నాలుగు రోజులుగా టాలీవుడ్లో చర్చలన్నీ అల్లు అర్జున్ చుట్టూనే తిరుగుతున్నాయి. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడు బన్నీనే కావడం విశేషం. అల్లు అర్జున్ కంటే ముందు ఎంతోమంది గొప్ప నటులు.. అద్భుత నటన కనబరిచిన పాత్రలు ఎన్నో ఉన్నప్పటికీ.. బన్నీకి ప్రతిభకు తోడు అదృష్టం కూడా కలిసి రావడంతో అతడిని జాతీయ పురస్కారం వరించింది.
ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐతే బన్నీ గురించి మిగతా వాళ్లంతా ఎలా స్పందించారన్నది పక్కన పెడితే అతడి బన్నీ నటుడు కావడంలో తెర వెనుక పాత్ర పోషించిన తన ముద్దుల మావయ్య చిరంజీవి, బన్నీ ఎదుగుదలలో కీలకంగా ఉన్న దర్శకుడు సుకుమార్.. అవార్డు విషయంలో బన్నీతో ఏం మాట్లాడారన్నది ఆసక్తికరం. ఈ విషయాలను బన్నీనే స్వయంగా మీడియా మీట్లో వెల్లడించాడు.
‘‘అవార్డు వచ్చాక చిరంజీవి గారిని కలిశాను. ‘ఒక నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఎందుకు ఇవ్వాలో ఒక లిస్ట్ వేస్తే.. అందులోని అన్ని బాక్సుల్లోనూ నీకు టిక్స్ పడతాయి. నువ్వు చేసిన వర్క్కి నీకు పురస్కారం రాకపోతే అతి తప్పయ్యేది’ అని చిరంజీవి గారు అన్నారు. ‘పుష్ప’లో నా గెటప్ మొదలుకుని ఎక్స్ప్రెషన్స్, నేను మాట్లాడిన యాస, కష్టమైన లొకేషన్లలో షూట్ చేయడం.. ఇలా అన్ని విషయాలనూ గుర్తు చేసి మరీ మెచ్చుకున్నారు.
ఒక కమర్షియల్ సినిమాలో ఇంత నటనను తీసుకురావడం కష్టమన్నారు. ఆ మాటలు మరింత ఆనందాన్నిచ్చాయి. ఇక అవార్డ్ వచ్చిందని తెలియగానే.. సుకుమార్ గారికే ఆ క్రెడిట్ ఇవ్వాలనిపించింది. అందుకే ఆయనతో ‘నేను వైర్ అయితే.. నువ్వు కరెంట్ డార్లింగ్’ అన్నాను. దానికాయన ‘నువ్వు వైర్ కాదు డార్లింగ్.. ఫైర్’ అన్నారు. నాకు అవార్డు రావాలని నాకంటే ఆయనే ఎక్కువ కోరుకున్నారు. ‘పుష్ప’లో నా నటనకు ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులు ఆశ్చర్యపోవాలని ఆయన ఎంతో తపించారు’’ అని బన్నీ తెలిపాడు.
This post was last modified on August 27, 2023 3:56 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…