మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ముందు ప్రకటించినట్లే చిరు 157వ సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా గురించి నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిన్న అర్ధరాత్రే హింట్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం కాన్సెప్ట్ పోస్టర్ లాంచ్ చేశారు. దాని మీద దర్శకుడు వశిష్ఠ పేరు కూడా పడిపోయింది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా ఫాంటసీ మూవీ ఇది అని జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. పోస్టర్ డిజైన్ జానర్కు తగ్గట్లే చేశారు.
పంచభూతాల చుట్టూ తిరిగే కథ ఇదనే సంకేతాలను పోస్టర్లో ఇచ్చారు. మొత్తానికి ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ఠ తొలి సినిమా శైలిలోనే చిరుతో సినిమా చేయబోతున్నారని స్పష్టమైంది. ఈ యువ దర్శకుడిగా ఇది గోల్డెన్ ఛాన్స్ అనడంలో సందేహం లేదు. చిరు తన స్థాయికి తగ్గ సినిమాలు చేయట్లేదని.. ఔట్ డేటెడ్ డైరెక్టర్లతో జట్టు కడుతున్నాడని ఫీలవుతున్న చిరు అభిమానులకు కూడా ఈ కాంబినేషన్ ఉపశమనాన్ని ఇస్తోంది.
మొత్తానికి చిరు 157వ సినిమా విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కానీ అంతకంటే ముందు మెగాస్టార్ చేయాల్సిన సినిమా విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని చిరు తనయురాలు సుష్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ బేనర్ మీద నిర్మించబోతున్న విషయంలో ఇంతకముందే ఖరారైంది. చిరు సైతం ఒక ఈవెంట్లో ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ చిత్రం మలయాళ హిట్ ‘బ్రో డాడీ’కి రీమేక్ అని.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేస్తాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే ఇటీవల స్క్రిప్టులో మార్పులు.. డైరెక్టర్ ఛేంజ్ అంటూ రూమర్లు వినిపించాయి. చిత్ర వర్గాలు ఆ ప్రచారాన్ని అనధికారికంగా ఖండించాయి. ఐతే చిరు పుట్టిన రోజుకు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. జస్ట్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ తరఫున చిరుకు విషెస్ చెప్పారు. అది కూడా ‘గాడ్ ఫాదర్’లోని చిరు లుక్తో. అంతే తప్ప కొత్త సినిమా గురించి కబురేమీ లేదందులో. పోస్టర్ మీద ‘మెగా 156’ అని లేదు. దర్శకుడి పేరూ లేదు. దీంతో ఈ ప్రాజెక్టు మీద మళ్లీ సందేహాలు ముసురుకుంటున్నాయి.
This post was last modified on August 22, 2023 3:17 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…