టాలీవుడ్ బాక్సాఫీస్లో గత నెల అంతా ‘బేబి’ రూల్ సాగింది. జులై 14న విడుదలైన ఆ చిత్రం కొన్ని వారాల పాటు వసూళ్ల మోత మోగించింది. ‘బ్రో’ లాంటి పెద్ద సినిమాను కూడా వెనక్కి నెట్టి ఆ చిత్రం మూడో వారంలో కూడా మంచి షేర్ సాధించడం విశేషం. ఈ నెలలో సూపర్ స్టార్ రజినీకాంత్దే హవా. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన ఆ చిత్రం.. పోటీలో ఉన్న సినిమాలన్నింటినీ పక్కకు నెట్టేసింది. ఆ సినిమా కూడా మూడో వారంలోనూ సత్తా చాటుతోంది.
ఈ వీకెండ్లో ఏకంగా నాలుగు పేరున్న సినిమాలు పోటీకి సై అన్నాయి కానీ.. అందులో ఏ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయింది. ఉన్నంతలో ‘బెదురులంక 2012’ పరిస్థితి మెరుగ్గా ఉంది. దానికి వసూళ్లు పర్వాలేదు. కన్నడ అనువాద చిత్రం ‘బాయ్స్ హాస్టల్’ అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోతోంది. గాండీవధారి అర్జున, కింగ్ ఆఫ్ కోతా వాషౌట్ అయిపోయాయి.
‘జైలర్’తో పాటు ఈ వారం సినిమాలు కూడా వచ్చే వారం వరకు నిలిచే పరిస్థితి లేదు. తర్వాతి వారానికి షెడ్యూల్ అయిన ‘ఖుషి’ మీదికి అందరి దృష్టి మళ్లబోతోంది. ఈ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అదిరిపోయే పాటలు సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చాయి. ట్రైలర్ కూడా బాగానే సాగడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విజయ్ చివరి చిత్రం ‘లైగర్’, సమంత లాస్ట్ మూవీ ‘శాకుంతలం’ పెద్ద డిజాస్టర్లు అయినప్పటికీ.. వాటి ఎఫెక్ట్ ‘ఖుషి’ మీద పడలేదు. ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. సినిమాపై హైప్ కూడా బాగానే ఉండటంతో భారీ ఓపెనింగ్స్ ఖాయం అని స్పష్టమవుతోంది. బాక్సాఫీస్ దగ్గర కూడా లైన్ క్లియరైంది కాబట్టి.. ఎటొచ్చీ కావాల్సింది పాజిటివ్ టాక్ మాత్రమే. ట్రైలర్ చూస్తే మినిమం గ్యారెంటీ మూవీలా ఉంది. మరి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం విజయ్ కెరీర్లో ‘ఖుషి’ బిగ్గెస్ట్ హిట్గా నిలిచే అవకాశాలున్నాయి.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…