నాలుగు రోజులుగా టాలీవుడ్లో చర్చలన్నీ అల్లు అర్జున్ చుట్టూనే తిరుగుతున్నాయి. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడు బన్నీనే కావడం విశేషం. అల్లు అర్జున్ కంటే ముందు ఎంతోమంది గొప్ప నటులు.. అద్భుత నటన కనబరిచిన పాత్రలు ఎన్నో ఉన్నప్పటికీ.. బన్నీకి ప్రతిభకు తోడు అదృష్టం కూడా కలిసి రావడంతో అతడిని జాతీయ పురస్కారం వరించింది.
ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐతే బన్నీ గురించి మిగతా వాళ్లంతా ఎలా స్పందించారన్నది పక్కన పెడితే అతడి బన్నీ నటుడు కావడంలో తెర వెనుక పాత్ర పోషించిన తన ముద్దుల మావయ్య చిరంజీవి, బన్నీ ఎదుగుదలలో కీలకంగా ఉన్న దర్శకుడు సుకుమార్.. అవార్డు విషయంలో బన్నీతో ఏం మాట్లాడారన్నది ఆసక్తికరం. ఈ విషయాలను బన్నీనే స్వయంగా మీడియా మీట్లో వెల్లడించాడు.
‘‘అవార్డు వచ్చాక చిరంజీవి గారిని కలిశాను. ‘ఒక నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఎందుకు ఇవ్వాలో ఒక లిస్ట్ వేస్తే.. అందులోని అన్ని బాక్సుల్లోనూ నీకు టిక్స్ పడతాయి. నువ్వు చేసిన వర్క్కి నీకు పురస్కారం రాకపోతే అతి తప్పయ్యేది’ అని చిరంజీవి గారు అన్నారు. ‘పుష్ప’లో నా గెటప్ మొదలుకుని ఎక్స్ప్రెషన్స్, నేను మాట్లాడిన యాస, కష్టమైన లొకేషన్లలో షూట్ చేయడం.. ఇలా అన్ని విషయాలనూ గుర్తు చేసి మరీ మెచ్చుకున్నారు.
ఒక కమర్షియల్ సినిమాలో ఇంత నటనను తీసుకురావడం కష్టమన్నారు. ఆ మాటలు మరింత ఆనందాన్నిచ్చాయి. ఇక అవార్డ్ వచ్చిందని తెలియగానే.. సుకుమార్ గారికే ఆ క్రెడిట్ ఇవ్వాలనిపించింది. అందుకే ఆయనతో ‘నేను వైర్ అయితే.. నువ్వు కరెంట్ డార్లింగ్’ అన్నాను. దానికాయన ‘నువ్వు వైర్ కాదు డార్లింగ్.. ఫైర్’ అన్నారు. నాకు అవార్డు రావాలని నాకంటే ఆయనే ఎక్కువ కోరుకున్నారు. ‘పుష్ప’లో నా నటనకు ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులు ఆశ్చర్యపోవాలని ఆయన ఎంతో తపించారు’’ అని బన్నీ తెలిపాడు.
This post was last modified on August 27, 2023 3:56 pm
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్కు అనుకున్న ఆ చిత్రం…
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…
ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…