అభిమానులు మెగా ప్రిన్స్ గా పిలుచుకునే వరుణ్ తేజ్ టైం అస్సలు బాగున్నట్టు లేదు. కుర్రాడు ఎంత కష్టపడుతున్నా దానికి తగ్గ ఫలితం రావడం లేదు. పోనీ ఏదో యావరేజ్ లైనా వస్తే ఏదోలే అనుకోవచ్చు. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కు తేలేనంత దారుణంగా డిజాస్టర్లు పడుతుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. గత ఏడాది గని కోసం వరుణ్ ఒళ్ళు బాగా హూనం చేసుకున్నాడు. బాక్సర్ గా కనిపించాలని చాలా కఠినమైన కసరత్తులు వర్కౌట్లు చేశాడు . తీరా చూస్తే బ్రేక్ ఈవెన్ మాట దేవుడెరుగు థియేటర్ బిజినెస్ లో కనీసం సగం కూడా వెనక్కు రాలేదు.
తాజాగా గాండీవధారి అర్జున సైతం ఇదే బాట పట్టింది. గనికి కనీసం డీసెంట్ ఓపెనింగ్స్ దక్కాయి. కానీ ఇప్పుడీ స్పై థ్రిల్లర్ కు అవి కూడా రాలేదు. జనం ఈ గూఢచారి మూవీ పట్ల ఎంత మాత్రం ఆసక్తిగా లేరని మార్నింగ్ షో నుంచే బయట పడిపోయింది. చాలా చోట్ల సగం హాళ్లు కూడా నిండకపోవడం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోయింది. కనీసం మెగా ఫ్యాన్స్ వచ్చినా కొంచెం బెటర్ గా ఉండేది కానీ వాళ్లే దూరంగా ఉన్నారంటే దీనికి వచ్చిన బజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ టాక్, రివ్యూలు ఎంత మాత్రం ఆశాజనకంగా లేకపోవడం ఫలితం మీద మరింత ప్రభావం చూపిస్తోంది.
విభిన్న కథలను ఎంచుకోవడం మంచిదే కానీ వాటి బాక్సాఫీస్ స్టామినాని లెక్కలేసుకోవడం ప్రతి హీరోకు అవసరం. లైన్ వినగానే ఎగ్జైట్ అయిపోయి దర్శకుడిని గుడ్డిగా నమ్మడం వల్ల పరిస్థితి ఎలా ఉంటుందో ముందస్తుగా చూసుకోవాలి. పెదనాన్న చిరంజీవికే భోళా శంకర్ రూపంలో దారుణ పరాభవం తప్పలేదు. అలాంటిది వరుణ్ తేజ్ కు ఈ సిచువేషన్ అనూహ్యం ఏమీ కాదు. మళ్ళీ ఫిదా, తొలిప్రేమ తరహా సాఫ్ట్ స్టోరీస్ చేస్తేనే మెగా ప్రిన్స్ గాడిలో పడేటట్టు ఉన్నాడు. డిసెంబర్ లో రాబోయే ఆపరేషన్ వాలెంటైన్ కూడా ఎయిర్ స్పేస్ యాక్షన్ థ్రిల్లర్. ఇదైనా కోరుకున్న బ్రేక్ ఇస్తే అదే పది వేలంటున్నారు ఫ్యాన్స్.
This post was last modified on August 26, 2023 9:03 am
వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…
నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…
రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…
ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…
కాలు జారితే తీసుకోవచ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవడం కష్టం. పైగా ఇది పరువు, ప్రతిష్టలకు కూడా సంబంధించిన…
ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస..…