టాలీవుడ్ బాక్సాఫీస్లో గత నెల అంతా ‘బేబి’ రూల్ సాగింది. జులై 14న విడుదలైన ఆ చిత్రం కొన్ని వారాల పాటు వసూళ్ల మోత మోగించింది. ‘బ్రో’ లాంటి పెద్ద సినిమాను కూడా వెనక్కి నెట్టి ఆ చిత్రం మూడో వారంలో కూడా మంచి షేర్ సాధించడం విశేషం. ఈ నెలలో సూపర్ స్టార్ రజినీకాంత్దే హవా. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన ఆ చిత్రం.. పోటీలో ఉన్న సినిమాలన్నింటినీ పక్కకు నెట్టేసింది. ఆ సినిమా కూడా మూడో వారంలోనూ సత్తా చాటుతోంది.
ఈ వీకెండ్లో ఏకంగా నాలుగు పేరున్న సినిమాలు పోటీకి సై అన్నాయి కానీ.. అందులో ఏ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయింది. ఉన్నంతలో ‘బెదురులంక 2012’ పరిస్థితి మెరుగ్గా ఉంది. దానికి వసూళ్లు పర్వాలేదు. కన్నడ అనువాద చిత్రం ‘బాయ్స్ హాస్టల్’ అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోతోంది. గాండీవధారి అర్జున, కింగ్ ఆఫ్ కోతా వాషౌట్ అయిపోయాయి.
‘జైలర్’తో పాటు ఈ వారం సినిమాలు కూడా వచ్చే వారం వరకు నిలిచే పరిస్థితి లేదు. తర్వాతి వారానికి షెడ్యూల్ అయిన ‘ఖుషి’ మీదికి అందరి దృష్టి మళ్లబోతోంది. ఈ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అదిరిపోయే పాటలు సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చాయి. ట్రైలర్ కూడా బాగానే సాగడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విజయ్ చివరి చిత్రం ‘లైగర్’, సమంత లాస్ట్ మూవీ ‘శాకుంతలం’ పెద్ద డిజాస్టర్లు అయినప్పటికీ.. వాటి ఎఫెక్ట్ ‘ఖుషి’ మీద పడలేదు. ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. సినిమాపై హైప్ కూడా బాగానే ఉండటంతో భారీ ఓపెనింగ్స్ ఖాయం అని స్పష్టమవుతోంది. బాక్సాఫీస్ దగ్గర కూడా లైన్ క్లియరైంది కాబట్టి.. ఎటొచ్చీ కావాల్సింది పాజిటివ్ టాక్ మాత్రమే. ట్రైలర్ చూస్తే మినిమం గ్యారెంటీ మూవీలా ఉంది. మరి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం విజయ్ కెరీర్లో ‘ఖుషి’ బిగ్గెస్ట్ హిట్గా నిలిచే అవకాశాలున్నాయి.
This post was last modified on August 27, 2023 12:39 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…