు.
‘‘అవార్డు వచ్చాక చిరంజీవి గారిని కలిశాను. ‘ఒక నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఎందుకు ఇవ్వాలో ఒక లిస్ట్ వేస్తే.. అందులోని అన్ని బాక్సుల్లోనూ నీకు టిక్స్ పడతాయి. నువ్వు చేసిన వర్క్కి నీకు పురస్కారం రాకపోతే అతి తప్పయ్యేది’ అని చిరంజీవి గారు అన్నారు. ‘పుష్ప’లో నా గెటప్ మొదలుకుని ఎక్స్ప్రెషన్స్, నేను మాట్లాడిన యాస, కష్టమైన లొకేషన్లలో షూట్ చేయడం.. ఇలా అన్ని విషయాలనూ గుర్తు చేసి మరీ మెచ్చుకున్నారు.
ఒక కమర్షియల్ సినిమాలో ఇంత నటనను తీసుకురావడం కష్టమన్నారు. ఆ మాటలు మరింత ఆనందాన్నిచ్చాయి. ఇక అవార్డ్ వచ్చిందని తెలియగానే.. సుకుమార్ గారికే ఆ క్రెడిట్ ఇవ్వాలనిపించింది. అందుకే ఆయనతో ‘నేను వైర్ అయితే.. నువ్వు కరెంట్ డార్లింగ్’ అన్నాను. దానికాయన ‘నువ్వు వైర్ కాదు డార్లింగ్.. ఫైర్’ అన్నారు. నాకు అవార్డు రావాలని నాకంటే ఆయనే ఎక్కువ కోరుకున్నారు. ‘పుష్ప’లో నా నటనకు ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులు ఆశ్చర్యపోవాలని ఆయన ఎంతో తపించారు’’ అని బన్నీ తెలిపాడు.
This post was last modified on August 27, 2023 3:56 pm
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…