Movie News

రామాయణం వద్దంటున్న RRR సీత

ఆదిపురుష్ మీద బోలెడన్ని విమర్శలు, వివాదాలు వచ్చినప్పటికీ ఇతర దర్శక నిర్మాతలకు రామాయణం గాథ మీద సినిమాలు తీయాలన్న మోజు పోవడం లేదు. అయోధ్య రామాలయం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ చారిత్రక ఘట్టానికి ఒక వెండితెర జ్ఞాపకంగా ప్యాన్ ఇండియా మూవీని ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రొడ్యూసర్ మధు మంతెన ఈ రమణీయ కథని మూడు భాగాలుగా తెరకెక్కించాలని కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాముడిగా రన్బీర్ కపూర్, సీతగా అలియా భట్, రావణుడిగా కెజిఎఫ్ యష్ లను పెట్టుకోవాలని ఆ మేరకు వాళ్ళతో చర్చల్లో ఉన్నారు.

తాజాగా వచ్చిన ట్విస్టు ఏంటంటే అలియా భట్ ఇప్పుడీ ప్రాజెక్టుకు నో చెప్పిందట. అదేంటి భర్తతో అందులోనూ అంత పవిత్రమైన ఇతిహాసంలో నటించే ఛాన్స్ వస్తే ఎందుకు వద్దంటోందనే సందేహం వచ్చిందా. దానికి పలు కారణాలు ఉన్నాయట. మొదటిది దీనికి సరిపడా డేట్లు ఇవ్వడానికి అలియా సుముఖంగా లేదు. దర్శకులు నితీష్ తివారి – రవి ఉద్యావర్ ఎంతగా కన్విన్స్ చేయాలని చూస్తున్నా ఆమె ఒప్పుకోవడం లేదని ముంబై రిపోర్ట్. అంతే కాదు యష్ కూడా ఇటు ఎస్ చెప్పక, అటు నో చెప్పక బాగా నానుస్తున్నాడని దీని వల్ల డిసెంబర్ లో మొదలుపెట్టడం సాధ్యం కాదట.

వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న ఈ రామాయణాన్ని ఎవరూ మరిపించలేనంత గొప్పగా తీయాలని కంకణం కట్టుకున్నారు. తీరా చూస్తే ఇన్నేసి అడ్డంకులు. ఆదిపురుష్ ఫలితం ఎలా ఉన్నా అవన్నీ ఓం రౌత్ చేసిన తప్పులు కాబట్టి. అలా రిపీట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుని, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కాకుండా రియల్ విజువల్ ఎఫెక్ట్స్ తో తీయాలని ప్లాన్ చేసుకున్నారట. సరే అలియా వద్దంటే ఇప్పుడా స్థానంలో వేరొకరిని తీసుకోవడం పెద్ద సవాలే. మృణాల్ ఠాకూర్, కియారా అద్వానీ లాంటి రెండు మూడు ఆప్షన్లు పెట్టుకున్నారు కానీ చివరికి ఎవరికి ఆ గొప్ప పాత్ర దక్కుతుందో చూడాలి.

This post was last modified on August 23, 2023 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

35 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

1 hour ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago