టాలీవుడ్ బాక్సాఫీస్లో గత నెల అంతా ‘బేబి’ రూల్ సాగింది. జులై 14న విడుదలైన ఆ చిత్రం కొన్ని వారాల పాటు వసూళ్ల మోత మోగించింది. ‘బ్రో’ లాంటి పెద్ద సినిమాను కూడా వెనక్కి నెట్టి ఆ చిత్రం మూడో వారంలో కూడా మంచి షేర్ సాధించడం విశేషం. ఈ నెలలో సూపర్ స్టార్ రజినీకాంత్దే హవా. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన ఆ చిత్రం.. పోటీలో ఉన్న సినిమాలన్నింటినీ పక్కకు నెట్టేసింది. ఆ సినిమా కూడా మూడో వారంలోనూ సత్తా చాటుతోంది.
ఈ వీకెండ్లో ఏకంగా నాలుగు పేరున్న సినిమాలు పోటీకి సై అన్నాయి కానీ.. అందులో ఏ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయింది. ఉన్నంతలో ‘బెదురులంక 2012’ పరిస్థితి మెరుగ్గా ఉంది. దానికి వసూళ్లు పర్వాలేదు. కన్నడ అనువాద చిత్రం ‘బాయ్స్ హాస్టల్’ అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోతోంది. గాండీవధారి అర్జున, కింగ్ ఆఫ్ కోతా వాషౌట్ అయిపోయాయి.
‘జైలర్’తో పాటు ఈ వారం సినిమాలు కూడా వచ్చే వారం వరకు నిలిచే పరిస్థితి లేదు. తర్వాతి వారానికి షెడ్యూల్ అయిన ‘ఖుషి’ మీదికి అందరి దృష్టి మళ్లబోతోంది. ఈ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అదిరిపోయే పాటలు సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చాయి. ట్రైలర్ కూడా బాగానే సాగడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విజయ్ చివరి చిత్రం ‘లైగర్’, సమంత లాస్ట్ మూవీ ‘శాకుంతలం’ పెద్ద డిజాస్టర్లు అయినప్పటికీ.. వాటి ఎఫెక్ట్ ‘ఖుషి’ మీద పడలేదు. ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. సినిమాపై హైప్ కూడా బాగానే ఉండటంతో భారీ ఓపెనింగ్స్ ఖాయం అని స్పష్టమవుతోంది. బాక్సాఫీస్ దగ్గర కూడా లైన్ క్లియరైంది కాబట్టి.. ఎటొచ్చీ కావాల్సింది పాజిటివ్ టాక్ మాత్రమే. ట్రైలర్ చూస్తే మినిమం గ్యారెంటీ మూవీలా ఉంది. మరి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం విజయ్ కెరీర్లో ‘ఖుషి’ బిగ్గెస్ట్ హిట్గా నిలిచే అవకాశాలున్నాయి.
This post was last modified on August 27, 2023 12:39 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…