అభిమానులు మెగా ప్రిన్స్ గా పిలుచుకునే వరుణ్ తేజ్ టైం అస్సలు బాగున్నట్టు లేదు. కుర్రాడు ఎంత కష్టపడుతున్నా దానికి తగ్గ ఫలితం రావడం లేదు. పోనీ ఏదో యావరేజ్ లైనా వస్తే ఏదోలే అనుకోవచ్చు. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కు తేలేనంత దారుణంగా డిజాస్టర్లు పడుతుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. గత ఏడాది గని కోసం వరుణ్ ఒళ్ళు బాగా హూనం చేసుకున్నాడు. బాక్సర్ గా కనిపించాలని చాలా కఠినమైన కసరత్తులు వర్కౌట్లు చేశాడు . తీరా చూస్తే బ్రేక్ ఈవెన్ మాట దేవుడెరుగు థియేటర్ బిజినెస్ లో కనీసం సగం కూడా వెనక్కు రాలేదు.
తాజాగా గాండీవధారి అర్జున సైతం ఇదే బాట పట్టింది. గనికి కనీసం డీసెంట్ ఓపెనింగ్స్ దక్కాయి. కానీ ఇప్పుడీ స్పై థ్రిల్లర్ కు అవి కూడా రాలేదు. జనం ఈ గూఢచారి మూవీ పట్ల ఎంత మాత్రం ఆసక్తిగా లేరని మార్నింగ్ షో నుంచే బయట పడిపోయింది. చాలా చోట్ల సగం హాళ్లు కూడా నిండకపోవడం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోయింది. కనీసం మెగా ఫ్యాన్స్ వచ్చినా కొంచెం బెటర్ గా ఉండేది కానీ వాళ్లే దూరంగా ఉన్నారంటే దీనికి వచ్చిన బజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ టాక్, రివ్యూలు ఎంత మాత్రం ఆశాజనకంగా లేకపోవడం ఫలితం మీద మరింత ప్రభావం చూపిస్తోంది.
విభిన్న కథలను ఎంచుకోవడం మంచిదే కానీ వాటి బాక్సాఫీస్ స్టామినాని లెక్కలేసుకోవడం ప్రతి హీరోకు అవసరం. లైన్ వినగానే ఎగ్జైట్ అయిపోయి దర్శకుడిని గుడ్డిగా నమ్మడం వల్ల పరిస్థితి ఎలా ఉంటుందో ముందస్తుగా చూసుకోవాలి. పెదనాన్న చిరంజీవికే భోళా శంకర్ రూపంలో దారుణ పరాభవం తప్పలేదు. అలాంటిది వరుణ్ తేజ్ కు ఈ సిచువేషన్ అనూహ్యం ఏమీ కాదు. మళ్ళీ ఫిదా, తొలిప్రేమ తరహా సాఫ్ట్ స్టోరీస్ చేస్తేనే మెగా ప్రిన్స్ గాడిలో పడేటట్టు ఉన్నాడు. డిసెంబర్ లో రాబోయే ఆపరేషన్ వాలెంటైన్ కూడా ఎయిర్ స్పేస్ యాక్షన్ థ్రిల్లర్. ఇదైనా కోరుకున్న బ్రేక్ ఇస్తే అదే పది వేలంటున్నారు ఫ్యాన్స్.
This post was last modified on August 26, 2023 9:03 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…